Sunday 27 August 2017

నంద్యాల నుంచే నాంది

రాష్ట్ర విభజన తరువాత జరిగిన మొదటి ఉప ఎన్నికలలో  గెలుపు పై రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా జగన్ కు ఇది ఓ ఛాలెంజ్..  అయితే గెలుపు ఎవరిదనేది ఇక కొన్ని గంటల్లోనే తేలనుంది..

Thursday 30 July 2015

నేనేం మారాలా.. అన్న జగన్ మారకపోతే నష్టమంటున్న అనుచరగణం


రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు బలంగా కనిపించిన వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పరాజం తరువాత ఇంతవరకు కోలుకున్న దాఖలాలు కనబడలేదు. నాయకులు, కార్యకర్తలు డీలాపడ్డారు. వైయస్ సానుభూతినే నమ్ముకొని బరిలో దిగిన వారికి ప్రజలు ఆ అంశం కన్నా విడిపోయిన తరువాత రాష్ట్ర రాజధాని నిర్మాణం మరియు అభివృద్ధి ముఖ్యమని తెలుగు దేశం పార్టీని భుజాలకెత్తుకున్నారు.  గత సంవత్సరం తెలుగుదేశం పరిపాలనలో రాష్ట్ర  ప్రజలు రాజధాని ఎంపిక , అభివృద్ధి తదితర అంశాలనే పరిశీలిస్తున్నారు.

రాజధాని ఎంపికలోనూ, అభివృద్దిలోనూ పాలకపక్షానికి సహకరించని ప్రతిపక్షం దీక్షల పేరుతో భూములు లాక్కుంటున్నారని పోరాడింది. ఈ పోరాటం రాజధానికి వ్యతిరేకమని జనంలో అభిప్రాయం ఏర్పడింది. అలాగే పట్టిసీమ కు వ్యతిరేకంగా పోరాడితే రాయలసీమకు నీరందిస్తుంటే వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం పాలక పక్షం జనంలోకీ విజయవంతంగా తీసుకు వెళ్ళగలిగింది. దీంతో వైయస్ఆర్ పార్టీ మరింత నీరసించిపోతుంది. దీనిని ఇటీవల జగన్ కూడా గుర్తించినట్టే వున్నారు. దీనికంతటికీ కారణం జగన్ ఒంటెద్దు పోకడ అనేది అందరూ భావిస్తున్నారు. ఏదైనా పోరాటమంటే రెండు రోజులు దీక్షలు, యాత్రలు చేయడం కాదని ప్రజల భాగస్వామ్యం అవసరమని అందరూ భావిస్తున్నారు. దీంతో జగన్ కూడా తాను కూడా ఏదైనా మారాలేమోననే ఆలోచనలో పడ్డట్టు వున్నారు. మారాలని కార్యకర్తలూ కోరుకుంటున్నారు. 

Tuesday 28 July 2015


రాజధాని నిర్మాణం బాబు స్వంత వ్యవహారమా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తరువాత రాజధాని లేకుండా పోయింది. హైదరాబాదు పై సర్వహక్కులు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ వాసులు వచ్చే తరానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయామనే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి శాసనసభ ఎన్నికలలో గెలిపించారు. చంద్రబాబుకు వున్న విజన్ దీనికి తోడయ్యంది. రాజధానిగా విజయవాడ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం. కృష్ణా, గుంటూరు జిల్లాలు కలసి వుండడం, కృష్ణానదీ పరీవాహక ప్రాంతం కావడంతో పాటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంతాలు కంచుకోటగా వుండడం కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి. అయితే రాజధానికి అమరావతి పేరు పెట్టడం కూడా అందరూ మెచ్చారు. అయితే రాజధానిభూమి పూజకు అందరినీ కలుపుకుపోలేదనే విమర్శలు వున్నాయి. రాజధాని నిర్మాణంలో ప్రతిపక్షం నేత జగన్ ను కూడా కలుపుకొని, ప్రతిపక్షాలతో కూడా సలహా కమిటీ ఏర్పాటు చేసి ఇది పార్టీ వ్యవహారం కాదని ప్రజలందరికోసం అందరం కలసి పనిచేస్తున్నామనే భావన కల్పించాలి. సింగపూర్ వారి రాజధాని ప్రణాళిక కూడా అందరూ మెచ్చారు. అయితే ఇంత పెద్ద ఆశలు రేపిన తరువాత రాజధాని నిర్మాణం ఆశల మేరకు పూర్తి అవ్వడం కూడా ముఖ్యమే.

Friday 10 May 2013

వచ్చే ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎవరిది ??



  సాధారణంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఆ పార్టీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న వారు ఎన్నికలలో నాయకత్వం వహిస్తుంటారు. మన రాష్ట్రం  విషయానికి వస్తే వచ్చే 2014 ఎన్నికలలో నాయకత్వం కోసం పోటీ మొదలయింది. ఎందుకంటే ఎన్నికలకు నాయకత్వం వహించే వారే ఒక వేళ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుంటుంది . రాష్ట్ర కాంగ్రెస్ లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జనాకర్షణ వున్న నాయకుడు లేడు. అయితే అధిష్టానం అండదండలతో ముఖ్యమంత్రి పీఠం పై వున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపిస్తాడని ఎవరూ అనుకోవడం లేదు. అందుకని పనిలో పనిగా వచ్చే ఎన్నికలలో అయినా నాయకత్వం కోసం ఒక ప్రక్క బొత్స సత్యనారాయణ మరో ప్రక్క చిరంజీవి పావులు కదుపడం మొదలు పెట్టారు. తమ వారితో ఈవిషయమై చిరంజీవి మాట్లాడిస్తున్నట్టు బోగట్టా. మంత్రి హోదాలో వుండి కూడా సి. రామచంద్రయ్య తరచూ చిరంజీవి వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఆయన నాయకత్వంలో ఎన్నికలు ఎదుర్కుంటే పార్టీ తప్పక గెలుస్తుందని ఆయన చెబుతున్నారు. అయితే జనం నాయకులు ఎవరు మారినా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పలేం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు పోటీ నిలుస్తున్న వై.యస్.ఆర్ పార్టీ ఓట్లను ఎంతవరకు చీల్చగలిగితే అంత కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది.  వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ గెలుస్తుందో లేదో చెప్పడం కన్నా ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలను మాత్రం పెంచుతున్నదని నిరూపితమవుతోంది. 

Sunday 17 June 2012

భ్రమించిన బి.జె.పి కి భంగపాటు


దక్షిణ భారత దేశంలో అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పట్టు నిలుపుకోవాలనుకున్న బి.జె.పి కి పరకాలలో ఓటమితో భంగపాటు జరిగింది. ఇంతకు మునుపు మహబూబ్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికలలో టి.ఆర్.యస్ పై గెలిచి తెలంగాణా సాధన మాకే సాధ్యమని, తమది జాతీయ పార్టీ అని, ఇది వరకే మూడు రాష్ట్రాలు ఇచ్చిన చరిత్ర చూసి జనం తమను గెలిపించారని బి.జె.పి భావించింది. అంతేగాక పరకాలలో టి.ఆర్.యస్ తో సంబంధాలు బెడిసి కొట్టడంతో జె.ఏ.సి మద్ధతు ఇవ్వకపోయినా పరకాలలో తామే గెలుస్తామని బీరాలు పలికింది. ఈ పరకాలలో పాగా వేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడే తిష్టవేసి ప్రచారాన్ని పర్యవేక్షించారు కూడా. అంతేగాకుండా జాతీయనాయకురాలైన సుష్మా స్వరాజ్ ను రప్పించి బహిరంగ సభ కూడా నిర్వహించారు. అయితే 12న జరిగిన ఉప ఎన్నికలలో పోటీ ప్రధానంగా టి.ఆర్.యస్ కు వై.యస్. ఆర్ పార్టీలకు మధ్యే సాగడంతో బి.జె.పి కి పరాజయంతో పాటు పరాభవం మిగిలినదనే చెప్పాలి.

ఈ గెలుపు వాపా ? బలుపా?



