Thursday, 17 November 2011

సుప్రీం కోర్ట్ స్టే కు చంద్ర బాబు యత్నం





తెలుగు దేశం అధినేత సి.బి. ఐ. విచారణకు హై కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల స్టే కోసం సుప్రీం కోర్ట్ కు వెళ్లనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వున్నా పరిస్తితులలో విచారణ జరిగితే కాంగ్రెస్ తమను బంతాట ఆదుకుంటుందని తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. స్టే కోసం చంద్ర బాబు తనంతట తానూ ప్రయత్నిచడం లేదనే విధమైన భావన ఏర్పరచి , పార్టి నిర్ణయం మేరకే స్టే వెళుతున్నట్టు ప్రకటించబోతున్నారు. సుప్రీం కోర్ట్ లో చుక్క ఎదురైనా , స్టే వచ్చిన ఇప్పుడున్న పరిస్తితికి మించి దిగాజారక పోవచ్చు. ఒక వేళ సి. బి. ఐ. విచారణ జరిగితే చిన్న లోపాలు, తప్పులున్నా అవి పెద్దవి కావొచ్చని అప్పుడు పార్టి మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చని అంటున్నారు. చంద్ర బాబు సచ్చీలుడుగా భయటపడితే ఆ పార్టి పై వేరొకరు బురద జల్లేది వుండదు. ఇలా జరిగితే వచ్చే ఎన్నికలలో విజయం నల్లేరు పై నడక అవుతుంది . తద్విర్డుంగా జరిగితే మొదటికే మోసమని పార్టి వర్గాలు అంచాన వేస్తున్నాయి.  చంద్ర బాబు తో పాటు విచారణ ఎదుర్కోనున్న రామోజీ రావు , మురళి మోహన్ తదితరులు కూడా స్టే వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తెలిసి తెలిసి పులి నోట్లో తల పెట్టడానికి చంద్ర బాబు తెగించక పోవచ్చు.





Wednesday, 16 November 2011

చంద్ర బాబు పై సి.బి.ఐ కేసుతో జగన్ కు కష్టకాలం ...



వై. ఎస్. ఆర్ పార్టి తరపున విజయమ్మ చంద్ర బాబు అక్రమ ఆస్తుల విషయమై వేసిన పిటిషన్ పై సి. బి. ఐ విచారణకు ఆదేశించిన విషయం విదితమే . అయితే ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కాంగ్రెస్ ఇక జగన్ పై అరెస్ట్ వేటు వేయనుంది. ఇన్నాళ్ళు జగన్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు అనే సెంటిమెంట్ ఎక్కడ వ్యతిరేకంగా పనిచేస్తే జగన్ కు ప్లుస్ అవుతుందని భావించిన కాంగ్రెస్ సి.బి.ఐ ద్వారా ఇక జగన్ అరెస్ట్ కు సిద్ధం అవుతున్నట్టు భావిస్తున్నారు . ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు జగన్ అరెస్ట్ కాగానే, చంద్ర బాబు పై విచారణ వేగం పెంచి కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడతో పాటు వచ్చే ఎన్నికలలో లబ్ది పాడాలని యోచిస్తున్నట్టు తెలిసింది. చంద్ర బాబు లాంటి నాయకుడిపైననే విచారణ జరుగుతుందంటే .. జగన్ విషయం కూడా తమకు ఎలాంటి సెంటిమెంట్ వర్క్ కాదని కాంగ్రెస్ నమ్ముతోంది. ఒక వేళ జగన్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్, తెలుగుదేశం మ్యాచ్ పిక్సింగ్ జరిగింది  అనుకుంటే చంద్ర బాబు నిర్దోషిగా బయట పడుతాడు. జగన్ గాలి జానార్ధాన్ రెడ్డి లా జైలు పాలు అవుతాడని కొన్ని వర్గాలు అంటున్నాయి. రాబోయే మూడు నెలలలోనే చంద్ర బాబు భవిష్యత్తు తేలనుంది. అయితే చంద్ర బాబు సుప్రేం కోర్ట్ నుండి స్టే తెచ్చుకొనే అవకాశాలు వున్నాయి. ఏది జరిగినా , ఎటు నుండి వెళ్లినా తన వైపు వున్నా ఎం. ఎల్. ఏ లు కూడా కాంగేస్స్ లో చేరిపోతే జగన్ ఒంటరిగా మిగలడం , జైలు పాలు కావడం తప్పదేమో.. కాంగ్రెస్ పాచికలు ఎప్పుడూ అంతగా ఎవ్వరికీ అర్థం కావు.

