Friday 9 December 2011

అవిశ్వాసం ఎవరికీ మేలు చేసింది


రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టి అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినా  దాని వాళ్ళ రాష్ట్రానికి , ప్రభుత్వానికి ఓ స్థిరత్వం వచ్చిందని చెప్పవచ్చు. గత రెండు సంవత్సరాలుగా అస్తిరంగా వున్నా రాష్ట్ర రాజకీయాలను ఈ అవిశ్వాసం పోగొట్టిందని చెప్పవచ్చు . తెలంగాణా సమస్య ,జగన్  సమస్య రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది . అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ తెలంగాణా ఎం. ఎల్. ఏ లు తమకు ప్రాంతం కన్నా పార్టి మిన్న అని నిరూపించి ఓటింగ్ లో పాల్గొన్నారు. తెలుగు దేశం అవిశ్వాసం ప్రవేశ పెడితే తాను ప్రభుత్వాన్ని పడగొడతానని తొడగోట్టిన జగన్ తన ప్రక్క నున్న ఎం. ఎల్.ఏ ల నే కాపాడుకోలేని పరిస్తితి వచ్చింది . రాజశేఖర్ రెడ్డి సతీమణి అసెంబ్లీ లో మాట్లాడినా ఎం.ఎల్.ఏ లు తమకు ప్రభుత్వమే ముఖ్యమని తేల్చేసారు . ఈ అవిశ్వాసం గట్టేక్కదని ముందే తెలిసినా సి.బి. ఐ కేసుల నుండి దృష్టి మరల్చడం, జగన్ ను మరింత బలహీన పరచడం అనే అంశాలలో తెలుగు దేశం విజయం సాధించినట్టే. పి.సి.సి. అధ్యక్షుడు బొత్స  తో పాటు మంత్రి వర్గం మూకుమ్మడిగా కిరణ్ సర్కార్ కు అసెంబ్లీ లో మద్దతు ఇవ్వడం వాళ్ళ ప్రభుత్వం నామ మాత్రంగా లేదని పటిష్టంగానే ఉందనే విషయం స్పష్టమైనది . తెలుగుదేశం , కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్షిన్గ ఆరోపణలకు సమాధానం లభిచింది. ఇప్పుడు జగన్ కు ఉపఎన్నికల ఉపద్రవం ముందువుంది . కనీసం ఆయన అందరినీ గెలిపించుకుంటే సరి లేకుంటే పర్తికు కష్టకాలమే . 25 స్థానాలలో జరగనున్న ఉప ఎన్నికలలో అన్నింటా గెలువడం కష్టమే . తెలుగు దేశం , కాంగ్రెస్ మరింత లాబా పడనున్నట్టు సమాచారం . మరి జగన్ కాంగ్రెస్ పార్టీని వదలి తప్పు చేసాడని సామాన్యులు అంటున్నారు

Thursday 1 December 2011

ఇష్టం లేకున్నా అవిశ్వాసం వైపు ...


 
కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాసం ప్రవేశపెడుతున్న తెలుగుదేశం పార్టి కు గాని , జగన్ వర్గమైన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ కు గాని అవిశ్వాసం ప్రవేశ పెట్టడం ఇష్టం లేకున్నా ఆవైపే అడుగులు వేస్తున్నాయి. సి.బి.ఐ .కేసుల నేపథ్యంలో చంద్ర బాబు అసెంబ్లీ లో తనపై చర్చ జరగకుండా ఈ ఎత్తు వేసినట్టు చెబుతున్నారు. అలాగే జగన్ వర్గం వారు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే వారి పదవులకు ఎసరు వస్తుంది. ఒకవేళ మద్దతు తెలిపితే జగన్ పర్తికు రాజకీయంగా పెద్ద దెబ్బ తగులుతుంది. అంతేకాకుండా ఈ పరిణామం ఎట్టకేలకు కిరణ్ కె ఉపయోగపడుతుందని అంటున్నారు. టి.ఆర్.ఎస్ కూడా ఎటు  తేల్చుకోలేక పోతోంది. అవిస్వానికి మద్దతు తెలిపితే ప్రభుత్వ పతనం ఖాయం. చూద్దాం ఏమి జరుగుతుందో .