పలు రకాల అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు జగన్ జైలు పాలయినా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలలో గెలుపొంది రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు కొందరికి ఖేదం కాగా మరికొందరికి మోదం అవుతున్నది. ఈ ఉప ఎన్నికలు నీతికి, అవినీతికి అని, విస్వసనీయతకు, అవిస్వనీయతకు మధ్య పోరని పలు రకాలుగా ఎన్నికలకు ముందు వివిధ రకాల పార్టీలు ప్రచారం చేసుకున్నా ఓటరు దేవుడు వై.యస్.ఆర్ పార్టీకే ఓటు వేయడం జరిగింది. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం, టి.ఆర్.యస్ లు ఈ ఫలితాలను జీర్ణించుకోలేపోతున్నాయి. ఈ ఫలితాలు కేవలం సానుభూతి పవనాల వల్ల వచ్చిందని, విజయమ్మ, షర్మిల కన్నీరు వల్ల వచ్చిందని సమాధానం చెప్పుకుంటున్నాయి . కాని వాటితో పాటు ఈ పాలక, ప్రతి పక్షాలు చేసిన పొరపాట్లే జగన్ పార్టీ జైత్రయాత్రకు సోపానాలయ్యాయి.  కాంగ్రెస్ పార్టీ  అంటున్నట్టు కర్ణుడి చావుకు కారణాల లాగా ఈ క్రింది కారణాలు అటు జగన్ కు తోడ్పడగా కాంగ్రెస్ కు తెలుగుదేశం ల పరాజయానికి కారణాలయ్యాయు
  • ఎఫ్.ఐ.ఆర్ లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి పేరు వ్రాసినందులకు రాజీనామా చేసినప్పుడు, అందుకు నిరసన వ్యక్తం చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి తమ వాడేనని ఆయన తప్పు లేదని తొలుత కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఉప ఎన్నికలు మొదలు కాగానే వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా ముద్దాయేనని తెరవెనుక లాలూచీలు జరిగాయని విమర్శించాయి.
  • ఎ.సి.బి .ద్వారా మధ్యం సిండికేట్ల పై ఎ.సి.బి దాడులు జరుగడం . అందులో బొత్స సత్యనారాయణ పై ఆరోపణలు రావడం. ఈ కేసులో మోపిదేవి వెంకటరమణ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన పై పలు ఆరోపణలు రావడం, బొత్స సత్యనారాయణ అధిష్టానంతో చర్చించిన మీదట ఆయనపై ఎలాంటి విచారణ జరుపకపోగా ఎ.సి.బి. అధికారి శ్రీనివాస్ ను అకస్మాత్తుగా ప్రమోషన్ పై బదిలీ చేయడం. కొద్దిరోజుల వ్యవధిలో అడిషనల్ డి.జి.పి అధికారి పై  ఇంకో అధికారిని నియమించి ఆయన అధికారాలకు కత్తెర వేయడం
  • ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి ల మధ్య సమైక్యత లేకపోవడంతో వాయలార్ రవి రావలసి రావడం.
  • సాక్షి మీడియా అకౌంట్లను సీజ్ చేయడం దానిపై పత్రికా స్వేచ్చని ప్రచారం జరిగి జగన్ ను అణగద్రొక్కడానికి కుట్ర చేస్తున్నట్టు జనం నమ్మడం
  • సి.బి.ఐ జగన్ ను ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక అరెస్టు చేయడం , ముందుగానే అరెస్టు చేసి ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వేరేగా ఉండేవి.
  • ఎన్నికల ముందురోజు కావాలనే దొంగల బండి ఎక్కించడం దానిపై సాక్షి టి.వి కధనాలు అంతకు ముందు అవినీతి పై అరెస్టు అయిన వ్యక్తి గురించి మీడియా ఎక్కువ ప్రచారం కల్పించడం.
  • టి.ఆర్.యస్ . బి.జె.పి పై దృష్టి పెట్టి వై.యస్.ఆర్ పార్టీని పెద్దగా పట్టించుకోకుండా ఆ పార్టీకి సానుకూలంగా వ్యవహరించి చివరి నిమిషంలో విమర్శలు చేయడం. అంతకు ముందే టి.ఆర్.యస్ , జగన్ పార్టీలు కుమ్ముక్కయ్యాయని ప్రచారం చేయడం.
  • తెలుగుదేశం అధినేత జనంలో విస్తృతంగా తిరిగినా జనం సమస్యలపై పోరాడకుండా కేవలం అవినీతి పైననే మాట్లాడటం, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉప ఎన్నికలలో పట్టుదలగా పనిచేయకపోవడం
  • వై.యస్.రాజశేఖర్ రెడ్డి పై జనంలో ఇంకా ఉన్న ఇమేజ్ ప్రధాన కారణంగా ఉంది. ఆయన చావును మళ్ళీ చర్చించి పదే పదే ఆ దృశ్యాలను చూపడం , సాక్షి టీ.వీ , పేపరులో కథనాలు  , ప్రభుత్వం పై , ప్రతిపక్షం పై అవినీతి కథనాలు ప్రచురింపడం వై.యస్.ఆర్ పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాస్తులపై కేసు వేస్తే దానిపై సి.బి.ఐ స్పందించిన తీరు , అలాగే చంద్రబాబు స్టే తెచ్చుకోవడం దీనివల్ల ఎవరు అవినీతి చేయలేదనే అభిప్రాయం ప్రబలింది.
  • ప్రజారాజ్యం పార్టీ ఓట్లన్ని చిరంజీవి ఇమేజ్ తగ్గుముఖం పట్టడంతో అది జగన్ కు బదిలీ కావడం. ఎన్నికలు కొద్దిరోజులు ముందే చిరంజీవి కూతురు ఇంటిలో కోట్లాది రూపాయల నగదు ఐ.టి. అధికారులకు పట్టుబడటం. దానిపై వై.యస్.ఆర్ పార్టీ ప్రచారాన్ని జనం నమ్మడం.
  • ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సక్రమంగా లేకపోవడం. సరైన ఇమేజ్ ఉన్న నాయకత్వం లేకపోవడం, కరెంటు కోతలు, విద్యుత్ చార్జీలు పెంపు, పెట్రోలు ధరల పెంపు, వ్యాట్ పెంపు లతో పాటు వేసవిలో నీటి ఎద్దడి మరియు నిత్యావసరాల వస్తువుల ధరలు అమాంతగా పెరగడం
  • ప్రభుత్వంలో ని దాదాపు ఆరేడుమంది మంత్రులు కూడా అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్నప్పుడు కేవలం ప్రభుత్వం జగన్ నే విమర్శించడం . కేవలం మోపిదేవినే అరెస్టు చేసింది జగన్ అరెస్టుకే నని జనం నమ్మడం
  • కోర్టు ఆదేశాల మేరకే జగన్ అరెస్టు జరిగిందని కాకుండా ఆ కేసుల విచారణ కేవలం కాంగ్రెస్ అధిష్టానం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేసిందని ,. ఓదార్పు యాత్ర చేయడం వారికి ఇష్టం లేదని ప్రచారం జరుగడం.
  • వీటితో పాటు జగన్ అరెస్టయిన సందర్భంలో వారి తల్లి విజయమ్మ, షర్మిల ల ప్రచారం , వారు చేసిన ఆరోపణలు , వారి కన్నీటి పట్ల జనంలో సానుభూతి పెల్లు బికడం లాంటివి కూడా బాగా తోడ్పడ్డాయి.
జగన్ గెలుపు బలం కాదని కేవలం వాపని కొందరు అంటున్నారు. ఇది పాల పొంగని కేవలం ఈ ఎన్నికలకే పరిమితమని చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు చేసిన వివిధ పొరపాట్లు జగన్ నెత్తిన పాలు పోసినట్టే ఇలాగే కొనసాగితే 2014 లోనూ ఆ పార్టీలకు పరాభవం తప్పదు. 