Tuesday, 15 November 2011

రాటుదేలిన రాజకీయ చాణిక్యం

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలలో వూహ్య, ప్రతి వూహ్యలతో రాజకీయం రాటుదేలిపోయింది. స్వపక్షంలో ఉంటూ విమర్శలు చేయడం .. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడడం అనే కొంత కోణాలు ఎన్నడూ లేనిది చూస్తున్నాము. స్థూలంగా రాష్ట్ర రాజకీయాల పరిస్థితిని వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి మరణం కు ముందు ,ఆ తరువాత రెండు రకాలుగా విభాజిచుకుని పరిశీలించవలసి వుంది. వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు కాంగ్రెస్ పార్టి బలం అసెంబ్లీ లో తగ్గిన ఏ మాత్రం నిర్ణయాల స్పీడు తగ్గలేదు. రాజశేఖర్ రెడ్డి ఒనె మాన్ షో తో అంత ప్రశాంతత కనిపించింది. గుప్తంగా దాగున్న తెలంగాణా సమస్య వుండినా ఆయన తగిన రీతిలో వాటిని కంట్రోల్ చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంగా వుండిన తెలుగుదేశం వై. ఎస్. ఆర్ పై పోరును చేస్తూ కాలం గడుపుతూ వచ్చేది. టి.ఆర్. ఎస్. ఉప ఎన్నికలలలో పోటీ చేసి వున్నా సీట్లు కూడా పోగొట్టుకున్న పరిస్తితి వుండేది. ఎప్పుడైతే వై. ఎస్. ఆర్  మృతి చెందారో అంత వరకు తొక్కిపట్టిన సమస్యలు తెరపైకి వచ్చి వీర విజ్రుమ్బాన చేస్తున్నాయి. అందులో నాయకత్వ సమస్య .. కాంగ్రెస్ పార్టి ముఖ్యమంత్రిగా ఇక అయిపోవచ్చు అని కలలు కన్నా జగన్ కు ఎం. ఎల్. ఏ. ల బలం వున్నా ఆదిస్థానం మొండిచేయి చూపి రోశయ్య ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీంతో పార్టీలో ఇమడలేక ఓదార్పు యాత్ర పేరుతొ తన ఉనికిని చాటుతూ జగన్ జనంలో తిరుగుతూ కాంగ్రెస్ కంట్లో నలుసుగా మారాడు. అయినా కాంగ్రెస్ ఎతులకు పై ఎతులు వేసి జగన్ తనంతట తానే పార్టీని వదిలిపెట్టేలా చేసింది. దీంతో జగన్ కొత్తగా వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్ళు తన చెప్పు చేతలలో నడిపిన కుటుంబం నుండి పార్టి ని కాపాడుకోవలసిన స్తితిలో రాష్ట్ర కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్య మంత్రిని చేసి ముందుకు వెళుతోంది. ఏ నేపథ్యంలో అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టి ని ఏర్పాటు చేసారో అది మరిచి కాంగ్రెస్ పత్రిలో కలిసి పోయి జగన్ నుండి కాంగ్రెస్ కు రక్షణ కల్పిస్తున్నారు. దీంట్లో ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు వున్నా రాజకీయ భవిస్యత్తు కోసం ప్రానాలికలు వేసుకొంటున్నారు. అలాగే పి.సి.సి.చీప్ గా   ఎంపికైన బొత్స  ఒక దశలో ముఖ్య మంత్రి కిరణ్ ను కాదని ముందుకు పోవాలని ప్రయన్తించారు .  ఈ మధ్యలో ప్రతిపక్షంగా కీలకపాత్ర పోషించాలిసిన తెలుగుదేశం వెంటనే ఎన్నికలు వస్తే కష్టమని ప్రభుత్వాన్ని కాపాడుతోందని విమర్శలు మూటగట్టుకోన్నదని  చెప్పవచ్చు . చంద్ర బాబు నాయిడు రతుల కోసం నిరాహార దీక్ష , రైతు పోరుబాట  ఆయనకు కలసి వచ్చింది . అయితే జగన్  సి.బి. ఐ కేసులలో ఇర్రుక్కోవడం తెలుగుదేసంకు లాబించిన అంశంగా అనుకొనే అంతలోనే చంద్ర బాబు పై హై కోర్ట్ విచారణకు సి.బి. ఐ విచారణకు ఆదేశించడం తో ఈ పార్టి పరిస్తితి మొదటికి వచ్చింది . 
 