Friday 15 June 2012

జగన్ పార్టీ జయకేతనం



అందరూ ఊహించినట్టే జరిగింది. 12 వతేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వై.యస్.ఆర్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 18 అసెంబ్లీ స్థానాలకు గాను 15 మరియు ఎన్నికలు జరిగిన ఒకే ఒక లోకసభ స్థానంలోనూ ఆపార్టీ గెలుపొందడం జరిగింది. అదే విధంగా తెలంగాణా ప్రాంతానికి చెందిన పరకాలలో కూడా తృటిలో ఓడినా గెలిచినంత పనిచేసి టి.ఆర్.యస్ కు చుక్కలు చూపించింది. జగన్ పార్టీ గెలుపుపై ఎవరికీ సందేహం లేదు. ఎందుకంటే ఆ పార్టీ నిలబెట్టిన వారంతా సిటింగ్ యం.ఎల్.ఏలు . అయితే వాటిలో అన్ని స్థానాలు గెలిచి సత్తా చాటాలని ప్రయత్నించినా కాంగ్రెస్ రెండు స్థానాలలో అడ్డుకోగలిగింది. అలాగే తెలుగు దేశం దాదాపు 10 స్థానాలలో కాంగ్రెస్ కన్నా ముందున్నా ఒక సీటు కూడా దక్కలేదు. ఆ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు ఆశనిపాతమే.  ఈ ఎన్నికల అంశంగా మారిన జగన్ అవినీతి కన్నా ఆయనను అరెస్టు చేయడం తల్లి, చెల్లి, కన్నీరు, లాంటి సానుభూతి అంశాలు ఎక్కువగా పనిచేశాయి. దీనికి ఉదాహరణగా పరకాలను చెబుతున్నారు. టి.ఆర్.యస్ సులభంగా ఎక్కువ మెజారిటీతో గెలవాలసిన స్థానంలో చెమటోడ్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సానుభూతి పవనాల వల్లే ప్యాన్ గుర్తుకు అన్ని ఓట్లు పడ్డాయని టి.ఆర్.యస్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ జైలులో ఉన్నా ఆ పార్టీ గెలుపొందడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి ఇదే సానుకూలంగా ఉపయోగపడిందని వేరే చెప్పనక్కరలేదనుకుంటా..