ఇక రెండో అశం తెలంగాణా కూడా కొలికి వచ్చినట్టే వచ్చి వెనక్కు పోతోంది. కే.సి.ఆర్ దీక్షతో దిగి వచ్చిన కేంద్ర తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నాటు ప్రకటించింది. యింతే సీమంద్రలో వచ్చిన వ్యతిరేకత కారణంగా తన నిర్ణయం మార్చుకొని జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది . ఆ కమిటీ నివేదిక సమైకంద్ర కు అనుకూలంగా రావడంతో మళ్ళే తెలంగాణా లో సకల జనుల సమ్మె జరిగి దాదాపు ప్రజా జీవితం స్తంబించేలా ఉద్యమాలు జరిగాయి. అయితే ఉన్నట్టుండి చప్పున చల్లారి పోయింది. దీనికి పోలవరం టెండర్లకు లింక్ వుందని తెలుగుదేశం ఆరోపించింది. కాంగ్రెస్ కోర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేక కింద పైనా పడుతూ వుంటే  ప్రధాని మన్మోహన్ తెలంగాణా ప్రస్తుత పరిస్తితులలో ఇవ్వడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టారు.
 
ఈ రెండు సమస్యలు కాంగ్రెస్ పార్టి పెంచి పోషిస్తోంది. భవిషత్తులో ఏమి జరుగుతోంది అని చెప్పలేకపోట్టునాము . అయితే ఈ రెండు సమస్యలే రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తాయని చెప్పవచ్చు .

ఎం. పి. ల రాజీనామలూ తిరస్కరణ


తెలంగాణా ఉద్యమంలో భాగంగా రాజీనామా సమర్పించిన రాష్ట్ర ఎం. పి. ల రాజీనామాలు తిరస్కరిస్తూ లోకసభ స్పీకర్ మీరా కుమారి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, టి. డి. పి. , తెలంగాణా రాష్ట్ర సమితి కి చెందిన ఎం.పి.లు మూకుమ్మడిగా సమర్పించిన రాజీనామాలు భావోద్రేకంతో చేసినందున తిరస్కరిస్తున్నట్టు తెలిపారు . ఈ నిర్ణయం వెలువడక ముందే తమ రాజీనామాలు ఆమోదించనందున తాము రాబోయే పార్లమెంట్ సమావేశాలకు హాజరై తెలంగాణా పై పోరాటం చేయనున్నట్టు టి. ఆర్. ఎస్ చెప్పడం కొసమెరుపు.  రాష్ట్ర రాజకీయాలలో రాజీనామాలు చేయడం అవి ఆమోదం పొందకపోవడం ఇటీవల సర్వ సాధారణ విషయం అయిపొయింది.  

Monday, 14 November 2011

చంద్ర బాబు కు అనుకోని ఎదురు దెబ్బ

 
 
 
తెలుగు దేశం పార్టి చంద్ర బాబు నాయిడుకు సి.బి. ఐ విచారణను ఎదురుకోవడం అనుకోని ఎదురు దెబ్బ. వై. ఎస్. విజయమ్మ కోర్ట్ కు వెళితే కోర్ట్ సి.బి. ఐ విచారణకు అదేశాలిస్తుందని అనుకున్నట్లు లేదు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు, రామోజీ రావు ఈ కేసులో విచారణను ఎదుర్కోవడం అంటే కత్తి మీద సామే. ఏ చిన్న తప్పు దొరికినా రాజకీయంగా పెద్ద నష్టమే జరుగుతుంది. గతంలో వై. ఎస్. ఆర్ తన పై ఛాలా విచారణలు జరిపించినారని , ఏ ఆరోపణలు నిరూపించలేక పోయారని , వాటినే తిరిగి కోర్టులో పిటీషన్ వేయడం వల్ల పెద్దగ నష్టం లేదని . తమ నేత నిజాయితీ పరుడుగా బయటపడి ఇంకా బలం పున్జుకున్తారని తెలుగుదేశం కేడర్ భావిస్తోంది. అయితే ఇంతకు మునుపు విచారణకు ఇప్పటి విచారణకు తేడా కచ్చితంగా వుంటుంది. సి.బి. ఐ ఇప్పుడు ఎంతటి నాయకుడైనా దూకుడుగా దూసుకుపోతోంది. చంద్ర బాబు మరో పరీక్ష ఎదుర్కొ పోతున్నారు.

జగన్ గూటి నుండి జారి పోనున్న ఎం. ఎల్.ఏ లు

 
కాంగ్రెస్ పార్టి నుండి జగన్ వేరుపడి కొత్తగా ఏర్పాటు చేసిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి తో జత కట్టి తిరుగుతున్న కాంగ్రెస్ ఎం.ఎల్. ఏ లు ఒక్కక్కరే తిరిగి స్వంత గూటికి చేరుకోవడానికి సమయం కోసం వేచి వున్నారు. జగన్ ఓదార్పు యాత్రల్లో పాల్గొని అధిష్టానం వద్దన్నా వీర విదేయత చూపిన వీరంతా మారిన రాజకీయ పరిస్తితులలో వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు సి.బి. ఐ. ఎఫ్. ఐ. ఆర్ లో చేర్చడం పై కినుక వహించి జగన్ ఆదేశాల మేరకు తమ ఎం. ఎల్. ఏ ల పదవులకు అలాగే కాంగ్రెస్ పార్టి సబ్యాత్వానికి రాజీనామాలు చేశారు . అయితే జగన్ పై సి. బి. ఐ  విచారణలో కొత్త విషయాలు బయటపడడం , గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడి పరిస్తితి చూసి జగన్ జైలుకు వెళితే వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి భావిస్యతు తో పాటు తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని బావిస్తున్నారు. రాజీనామాలను విచారించడానికి స్పీకర్ పిలిస్తే వీరంతా రాజీనామాలను వెనక్కు తీసుకొనే అవకాసం కనబడుతోంది. ఇప్పుడున్న పరిస్తితులలలో రాజీనామాలు ఆమోదింప చేసుకొని ఎన్నికలలో నిలబడటం అంత మంచి నిర్ణయం కాదని అనుకుంటున్నట్టు భోగట్ట.  జగన్ ఎం. ఎల్. ఏ లలో 90 శాతం జారిపోనున్నట్టు తెలుస్తోంది.

చంద్ర బాబు పై సి.బి. ఐ ప్రాథమిక విచారణకు హైకోర్ట్ ఆదేశాలు



తెలుగుదేశం పార్టి అధ్యక్ష్యుడు నారా చంద్రబాబు నాయుడు  తో సహా మరో 13 మంది ఆస్తులపై  ప్రాథమిక విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్ట్ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వేసిన పిటీషన్ ను విచారించిన ధర్మాసనం మూడు నెలలలోపు ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించడం జరిగింది. ఇదివరకే జగన్ పై జరుగుతున్నా విచారణపై  అక్కసుతోనే వై.ఎస్.ఆర్ పార్టి వారు పిటీషన్ వేశారని తెలుగుదేశం వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తో పాటు సిని నటుడు మురళి మోహన్, సుజన చౌదరి, నామ నాగేశ్వర రావు  మరియు నారా చంద్ర బాబు కుటుంబ సభ్యులు ఈ కేసును ఎదుర్కోవలసి వుంటుంది. ఇప్పుడు చంద్రబాబు స్టే తెచ్చుకున్న చెడ్డ పేరు వస్తోంది. కాబట్టి తెలుగుదేశం పార్టి వారు సి. బి. ఐ. విచారణను స్వాగాతిస్తున్నట్టే మాట్లాడుతున్నారు. చంద్ర బాబు ఏదైనా అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలితే పూర్తి స్థాయి విచారణకు హై కోర్ట్ ఆదేశించే అవకాశం వుంది. అదే జరిగితే ఇప్పుడు జగన్ ను వెంటాడుతున్న కేసుల గొడవ చంద్ర బాబుకు తప్పవు. ప్రాథమిక విచారణలో నిర్దోషిగా తేలితే అదొక సర్టిఫికేట్ లా ఉపయోగపడి ఆయనకు రాజకీయంగా లాబించవచ్చు. సందిట్లో  సదేమియాగా కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది.