Friday 9 December 2011

అవిశ్వాసం ఎవరికీ మేలు చేసింది


రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టి అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినా  దాని వాళ్ళ రాష్ట్రానికి , ప్రభుత్వానికి ఓ స్థిరత్వం వచ్చిందని చెప్పవచ్చు. గత రెండు సంవత్సరాలుగా అస్తిరంగా వున్నా రాష్ట్ర రాజకీయాలను ఈ అవిశ్వాసం పోగొట్టిందని చెప్పవచ్చు . తెలంగాణా సమస్య ,జగన్  సమస్య రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది . అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ తెలంగాణా ఎం. ఎల్. ఏ లు తమకు ప్రాంతం కన్నా పార్టి మిన్న అని నిరూపించి ఓటింగ్ లో పాల్గొన్నారు. తెలుగు దేశం అవిశ్వాసం ప్రవేశ పెడితే తాను ప్రభుత్వాన్ని పడగొడతానని తొడగోట్టిన జగన్ తన ప్రక్క నున్న ఎం. ఎల్.ఏ ల నే కాపాడుకోలేని పరిస్తితి వచ్చింది . రాజశేఖర్ రెడ్డి సతీమణి అసెంబ్లీ లో మాట్లాడినా ఎం.ఎల్.ఏ లు తమకు ప్రభుత్వమే ముఖ్యమని తేల్చేసారు . ఈ అవిశ్వాసం గట్టేక్కదని ముందే తెలిసినా సి.బి. ఐ కేసుల నుండి దృష్టి మరల్చడం, జగన్ ను మరింత బలహీన పరచడం అనే అంశాలలో తెలుగు దేశం విజయం సాధించినట్టే. పి.సి.సి. అధ్యక్షుడు బొత్స  తో పాటు మంత్రి వర్గం మూకుమ్మడిగా కిరణ్ సర్కార్ కు అసెంబ్లీ లో మద్దతు ఇవ్వడం వాళ్ళ ప్రభుత్వం నామ మాత్రంగా లేదని పటిష్టంగానే ఉందనే విషయం స్పష్టమైనది . తెలుగుదేశం , కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్షిన్గ ఆరోపణలకు సమాధానం లభిచింది. ఇప్పుడు జగన్ కు ఉపఎన్నికల ఉపద్రవం ముందువుంది . కనీసం ఆయన అందరినీ గెలిపించుకుంటే సరి లేకుంటే పర్తికు కష్టకాలమే . 25 స్థానాలలో జరగనున్న ఉప ఎన్నికలలో అన్నింటా గెలువడం కష్టమే . తెలుగు దేశం , కాంగ్రెస్ మరింత లాబా పడనున్నట్టు సమాచారం . మరి జగన్ కాంగ్రెస్ పార్టీని వదలి తప్పు చేసాడని సామాన్యులు అంటున్నారు

Thursday 1 December 2011

ఇష్టం లేకున్నా అవిశ్వాసం వైపు ...


 
కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాసం ప్రవేశపెడుతున్న తెలుగుదేశం పార్టి కు గాని , జగన్ వర్గమైన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ కు గాని అవిశ్వాసం ప్రవేశ పెట్టడం ఇష్టం లేకున్నా ఆవైపే అడుగులు వేస్తున్నాయి. సి.బి.ఐ .కేసుల నేపథ్యంలో చంద్ర బాబు అసెంబ్లీ లో తనపై చర్చ జరగకుండా ఈ ఎత్తు వేసినట్టు చెబుతున్నారు. అలాగే జగన్ వర్గం వారు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే వారి పదవులకు ఎసరు వస్తుంది. ఒకవేళ మద్దతు తెలిపితే జగన్ పర్తికు రాజకీయంగా పెద్ద దెబ్బ తగులుతుంది. అంతేకాకుండా ఈ పరిణామం ఎట్టకేలకు కిరణ్ కె ఉపయోగపడుతుందని అంటున్నారు. టి.ఆర్.ఎస్ కూడా ఎటు  తేల్చుకోలేక పోతోంది. అవిస్వానికి మద్దతు తెలిపితే ప్రభుత్వ పతనం ఖాయం. చూద్దాం ఏమి జరుగుతుందో .

Friday 25 November 2011

అవిశ్వాస తీర్మానాన్ని ఆత్మ విశ్వాసంతోఎదుర్కోనున్న కిరణ్

 
 
 
 
 
కిరణ్ కుమార్ ప్రభుత్వం పై  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు తెలుగుదేశం ప్రకటించినా కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ఇదివరకు వున్నటు వంటి భయాలు ఏమిలేవనే చెప్పాలి. ఏడాది పూర్తి చేసుకున్న కిరణ్ కుమార్ ప్రభుత్వం మొదట్లో పురిటి కష్టాలు పది క్రమేపి నిలదొక్కుకున్నది.  ఈ సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలుగు దేశం చేస్తున్న మరో తప్పిదమే అవుతుంది. కిరణ్ ముఖ్య మంత్రిగా పదవి చేప్పటినప్పుడు తీవ్రంగా ఉందనుకున్న తెలంగాణా ఉద్యమం సకల జనుల సమ్మె తరువాత మునుపటి జోరు తగ్గిందనే చెప్పాలి . అలాగే ప్రభుత్వాని పడగోడుతామని తొడగోట్టిన జగన్ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఆత్మరక్షణలో పడిపోయారు. జగన్ ప్రక్క వెళ్ళిన ఎం. ఎల్ . ఏలు  ఊగిసలాటలో వున్నారు . వారు కాంగ్రెస్ కె మద్దతు ఇచ్చే అవకాసం  వుంది. ఈ సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ప్రభుత్వం పడిపోవడం మాట అటుంచి కిరణ్ సర్కార్ పూర్తి స్థాయి ప్రభుత్వంగా మారి ఆయనను బలపదేటట్టు చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరో ప్రక్క చంద్ర బాబు పై సి.బి. ఐ. విచారణ కూడా జరగబోతోంది. కిరణ్ కు కాలం కలసి వస్తోంది. ప్రజలలో మెల్లగా సి. ఎం. గా అంగీకరించే పరిస్తితి  ఏర్పదబోతోండానే చెప్పవచ్చు.

Wednesday 23 November 2011

చంద్ర బాబు బృందానికి ఊరట ..


వై. ఎస్ . విజయమ్మ వేసిన పిటిషన్ పై సి. బి. ఐ. విచారణకు హై కోర్ట్ ఆదేశించే ముందు సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని, తమ వాదనలు వినలేదని సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన చంద్ర బాబు బృందానికి ఊరట లబించింది. 15 రోజుల లోపు హై కోర్ట్ లో తమ వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కేసు పూర్వ పరాలు హై కోర్ట్ పరిధిలో ఉన్నందున అక్కడే వాదనలు వినిపించుకోవాలని స్పష్టం చేసింది. విచారణ పై స్టే ఇవ్వక పోయినా తమ వాదనలు వినిపించేందుకు కోర్ట్ సమ్మతించడం వల్ల చంద్ర బాబు బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ సరికే ఈ.డి చంద్ర బాబు కు కేసు విచారణకు సంభందించి వివరాలు అందజేయాలని నోటీసు కూడా అందచేసింది. రేపో మాపో సి.బి.ఐ విచారణకు రంగం సిద్ధం చేసుకొని వుంది.

Friday 18 November 2011

వై. ఎస్. ఆర్ పార్టి ముఖ్య మంత్రి అభ్యర్థి విజయమ్మ ?


జగన్ సి. బి. ఐ  కేసులలో ఇరుక్కోవడంతో వై. ఎస్. ఆర్ పార్టి ముఖ్య మంత్రి అభ్యర్థిగా విజయమ్మ ను ప్రతిపాదించాలని ఆలోచిస్తున్నారు. విజయమ్మ కు వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ కలసి వస్తుందని అలాగే క్లీన్ ఇమేజ్ దోహదపడుతుందని, మహిళా ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎం.ఎల్.ఎ గా ఎన్నికయినా ఒక్క సందర్బంలోనూ మాట్లాడని విజయమ్మ పార్టీని ఎలా నడుపుతుందో చూడాలి

నాయకుడిగా జగన్ విపలం : దివాకర్ రెడ్డి




వై.ఎస్. ఆర్ పార్టి నాయకుడు జగన్ కు నాయకత్వ లక్షణాలు లేవని ఆయన నాయకుడిగా విఫలం చెందారని కాంగ్రెస్ నాయకుడు దివాకర్ రెడ్డి అంటున్నారు. వై. ఎస్ ఆర్ కుమారుడిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను అభిమానించినా జగన్ తన తప్పిదాలతోనే జగన్ పరిస్థితి ఎలా తయారయిందని , కాంగ్రెస్ ఆదిస్థానం అంటే ఏమిటో జగన్ కు తెలిసి వచ్చిందని దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ వైపు వెళ్ళిన ఎం. ఎల్. ఎ లు అందరు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని ధీమా వ్యక్తం చేసారు.

Thursday 17 November 2011

త్వరలో చిరంజీవి కి కేంద్ర కేబినేట్ పదవి !


మార్పు కోసం ప్రజా రాజ్యం పార్టి స్థాపించి ఎన్నికలలో ముఖ్య మంత్రిగా ఎన్నికవ్వాలన్న బలమైన కోరికతో దిగి
18 సీట్లతో సరిపెట్టుకొన్న చిరంజీవి ఎట్టకేలకు కేంద్ర మంత్రి కాబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటి మెజారిటీ తో వుంది. జగన్ దెబ్బకు బయపడిన ఆదిస్థానం చిరంజీవిని దగ్గరకు తీసుకుంది. చిరంజీవి మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాకుండా నిలబడిందనే చెప్పవచ్చు. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో వీలీనం అయినప్పటికీ చిరంజీవి వర్గానికి తగిన ప్రాధ్యానత లబించలేదు. ఎట్టకేలకు సోనియా పిలిచి పదవి హామీ ఇవ్వడంతో చిరంజీవి చాల హ్యాపీ గా వున్నారు.

సుప్రీం కోర్ట్ స్టే కు చంద్ర బాబు యత్నం





తెలుగు దేశం అధినేత సి.బి. ఐ. విచారణకు హై కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల స్టే కోసం సుప్రీం కోర్ట్ కు వెళ్లనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వున్నా పరిస్తితులలో విచారణ జరిగితే కాంగ్రెస్ తమను బంతాట ఆదుకుంటుందని తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. స్టే కోసం చంద్ర బాబు తనంతట తానూ ప్రయత్నిచడం లేదనే విధమైన భావన ఏర్పరచి , పార్టి నిర్ణయం మేరకే స్టే వెళుతున్నట్టు ప్రకటించబోతున్నారు. సుప్రీం కోర్ట్ లో చుక్క ఎదురైనా , స్టే వచ్చిన ఇప్పుడున్న పరిస్తితికి మించి దిగాజారక పోవచ్చు. ఒక వేళ సి. బి. ఐ. విచారణ జరిగితే చిన్న లోపాలు, తప్పులున్నా అవి పెద్దవి కావొచ్చని అప్పుడు పార్టి మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చని అంటున్నారు. చంద్ర బాబు సచ్చీలుడుగా భయటపడితే ఆ పార్టి పై వేరొకరు బురద జల్లేది వుండదు. ఇలా జరిగితే వచ్చే ఎన్నికలలో విజయం నల్లేరు పై నడక అవుతుంది . తద్విర్డుంగా జరిగితే మొదటికే మోసమని పార్టి వర్గాలు అంచాన వేస్తున్నాయి.  చంద్ర బాబు తో పాటు విచారణ ఎదుర్కోనున్న రామోజీ రావు , మురళి మోహన్ తదితరులు కూడా స్టే వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తెలిసి తెలిసి పులి నోట్లో తల పెట్టడానికి చంద్ర బాబు తెగించక పోవచ్చు.





Wednesday 16 November 2011

చంద్ర బాబు పై సి.బి.ఐ కేసుతో జగన్ కు కష్టకాలం ...



వై. ఎస్. ఆర్ పార్టి తరపున విజయమ్మ చంద్ర బాబు అక్రమ ఆస్తుల విషయమై వేసిన పిటిషన్ పై సి. బి. ఐ విచారణకు ఆదేశించిన విషయం విదితమే . అయితే ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కాంగ్రెస్ ఇక జగన్ పై అరెస్ట్ వేటు వేయనుంది. ఇన్నాళ్ళు జగన్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు అనే సెంటిమెంట్ ఎక్కడ వ్యతిరేకంగా పనిచేస్తే జగన్ కు ప్లుస్ అవుతుందని భావించిన కాంగ్రెస్ సి.బి.ఐ ద్వారా ఇక జగన్ అరెస్ట్ కు సిద్ధం అవుతున్నట్టు భావిస్తున్నారు . ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు జగన్ అరెస్ట్ కాగానే, చంద్ర బాబు పై విచారణ వేగం పెంచి కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడతో పాటు వచ్చే ఎన్నికలలో లబ్ది పాడాలని యోచిస్తున్నట్టు తెలిసింది. చంద్ర బాబు లాంటి నాయకుడిపైననే విచారణ జరుగుతుందంటే .. జగన్ విషయం కూడా తమకు ఎలాంటి సెంటిమెంట్ వర్క్ కాదని కాంగ్రెస్ నమ్ముతోంది. ఒక వేళ జగన్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్, తెలుగుదేశం మ్యాచ్ పిక్సింగ్ జరిగింది  అనుకుంటే చంద్ర బాబు నిర్దోషిగా బయట పడుతాడు. జగన్ గాలి జానార్ధాన్ రెడ్డి లా జైలు పాలు అవుతాడని కొన్ని వర్గాలు అంటున్నాయి. రాబోయే మూడు నెలలలోనే చంద్ర బాబు భవిష్యత్తు తేలనుంది. అయితే చంద్ర బాబు సుప్రేం కోర్ట్ నుండి స్టే తెచ్చుకొనే అవకాశాలు వున్నాయి. ఏది జరిగినా , ఎటు నుండి వెళ్లినా తన వైపు వున్నా ఎం. ఎల్. ఏ లు కూడా కాంగేస్స్ లో చేరిపోతే జగన్ ఒంటరిగా మిగలడం , జైలు పాలు కావడం తప్పదేమో.. కాంగ్రెస్ పాచికలు ఎప్పుడూ అంతగా ఎవ్వరికీ అర్థం కావు.

Tuesday 15 November 2011

రాటుదేలిన రాజకీయ చాణిక్యం

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలలో వూహ్య, ప్రతి వూహ్యలతో రాజకీయం రాటుదేలిపోయింది. స్వపక్షంలో ఉంటూ విమర్శలు చేయడం .. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడడం అనే కొంత కోణాలు ఎన్నడూ లేనిది చూస్తున్నాము. స్థూలంగా రాష్ట్ర రాజకీయాల పరిస్థితిని వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి మరణం కు ముందు ,ఆ తరువాత రెండు రకాలుగా విభాజిచుకుని పరిశీలించవలసి వుంది. వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు కాంగ్రెస్ పార్టి బలం అసెంబ్లీ లో తగ్గిన ఏ మాత్రం నిర్ణయాల స్పీడు తగ్గలేదు. రాజశేఖర్ రెడ్డి ఒనె మాన్ షో తో అంత ప్రశాంతత కనిపించింది. గుప్తంగా దాగున్న తెలంగాణా సమస్య వుండినా ఆయన తగిన రీతిలో వాటిని కంట్రోల్ చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంగా వుండిన తెలుగుదేశం వై. ఎస్. ఆర్ పై పోరును చేస్తూ కాలం గడుపుతూ వచ్చేది. టి.ఆర్. ఎస్. ఉప ఎన్నికలలలో పోటీ చేసి వున్నా సీట్లు కూడా పోగొట్టుకున్న పరిస్తితి వుండేది. ఎప్పుడైతే వై. ఎస్. ఆర్  మృతి చెందారో అంత వరకు తొక్కిపట్టిన సమస్యలు తెరపైకి వచ్చి వీర విజ్రుమ్బాన చేస్తున్నాయి. అందులో నాయకత్వ సమస్య .. కాంగ్రెస్ పార్టి ముఖ్యమంత్రిగా ఇక అయిపోవచ్చు అని కలలు కన్నా జగన్ కు ఎం. ఎల్. ఏ. ల బలం వున్నా ఆదిస్థానం మొండిచేయి చూపి రోశయ్య ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీంతో పార్టీలో ఇమడలేక ఓదార్పు యాత్ర పేరుతొ తన ఉనికిని చాటుతూ జగన్ జనంలో తిరుగుతూ కాంగ్రెస్ కంట్లో నలుసుగా మారాడు. అయినా కాంగ్రెస్ ఎతులకు పై ఎతులు వేసి జగన్ తనంతట తానే పార్టీని వదిలిపెట్టేలా చేసింది. దీంతో జగన్ కొత్తగా వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్ళు తన చెప్పు చేతలలో నడిపిన కుటుంబం నుండి పార్టి ని కాపాడుకోవలసిన స్తితిలో రాష్ట్ర కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్య మంత్రిని చేసి ముందుకు వెళుతోంది. ఏ నేపథ్యంలో అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టి ని ఏర్పాటు చేసారో అది మరిచి కాంగ్రెస్ పత్రిలో కలిసి పోయి జగన్ నుండి కాంగ్రెస్ కు రక్షణ కల్పిస్తున్నారు. దీంట్లో ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు వున్నా రాజకీయ భవిస్యత్తు కోసం ప్రానాలికలు వేసుకొంటున్నారు. అలాగే పి.సి.సి.చీప్ గా   ఎంపికైన బొత్స  ఒక దశలో ముఖ్య మంత్రి కిరణ్ ను కాదని ముందుకు పోవాలని ప్రయన్తించారు .  ఈ మధ్యలో ప్రతిపక్షంగా కీలకపాత్ర పోషించాలిసిన తెలుగుదేశం వెంటనే ఎన్నికలు వస్తే కష్టమని ప్రభుత్వాన్ని కాపాడుతోందని విమర్శలు మూటగట్టుకోన్నదని  చెప్పవచ్చు . చంద్ర బాబు నాయిడు రతుల కోసం నిరాహార దీక్ష , రైతు పోరుబాట  ఆయనకు కలసి వచ్చింది . అయితే జగన్  సి.బి. ఐ కేసులలో ఇర్రుక్కోవడం తెలుగుదేసంకు లాబించిన అంశంగా అనుకొనే అంతలోనే చంద్ర బాబు పై హై కోర్ట్ విచారణకు సి.బి. ఐ విచారణకు ఆదేశించడం తో ఈ పార్టి పరిస్తితి మొదటికి వచ్చింది . 
 
ఇక రెండో అశం తెలంగాణా కూడా కొలికి వచ్చినట్టే వచ్చి వెనక్కు పోతోంది. కే.సి.ఆర్ దీక్షతో దిగి వచ్చిన కేంద్ర తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నాటు ప్రకటించింది. యింతే సీమంద్రలో వచ్చిన వ్యతిరేకత కారణంగా తన నిర్ణయం మార్చుకొని జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది . ఆ కమిటీ నివేదిక సమైకంద్ర కు అనుకూలంగా రావడంతో మళ్ళే తెలంగాణా లో సకల జనుల సమ్మె జరిగి దాదాపు ప్రజా జీవితం స్తంబించేలా ఉద్యమాలు జరిగాయి. అయితే ఉన్నట్టుండి చప్పున చల్లారి పోయింది. దీనికి పోలవరం టెండర్లకు లింక్ వుందని తెలుగుదేశం ఆరోపించింది. కాంగ్రెస్ కోర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేక కింద పైనా పడుతూ వుంటే  ప్రధాని మన్మోహన్ తెలంగాణా ప్రస్తుత పరిస్తితులలో ఇవ్వడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టారు.
 
ఈ రెండు సమస్యలు కాంగ్రెస్ పార్టి పెంచి పోషిస్తోంది. భవిషత్తులో ఏమి జరుగుతోంది అని చెప్పలేకపోట్టునాము . అయితే ఈ రెండు సమస్యలే రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తాయని చెప్పవచ్చు .

ఎం. పి. ల రాజీనామలూ తిరస్కరణ


తెలంగాణా ఉద్యమంలో భాగంగా రాజీనామా సమర్పించిన రాష్ట్ర ఎం. పి. ల రాజీనామాలు తిరస్కరిస్తూ లోకసభ స్పీకర్ మీరా కుమారి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, టి. డి. పి. , తెలంగాణా రాష్ట్ర సమితి కి చెందిన ఎం.పి.లు మూకుమ్మడిగా సమర్పించిన రాజీనామాలు భావోద్రేకంతో చేసినందున తిరస్కరిస్తున్నట్టు తెలిపారు . ఈ నిర్ణయం వెలువడక ముందే తమ రాజీనామాలు ఆమోదించనందున తాము రాబోయే పార్లమెంట్ సమావేశాలకు హాజరై తెలంగాణా పై పోరాటం చేయనున్నట్టు టి. ఆర్. ఎస్ చెప్పడం కొసమెరుపు.  రాష్ట్ర రాజకీయాలలో రాజీనామాలు చేయడం అవి ఆమోదం పొందకపోవడం ఇటీవల సర్వ సాధారణ విషయం అయిపొయింది.  

Monday 14 November 2011

చంద్ర బాబు కు అనుకోని ఎదురు దెబ్బ

 
 
 
తెలుగు దేశం పార్టి చంద్ర బాబు నాయిడుకు సి.బి. ఐ విచారణను ఎదురుకోవడం అనుకోని ఎదురు దెబ్బ. వై. ఎస్. విజయమ్మ కోర్ట్ కు వెళితే కోర్ట్ సి.బి. ఐ విచారణకు అదేశాలిస్తుందని అనుకున్నట్లు లేదు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు, రామోజీ రావు ఈ కేసులో విచారణను ఎదుర్కోవడం అంటే కత్తి మీద సామే. ఏ చిన్న తప్పు దొరికినా రాజకీయంగా పెద్ద నష్టమే జరుగుతుంది. గతంలో వై. ఎస్. ఆర్ తన పై ఛాలా విచారణలు జరిపించినారని , ఏ ఆరోపణలు నిరూపించలేక పోయారని , వాటినే తిరిగి కోర్టులో పిటీషన్ వేయడం వల్ల పెద్దగ నష్టం లేదని . తమ నేత నిజాయితీ పరుడుగా బయటపడి ఇంకా బలం పున్జుకున్తారని తెలుగుదేశం కేడర్ భావిస్తోంది. అయితే ఇంతకు మునుపు విచారణకు ఇప్పటి విచారణకు తేడా కచ్చితంగా వుంటుంది. సి.బి. ఐ ఇప్పుడు ఎంతటి నాయకుడైనా దూకుడుగా దూసుకుపోతోంది. చంద్ర బాబు మరో పరీక్ష ఎదుర్కొ పోతున్నారు.

జగన్ గూటి నుండి జారి పోనున్న ఎం. ఎల్.ఏ లు

 
కాంగ్రెస్ పార్టి నుండి జగన్ వేరుపడి కొత్తగా ఏర్పాటు చేసిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి తో జత కట్టి తిరుగుతున్న కాంగ్రెస్ ఎం.ఎల్. ఏ లు ఒక్కక్కరే తిరిగి స్వంత గూటికి చేరుకోవడానికి సమయం కోసం వేచి వున్నారు. జగన్ ఓదార్పు యాత్రల్లో పాల్గొని అధిష్టానం వద్దన్నా వీర విదేయత చూపిన వీరంతా మారిన రాజకీయ పరిస్తితులలో వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు సి.బి. ఐ. ఎఫ్. ఐ. ఆర్ లో చేర్చడం పై కినుక వహించి జగన్ ఆదేశాల మేరకు తమ ఎం. ఎల్. ఏ ల పదవులకు అలాగే కాంగ్రెస్ పార్టి సబ్యాత్వానికి రాజీనామాలు చేశారు . అయితే జగన్ పై సి. బి. ఐ  విచారణలో కొత్త విషయాలు బయటపడడం , గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడి పరిస్తితి చూసి జగన్ జైలుకు వెళితే వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి భావిస్యతు తో పాటు తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని బావిస్తున్నారు. రాజీనామాలను విచారించడానికి స్పీకర్ పిలిస్తే వీరంతా రాజీనామాలను వెనక్కు తీసుకొనే అవకాసం కనబడుతోంది. ఇప్పుడున్న పరిస్తితులలలో రాజీనామాలు ఆమోదింప చేసుకొని ఎన్నికలలో నిలబడటం అంత మంచి నిర్ణయం కాదని అనుకుంటున్నట్టు భోగట్ట.  జగన్ ఎం. ఎల్. ఏ లలో 90 శాతం జారిపోనున్నట్టు తెలుస్తోంది.

చంద్ర బాబు పై సి.బి. ఐ ప్రాథమిక విచారణకు హైకోర్ట్ ఆదేశాలు



తెలుగుదేశం పార్టి అధ్యక్ష్యుడు నారా చంద్రబాబు నాయుడు  తో సహా మరో 13 మంది ఆస్తులపై  ప్రాథమిక విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్ట్ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వేసిన పిటీషన్ ను విచారించిన ధర్మాసనం మూడు నెలలలోపు ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించడం జరిగింది. ఇదివరకే జగన్ పై జరుగుతున్నా విచారణపై  అక్కసుతోనే వై.ఎస్.ఆర్ పార్టి వారు పిటీషన్ వేశారని తెలుగుదేశం వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తో పాటు సిని నటుడు మురళి మోహన్, సుజన చౌదరి, నామ నాగేశ్వర రావు  మరియు నారా చంద్ర బాబు కుటుంబ సభ్యులు ఈ కేసును ఎదుర్కోవలసి వుంటుంది. ఇప్పుడు చంద్రబాబు స్టే తెచ్చుకున్న చెడ్డ పేరు వస్తోంది. కాబట్టి తెలుగుదేశం పార్టి వారు సి. బి. ఐ. విచారణను స్వాగాతిస్తున్నట్టే మాట్లాడుతున్నారు. చంద్ర బాబు ఏదైనా అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలితే పూర్తి స్థాయి విచారణకు హై కోర్ట్ ఆదేశించే అవకాశం వుంది. అదే జరిగితే ఇప్పుడు జగన్ ను వెంటాడుతున్న కేసుల గొడవ చంద్ర బాబుకు తప్పవు. ప్రాథమిక విచారణలో నిర్దోషిగా తేలితే అదొక సర్టిఫికేట్ లా ఉపయోగపడి ఆయనకు రాజకీయంగా లాబించవచ్చు. సందిట్లో  సదేమియాగా కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది.

Friday 11 November 2011

కాంగ్రెస్ గూటిలోనే జయసుధ ..జగన్ జలక్ ఇవ్వనున్న సహజనటి







వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి ద్వారా రాజకీయ జీవితం ప్రారంభిచిన సిని నటి జయసుధ ఇప్పుడు నిజజీవితంలో నటించలేక పోతున్నారు. వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆమె జగన్ వైపు నిలిచారు. జగన్ పెట్టిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ గా కొనసాగలేక తెలంగాణా ఉద్యమం పేరుతొ రాజీనామా చేసారు , జగన్ అవినీతి కేసుల్లో వై. ఎస్. ఆర్ పేరు చేర్చినందుకు నిరసన తెలిపారు కూడా. అయితే మారిన రాజకీయ పరిస్థితులలో జగన్ చుట్టూ సి. బి. ఐ. కేసుల ఉచ్చు బిగిస్తుండడంతో ఏమి చేయాలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. రంగా రెడ్డి  జిల్లాలో నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తేసారు. వై. ఎస్. ఆర్. ఆరోగ్యశ్రీ పథకం తనను ఎంతగా ఆకర్శించిందో అంతగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ కిరణాలు పథకం ఆకర్షించిందని రచ్చబండ బహిరంగ సభలో పొగిడారు. చూస్తుంటే జగన్ కు జయసుధ జలక్ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల సమాచారం .

Thursday 10 November 2011

ఎట్టకేలకు తెలంగాణాలో విజయవంతంగా చంద్ర బాబు పాదయాత్ర


రైతులకోసం చంద్ర బాబు చేపట్టిన పాదయాత్ర ఎట్టకేలకు తెలంగాణలో కూడా విజయవంతం అవుతోంది. ఇప్పటికే ఆయన రాయలసీమలోని అనంతపురం , కర్నూలు, కడప జిల్లాలు , ప్రకాశం జిల్లాలోనూ విజయవంతంగా పాదయాత్ర పూర్తిచేసుకొని తెలంగాణలో అడుగుపెట్టారు. రైతులు కష్టాల్లో వున్నా ఈ సమయంలో చేపట్టిన పాదయాత్ర చంద్ర బాబుకు కలసి వస్తోంది. ఖమ్మం , నల్గొండ జిల్లాలో జరిగిన పాదయాత్రలో పార్టి కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొన్నారని, రైతులు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని పార్టి వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో ఇంతవరకు బాబు సభలకు అడ్డుపడే టి. ఆర్. ఎస్. ఈ సారి ఎందుకో అడ్డుపడడం లేదు.  ఇటీవల తెలంగాణా ఉద్యమ సెగలు బాబును ఉక్కిరిబిక్కిరి చేసాయి. అయినా ఆయన రెండుకళ్ళ సిద్ధాంతాన్ని టి.ఆర్.ఎస్ తో పాటు కాంగ్రెస్ వాళ్ళు తూర్పారబట్టారు. అయితే ఈ పర్యటనతో ప్రజలతో మమేకం కావడం , రైతులకు దగ్గర కావడంతో పాటు తెలంగాణలో కూడా తమ పార్టి కు పట్టు వుందని తెలుగుదేశం కేడెర్ నిరూపించుకున్నట్టే.

Monday 7 November 2011

తుస్సుమన్న జగన్ ఎత్తుగడ !

గాలి జనార్ధన్ రెడ్డి కేసులో తనను విచారిస్తారని జగన్ ఏనాడు ఊహించలేదు . ఉన్నట్టుండి సి. బి. ఐ. నుండి పిలుపు రావడంతో తన పైన ఎక్కడ గాలి అవినీతి మారక పడుతుందేమో నని ఆయన తెలివిగా సి.బి.ఐ. ఆఫీసు నుండి బయటకు రాగానే చంద్ర బాబు పై విరుచుకు పడ్డారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి చంద్ర బాబు తను ముఖ్య మంత్రిగా వున్నప్పుర్డు 2002 లోనే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని దీంట్లో తన తండ్రి పాత్ర లేదని , తనను సి.బి. ఐ. సాక్షిగానే పిలిచిందని , ఏ కేసులో చంద్రబాబు ను ఎందుకు విచారించరని   సి.బి.ఐ ని ప్రశ్నించినట్టు తెలిపారు. దీంతో జగన్ ను సి.బి. ఐ విచారించిన వార్తల కన్నా చంద్ర బాబు ఇచ్చిన జి. ఓ పై ఆయనను ఎందుకు విచారించకూడదో  అన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత  పెరిగింది.
అయితే రాజకీయాలలో అన్ని రకాలు చూసిన చంద్ర బాబు తాము ఇదివరకే విడుదల చేసిన మైనింగ్ మాపియా బుక్ లోని కాపీ నే ఫొటోస్టాట్ తీసి మాపైననే ఆరోపణలు చేయడం దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు వుందని అన్నారు. పైగా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి కోర్ట్ ఆదేశాల మేరకు జి.ఓ ఇచ్చామని  జి.ఓ ఇచ్చినప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి ఆ కంపెనీలో లేరని
సాక్ష్యాలతో బయట పేట్టే సరికి జగన్ చేసిన ఆరోపణలు తుస్సుమన్నాయి. ఒక విషయం పై ఆరోపణ చేస్తున్నప్పుడు అన్ని చూసుకొని ఆరోపణ చేయాలి. విషయం పై అవగాహన వుండాలని జగన్ ఇక నైన నేర్చుకుంటాడని ఆశిద్దాం .

Thursday 3 November 2011

పదవిపై చిగురిస్తున్న చిరంజీవి ఆశలు ...






ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసిన తరువాత  రాష్ట్ర స్థాయి ముఖ్య నేతగా గుర్తింపు సంపాదించుకుంటున్న తిరుపతి ఎం. ఎల్ . ఎ . చిరంజీవి కి పదవి లబిస్తుందనే ఆశలు మళ్లీ చిగురించాయి. తెలంగాణా సమస్య తగ్గు ముఖం పట్టడం, జగన్ కేసులలో ఉక్కిరి బిక్కిరి కావడంతో .. ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన మాటను ఆదిస్థానం నిలబెట్టుకుంటుందని ఆయన విధేయత ప్రకటిస్తున్నారు . చిరంజీవికి జన బలం వుందని నమ్ముతున్న కాంగ్రెస్ ఆదిస్థానం ఆయనకు మంచి పదవినే ఇవ్వనున్నట్టు తెలిసిది. అయితే చిరంజీవిని నమ్ముకొని కాంగ్రెస్ లో చేరిన వారికి మొండి చెయ్యే అని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టి పేరుతొ మార్పు ప్రజలకు అందలేదు కాని చిరంజీవికి మాత్రం ఉపయోగ పడుతోంది. రాష్ట్ర మంత్రిగా ఇచ్చిన చేస్తానని కూడా చిరంజీవి అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి లక్ష్యం చేరుకోవాలంటే రాష్ట్రంలో ఏదో ఒక పదవి అన్దాలిసిన అవసరం వుందని ఆయన అభిమానులు అంటున్నారు.

రైతు పోరుబాట గా చంద్రబాబు పాదయాత్ర




 
ఎక్కడ పోగొట్టుకున్నామో .. అక్కడే వెతకాలని సామెత . చంద్ర బాబు అదే చేస్తునారు. తెలుగు దేశం అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు బుధవారం అనంత పురం జిల్లా నుండి రైతు పోరుబాట పేరుతొ పాద యాత్ర మొదలు పెట్టారు.  దూరమైనా రైతులకు దగ్గరవుతూ పార్టి ప్రతిస్తా కోసం చేప్పటిన ఈ పాదయాత్ర  అప్పుడే అధికారపక్షం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి . రైతుకు గిట్టు బాటు ధర తో పాటు వివిధ అంశాలపై గతంలోనే చంద్ర బాబు నిరాహార దీక్ష చేప్పట్టిన విషయం విదితమే. అయితే ఇటీవల వర్షాలు కురవక కొన్ని ప్రాంతాలలో, ఎక్కువ వర్షంతో పంటలు పడి కొన్ని ప్రాంతాలలో రైతులు రాష్ట్ర వ్యాపితంగా నష్టపోయారు. ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టి కి మొదటి నుండి అండగా వున్న అనంతపురం ను ఎంపిక చేసుకోవడం విశేషం . అనంతపురం  దేశంలోనే అత్యంత కరువు జిల్లాగా పేరుపొందింది. ఈ పాద యాత్రలో భాగంగా చంద్ర బాబు రోజుకి 15 కి.మీ దూరం నడుస్తునారు. ఈ విధంగా 20 రోజుల పాటు జరిగే సుదీర్గ యాత్ర రైతులలో ప్రభుత్వ వ్యతిరేక భావాలు పెంచవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

గాలి కేసులో జగన్ ను విచారించనున్న సి. బి.ఐ

అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన గాలి జనార్ధన రెడ్డి కేసు విచారణలో భాగంగా వై.ఎస్. ఆర్ పార్టి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ని సి.బి. ఐ. విచారించనుంది. రెడ్ గోల్డ్, ఆర్.ఆర్. గ్లోబల్ సంస్థల పెట్టుబడులు సాక్షిలో వున్నాయని , గాలి అక్రమ పెట్టుబడులు సాక్షిలోకి వచ్చాయా లేవా అని విచారించనున్నట్టు తెలిసింది. జగన్ ను ఈ నెల 4 వ తేది హైదరాబాద్ లోని కోటి సి.బి.ఐ. అపిస్ కు రావాలని ఆదేశాలు ఇచ్చింది.  అయితే రాజకీయ వర్గాల అభిప్రాయం మేరకు జగన్ ను గాలి కేసులో విచారణ నిమిత్తం సి.బి.ఐ తన ముందుకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే అక్రమ ఆస్తులు కలిగి వున్నా కేసులో విచారణ ఎదుర్కొటున్న జగన్ కు తాజా పరిణామాలు మింగుడు పడడం లేదు. జగన్ కేసులో విచారణ మందకొడిగా సాగుతోందని , జగన్ కాంగ్రెస్ తో కుమ్ముక్కు అయ్యారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సి.బి. ఐ. గట్టి నిర్ణయం తీసుకొండానే చెప్పాలి .

Tuesday 1 November 2011

కోమటిరెడ్డి ఆమరణ నిరాహారదీక్ష

 
తెలంగాణా కోసం మంత్రి పదవికి రాజీనామాచేసి పోరాడుతున్న కాంగ్రెస్ నల్గొండ నాయకుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలంగాణా వచ్చే వరకు తన దీక్ష ఆగదని మరో సారి అన్నారు.  తెలంగాణా కు చెందినా వివిధ పార్టీల నాయకులు సంఘీభావం  తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా దీక్ష చెప్పట్టడం విశేషం . రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స చివరి నిమిషం వరకు నిరాహార దీక్షను వాయిదా వేసుకోమని కోరినా కోమటిరెడ్డి వినలేదని తెలిసింది. నల్గొండ జిల్లాలో తెలంగాణా ఉద్యమాన్ని ప్రతిష్ట పరిచి తెలంగాణా సాధనకోసం ఆయన పూనుకున్నట్టు అంటున్నారు. అయితే జగన్ వై. ఎస్. ఆర్. పార్టీ సహాయ సహకారాలతోనే కోమటి రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీ కి బేస్ కోసం ఇప్పటినుండి కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు ఆరోపణలు వున్నాయి. ఆయన నిరాహార డిక్ష ఎలాంటి పలితాలు ఇస్తుందో వేచి చూడాలి

Monday 31 October 2011

జగన్ కు లాభం చేకూర్చే దిశలో టి.ఆర్.ఎస్

 
జగన్ వేసుకున్న ప్లాన్ లో టి.ఆర్.ఎస్. పావుగా ఉపయోగపడుతోందని అంటున్నారు. ముందుగా సమాఖ్య ఆంధ్ర కు మద్దతు తెలిపిన జగన్ ప్రస్తుతం తెలంగాణా పై ఏమి మాట్లాడడం లేదు. మౌనం పాటిస్తున్నారు. జగన్ కాంగ్రెస్ , తెలుగు దేశం పార్టీ లను ఒంటరిగా ఏమిచేయలేక పోయారు. పైగా చంద్ర బాబు , కిరణ్ కుమ్ముక్కు అయ్యారని పలు సందర్భాలాలో అన్నారు. సి.బి. ఐ. కేసుల చిక్కుల్లో వున్నా జగన్ ప్రస్తుతం కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా ఏమి పెద్దగా మాట్లాడడం లేదు. కేసు కూడా నేమ్మదిన్చిందని అంటున్నారు . అయితే జగన్ తాను చేయ వలసిన పనిని తెలంగాణా వాదులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ప్రణాలికలు రూపొందించి నట్టు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా ముందుగా నాగం జనార్ధన్ రెడ్డి బృందం తెలుగు దేశం పార్టీ లో లేవనెత్తిన తిరుగుబాటు . ప్రస్తురం జూపల్లి, రాజయ్య తదితరులు కూడా జగన్ అంధ దండలతోనే టి.ఆర్.ఎస్. తీర్థం పుచ్చుకోన్నారని అంటున్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి  కూడా ఈ విషయంలో కీలక పాత్ర వహిస్తున్నట్టు అంటున్నారు. ఎదిఎమైనా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేసిన సత్పలితాలు రాలేదు. టి.ఆర్. ఎస్.  తో పొట్టు పెట్టుకొని వచ్చే ఎన్నికలలో పోటీ కూడా చేయవచ్చని అంటున్నారు. అయితే కాంగ్రెస్ తెలంగాణా పై తీసుకొనే నిర్ణయం పైననే జగన్ నిర్ణయం ఆధార పదివుంటుందని తెలుస్తోంది. తెలంగాణలో జగన్ కు చెప్పుకోదగ్గ స్తాయిలో ప్రజా ప్రతినిధుల మద్దతు లేదు . ఈ కారణంగా ఈ ఎత్తులు వేస్తున్నట్టు అంటున్నారు. టి.ఆర్.ఎస్ కూడా జగన్ తెలంగాణా కు మద్దతు ఇవ్వగలిగితే కలిసి పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తోందని సమాచారం.  కాంగ్రెస్, తెలుగుదేశం లు ఈ విషయంలో జాగ్రతగా లేకపోతె అపాయమే మరి.
--

Wednesday 26 October 2011

చంద్రబాబు పాదయాత్ర




రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితిని చక్కదిద్దడానికి  చంద్రబాబు నాయుడు  శ్రీకారం చుట్టారు. పార్టీ పతిష్టపరచడంలో భాగంగా ఆయన రైతుల కరువు సమస్యలపై పాదయాత్ర చేయనున్నారు. తొలుతగా పార్టీకి పట్టువున్న అనంతపురం జిల్లా నుండి మొదలు పెట్టి రోజుకు 15 కిలోమీటర్లు నడిచే విధంగా ఆతరువాత రోజు మరో జిల్లాలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ప్రణాళిక రూపొందిచారు. తెలంగాణలో చంద్ర బాబు యాత్రలు చేసి ఛాలా కాలం అయ్యింది . తన ఇమేజ్ తో పాటు తెలుగుదేశం పార్టీ కి పూర్వవైభవం తేవాలని సీనియర్ నాయకుల సలహా మేరకు పాదయాత్రకు ప్రణాళిక రూపొందిచినాట్టు చెబుతున్నారు. టి. ఆర్.ఎస్. పై మునుపటి నమ్మకం జనంలో పోలవరం టెండర్ల గొడవ వల్ల తగ్గిందని అంచనా వేస్తున్నారు. మరి పూర్వ వైబవం దక్కుతుందో లేదో కాని టి.ఆర్.ఎస్ తో మాత్రం వీధి పోరాటాలు తప్పేతట్టులేదని పరిశీలకులు అంచనా వేస్తునారు.

Monday 24 October 2011

కిరణ్ కు కలసి వస్తోన్న కాలం ..



ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ పదవిలో నిలదొక్కుకుంటున్నారని చెప్పవచ్చు. రోశయ్య స్థానంలో ఆయన పదవిలోకి వచ్చినప్పుడు అంతగా ఎవరూ ఆయనను ఆ పదవిలో ఆయన కుదురుకుంటాడని చెప్పలేని పరిస్తితి అయితే కాలం ఆయనకు కలసి వస్తోంది. ఒక్కొక్క సమస్య చిక్కు ముడిలా వున్నా ఓపికతో ఆయన ఆ ముడులను విప్పుతూ ఢిల్లీ పెద్దల దృష్టిలో మార్కులు కొట్టేస్తున్నారు. ఆయన సి. ఎం ఐన తరువాత తోలి సమస్య జగన్ మోహన్ రెడ్డి నుండి పోటీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ పార్టీలో చాల బలంగా కనిపించారు తన దయ దాక్ష్యనం వల్లే కాంగ్రెస్ రాష్ట్రంలో ఆధికారంలో వుందని ప్రకటించారు కూడా. కాని కాలం జరిగిన కొలది ఆయన కాంగ్రెస్ నుండి వైదొలగి కొత్త పార్టీ పెట్టారు . కాంగ్రెస్ ఎం. ఎల్ ఎ లను ఎక్కువ మందిని తన వైపు ఆకర్షించి ప్రభుత్వాని కూలగోదతారని భావించారు . అయితే అలా జరుగలేదు సరికాద జగన్ పై హై కోర్ట్ ఆదేశాల మేరకు  సి.బి. ఐ కేసులు నమోదు చేస్తి విచారణ ప్రారంభించింది. ఇప్పుడు జగన్ తనను తానూ కాపాడుకునే పరిస్తిలో వున్నారు.

మంత్రి వర్గ విస్తరణ, శాఖల కేటాయింపులపై ఎన్నడూ లేనంత అసంతృప్తి పెల్లుబికింది. అధిష్టానం అండదండలతో ఆ గండం గట్టేక్కగాలిగారు.

అలాగే తొమ్మిది ఏండ్లు రాష్ట్ర ముఖ్య మంత్రిగా పని చేసిన చంద్ర బాబు నుండి సమస్యలు ఎదురైనాయి. ఆయన రైతుల కోసం చెప్పటిన నిరాహార దీక్ష సంచలనం అయింది . అయితే ఓపికతో కిరణ్ ఆ సమస్యను ఎదుర్కొని ఎలాంటి ఇబ్బంది పడలేదు. అలాగే తెలుగు దేశం పార్టీ స్పీకర్ ఎన్నికకు పట్టుపడితే తెలివిగా తనకు కావలసిన వ్యక్తిని ఎంపిక చేసుకొని పై చేయి సాధించారు .

ఇకపోతే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా వుండిన చిరంజీవి సహాయం తీసుకొని ప్రభుత్వం నిలబెట్టుకొని ఆయనను , ఆయన పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసుకున్నారు . చిరంజీవి నుండి ప్రస్తుతం పోటీ లేదు. ఆయనకు ఏ పదవి దక్కలేదు సరి కదా ఆయన కోరుకున్న108  నిర్వహణకు కిరణ్ అంగీకరించలేదు. చిరంజీవి నుండి వచ్చే ఎన్నికల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు.

రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షుడిగా ఎన్నికైన బొత్స ఆరంబంలో సభలు సమావేశాలు పెట్టి కిరణ్ ను డామినేట్ చేయడానికి ప్రయత్నించారు . అయితే ఆయన వేగానికి తెలంగాణా రూపంలో బ్రేక్ పడింది . ఆయన పాత్ర పార్టీ వరకే పరిమితం అయింది.  అయితే బొత్స ఇంకా పట్టు వదలకుండా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తున్నారు.

రోశయ్యను ముప్పు తిప్పలు పెట్టిన తెలంగాణా సమస్య కిరణ్ కుమార్ రెడ్డి కి కూడా తల నొప్పులు తీసుకు వచ్చింది . సకల జనుల సమ్మె పేరుతొ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె పాటించారు. సింగరేణి కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పతి ఆగిపోయి రాష్టంలో కరెంట్ కస్టాలు మొదలు అయ్యాయి. అలాగే ఆర్.టి. సి. సమ్మె తో ప్రయాణికులు ఇబ్బంది పడ్డాడు . దాదాపు నెలరోజులుగా సాగుతున్న సమ్మె ఒక్కొక్క సమ్మె విరమణ చేయించడంలో సఫలీక్రుతుడైనట్టే . తెలంగాణా వాదులు చేప్పట్టిన రైల్ రోకోను సమర్ధవంతంగా ఎదుర్కొని సమ్మె ఉదృతంగా ఉన్నప్పుడే రాష్ట్ర పరిస్తితులకు, సామాన్యుల కష్టాలకు కే.సి.ఆర్., కోందండరామ్ కారణమని చెప్పా గలిగారు . 

నిన్నటికి నిన్న ఎం. ల్.సి. పోస్ట్ కు డి.ఎస్. ను ఎంపిక చేసి ఢిల్లీ లో తన పలుకుబడి చాటుకున్నారు. బొత్స చేసిన సిపార్సులు బుట్ట దాఖలు అయ్యాయి.  ఏది ఏమైనా కిరణ్ కు కాలం కలసి వచ్చింది.. ఇప్పుడు ఆయన మెల్లగా మంత్రి వర్గం మళ్ళి విస్తరించే అవకాశం వుంది

Wednesday 19 October 2011

చంద్ర బాబు అవినీతి పై విజయమ్మ కోర్టులో కేసు ..





వై. ఎస్. జగన్ పై సి.బి.ఐ. విచారణ ఇంకా పూర్తికాలేదు . ఇప్పటికే కాంగ్రెస్ తో జగన్ మిలాఖత్ అయ్యారని అందుకే ప్రధాన మంత్రిని కలిసిన తరువాత సి.బి. ఐ. కేసు మందకొడిగా సాగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వై. ఎస్. ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి  భార్య విజయమ్మ చంద్ర బాబు ఆధికారంలో వుండగా అవినీతికి పాల్పడ్డారని హై కోర్ట్ లో పిల్ వేసారు .దాదాపు 2500 పేజీలతో ఓ చిట్టా కూడా అందించారు. రాజకీయాలు అంటే ఏంటో మనకు ఈ పాటికే అర్థం అయివుండాలి. జగన్ పై కేసుల చంద్ర బాబు పై విచారణకు కోర్టు ఆదేశాలు ఇస్తే జగన్ పై పడ్డ మచ్చను జనం మర్చి పోతారని ఎత్తుగడగా ఈ పని చేసారు . వై . ఎస్. రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో కేసులు వేసివిరమించుకున్న విషయం విదితమే. ఇంతకూ చంద్ర బాబు విచారణకు అంగీకరిస్తారా లేకుంటే సుప్రీం కోర్ట్ కు వెళ్లి మళ్ళి స్టే తెచ్చుకుంటారో వేచి చూడాలి.





Tuesday 18 October 2011

నీరు కారిన సకల జనుల సమ్మె

సుదీర్ఘ కాలం కొనసాగిన సకల జనుల సమ్మె సామాన్యులను అష్ట కష్టాలకు గురిచేసింది. ప్రజల వ్యతిరేక పవనాలు చూసి ఒక్కొక్కరుగా సమ్మెను వాయిదాగా ప్రకటించి విరమిస్తున్నారు. తొలుత ఆర్.టి. సి. ఉద్యోగులు , తరువాత టీచర్స్, అనంతరం సింగరేణి కార్మికులు సమ్మె విరమించారు . దీనికి జే. ఏ. సి. కూడా అనుమతి తీసుకొన్నారు . సమ్మె విరమణ కాదని వాయిదా మాత్రమె నని ఎప్పుడు కోరితే అప్పుడు సమ్మె కొనసాగిస్తామని అందరూ ఒకే రకంగా చెప్పారు. అయితే సుదీర్గ కాలం సమ్మె ఉంటుందని సిద్ధం కాలేదని తెలుస్తోంది . 10 -20  రోజులు అయితేనే ప్రభుత్వం దిగివస్తుందని , తప్పకుండ తెలంగాణా అనుకూల ప్రకటన చేస్తుందని అందరూ భావించారు . యింతే వాస్తవానికి ప్రభుత్వం సమ్మె పట్ల కటినంగా వ్యవహరించింది. ఉద్యోగులకు జీతాలు నిలిపివేశారు. అంతే కాకుండా చర్చలకు దాదాపు నెల రోజులైనా పిలువలేదు . సకల జనుల సమ్మె వాళ్ళ రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టమో అంత కన్నా సామాన్యులకు ఛాలా నష్టం జరిగింది. ఇకపై తెలంగాణా ప్రజలు సమ్మె పట్ల జాగ్రతగా ఉండవలసిన అవసరం వుంది.

Monday 17 October 2011

ఇమేజ్ పెంచుకున్న కిరణ్


సకల జనుల సమ్మె తెలంగాణా కు ఏమి పలితం ఇచ్చిందో తెలియదు కాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఇమేజ్ ను పెంచుకున్నారని చెప్పా వచ్చు. స్వంత ప్రతి వారికే కొరుకుడుపడని తత్వం, మాటలో మెత్తంగా ఉంటూ చేత్తల్లో దృడంగా వుండడం అందరూ మెచ్చుకుంటున్నారు. రైల్ రోకోను విజయవంతంగా ఎదుర్కొని స్వంత పార్టీ వారిని కూడా అరెస్ట్ చేయించడం సాధారణ విషయం కాదు. మొత్తం పోలీసు శాఖను తన అదుపులోకి తెచ్చుకొని ఎలాంటి సవాల్లనయిన ఎదుర్కుంటున్నారు . గవర్నర్, ముఖ్యమంత్రి ఒక టీం గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు హై కమాండ్ సలహాలు తీసుకుంటున్నారు . అయితే కాంగ్రెస్ పార్టీ లో ఇంకా కిరణ్ కు పట్టు దొరకలేదనే చెప్పాలి. ఏది ఏమైనా సమ్మె సాగతీత వాళ్ళ జే. ఏ. సి,. కి ఏమి చేయాలో తెలియడం లేదు. సమ్మె కొనసాగిస్తే ప్రజల వ్యతిరేకత వస్తుందేమో నని , సమ్మె కొనసాగించక పొతే ప్రభుత్వం ఇంకా కటిన చర్యలు తీసుకున్తుందేమో నని ఆలోచిస్తున్నారు.  ఆర్.టి. వి. సమ్మె విరమణ వాళ్ళ ఊపిరి తీసుకున్న ప్రభుత్వం ఉద్యోగులు, సింగరేణి కార్మీకుల నుండి విరమణ కోరుకుంటున్నారు . కాంగ్రెస్ ప్రజా ప్రతి నిధులు ఇప్పుడు ప్రజల దృష్టిలో విల్లన్లుగా మారినట్టే,. తెలుగుదేశం మాత్రం తాము ఉన్నామని రాజీనామాలు చేసారు అయితే వారికి ఎవరి మద్దతు ఉండడంలేదు.
మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డిని పరిస్తితులు బలంగా తయారు చేస్తున్నాయని చెప్పా వచ్చు.

Friday 14 October 2011

రసకందాయం లో రైలురోకో

తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా జే.ఎ. సి. ఆధ్వర్యంలో చేపట్టిన రైలురోకో అటు ప్రభుత్వానికి , ఇటు ఉద్యమ కారులకు ప్రతిష్టగా మారింది. రెండు ప్రక్కల ఊహాత్మక కార్యక్రమం అమలు చేయుటకు పూనుకున్నారు. ఇప్పటికే తెలంగాణా అంతట ముఖ్యమైన ఉద్యమ కార్యకర్తలను పోలీసు లు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పట్టాలపైకి వస్తున్నా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. రైల్వే చట్టాలపై ఇప్పటికే ప్రాచారం కల్పించి ఆ ప్రకారం అరెస్ట్లు చేస్తున్నారు. ప్రత్యెక పోలీసు దళాలను రప్పిస్తున్నారు. హెలి కప్టర్ సహాయంతో రైల్వే ట్రాక్ లపై భద్రత చర్యలు చెప్పుతారు . డి.జి.పి దినేష్ రెడ్డి చెప్పడుతున్న చర్యలపై అప్పుడే టి. ఆర్. ఎస్. ,జే.ఎ. సి. నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య బాధంగా తమ నిరసన తెలుపుతున్నామని , అణిచివేసేందుకు ప్రయత్నించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో రైలు రోకో కు జనం పట్టాలపైకి వస్తున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసులు బుక్ చేస్తున్నారు. రైలు రోకో తో జాతీయ స్థాయిలో తెలంగాణా సమస్యను తెలుపాలనుకున్న జే.ఎ. సి.  ఈ పోరాటాని ప్రతిస్తాగా తెస్తుకొని పనిచేస్తోంది. అయితే సామాన్య పరాజ కష్టాల పట్ల ఎవరు పట్టించుకోవడం లేదు.  

Thursday 13 October 2011

సంపాదన కోల్పోతున్న సామాన్యులు !


తెలంగాణాలో ఉదృతంగా జరుగుతున్నా సకల జనుల సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించి చేస్తున్న సమ్మె వల్ల సామాన్యుల పరిస్తితి అడ కత్తెరలో పోక చెక్కలా తయారయింది . రెక్కాడితే కాని డొక్కాడని బడుగు వర్గాలు ఈ సమ్మె పట్ల తమ ఆర్థిక పరిస్తితి దెబ్బ తిందని , తమను ఆదుకోవాలని అంటున్నారు. బహిరంగంగా మాట్లాడాలని వున్నా వారిని వేధింపుల బయం వెంటాడుతోంది. ఇప్పటికే ఖమ్మం లో సామాన్యస్తితిలో ఆర్.టి. సి. బస్సులు తిరుగుతున్నాయి. తెలంగాణా కావాలనుకునే కోట్లాది మందిలో తాము ఒకరమని  తమ సమ్మె వల్ల రోజూ రాబడి పోతోందని, కుటుంబ పోషణ  మరింత భారమిందని అంటున్నారు .. ఎదిఎమైనా సుధీర్గ సమ్మె వల్ల కేంద్రంలో కదలిక వచ్చింది. అయితే  ఎ నిర్ణయం వెలువడుతుందో తెలియదు .. ఈ సమయంలో సమ్మె విరమిస్తే అసలుకే ఎసరు వస్తుందని కొన్ని రోజులలో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోక 
తప్పదని ఉద్యమ నాయకులు అంటున్నారు.  అయితే సమ్మె కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాలని అనుకున్నా మాట్లాడలేని స్తితి నెలకొంది .  

ఉద్యమం నెల బాలుడు ...!

తెలంగాణా ఉద్యమం నేటికి నెల రోజులుగా సకల జనుల సమ్మెలో ఉదృతంగా వుంది. అన్ని రంగాల ప్రజలు స్వచండంగా పాల్గొంటున్నారు . ఈ సకల జనుల సమ్మెతో కేంద్రానికి సెగ తగిలింది. ఈ నెల రోజులుగా ఆర్.టి. సి. బస్సులు ఆగిపోయాయి. ఆర్.టి. సి. యూనియన్లో చీలిక వచ్చి కొన్ని ప్రాంతాలలో బస్సులు రోడ్డు పదికి వచ్చిన జే.ఎ. సి కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రైల్ రోకో తోలిదపా విజయవంతంగా జరిగింది. రెండో దపా రైల్ రోకో కు సన్నధం అవుతున్నారు. ఈ నెల రోజులలో తెలంగాణా తెలుగు దేశం శాసన సభ్యులు రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ ఎం.పీ లు ప్రభుతవానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారితో కాంగ్రెస్ హైకమాండ్ పలు దపాలు చర్చించినా తెలంగాణా పై ఇంతవరకు తన నిర్ణయాని తేల్చి చెప్పలేక పోతున్నారు. అయితే ఈ సకల జనుల సమ్మె వాళ్ళ సామాన్య ప్రజలు త్రీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడ తలవంచకుండా కటినంగా వ్యవహరిస్తోంది. అయితే ఎక్కువ కాలం ఉద్యమం కొనసాగితే ఇప్పటికే కరెంట్ కొరత వాళ్ళ రైతులు నష్ట పోతున్నారు . విద్యార్తులు చదువులు కోల్పోతున్నారు. కేంద్రం వెంటనే ఏదో ఒకటి తేల్చి చెప్పి సమస్యను పరిస్కరించావలసి వుంది. 

కె.సి.ఆర్ కు మందకృష్ణ వార్నింగ్

 సకల జనుల సమ్మెలో తెలంగాణా కు వ్యతిరేకంగా వున్నా కాంగ్రెస్ వారిపై కె. సి. ఆర్ . అనుచితంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.  కాంగ్రెస్ నాయకులు బూట్ పోలిష్ గాళ్ళు అన్న కె.సి.ఆర్ మాటలు దుమారం లేపుతున్నాయి. కె.సి.ఆర్ లోని దొర పెత్తనానికి ఇదో ఉదాహరణ అని మాదిగల కుల వృతిని అవమానిచేట్టట్టుగా వుందని ఆయన శరీరానికి చెప్పులతోనే పోలిష్ వేస్తామని మాదిగా దండోరా రాష్ట్ర అద్యక్షుడు మంద కృష్ణ మాదిగా హెచ్చరించారు. తెలంగాణా రాష్ట్ర సాధనకు కె.సి.ఆర్ కు చిత్తశుద్ధి లేదని , తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తోలి ముఖ్యమంత్రి దళితుడే అంటున్న కె. సి. ఆర్. తన పార్టీ అధ్యక్షుడుగా 10 జిల్లాలలో ఒక జిల్లాలో కూడా నియమించలేదని, 




బహిరంగా సభలలో దళితులను కనీసం తన ప్రకన్న కూర్చోబెట్టుకోరని మంద కృష్ణ అన్నారు. వెంటనే విద్యాసంస్థలు తెరిచి పిల్లల చదువులు కాపాడాలని లేకుంటే తమ మాదిగా దండోరా తరపున వేలమంది నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. 

Wednesday 12 October 2011

తెలంగాణలో పిల్లల చదువుల పట్ల ఆందోళన


ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేప్పట్టిన సకల జనుల సమ్మె జనుల పాలిత శాపం గా మారుతోంది. ముఖ్యంగా విద్యార్థుల చదువులకు ఆటకం కలుగుతోందని తల్లితండ్రులు వాపోతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టి విద్య సంవత్సరం నష్టం జరుగుతుందని బయపడుతున్నారు. సమ్మె నుండి ఆర్.టి. సి , విద్య సంస్తలకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు .
ఇప్పటికే చాల మంది తమ పిల్లలను విజయవాడలో చేర్చినట్టు తెలుస్తోంది .  ఖమ్మంలో అయితే మన్యం రాష్ట్ర సాధన సమితి ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె ఆపాలని భారీగా ర్యాలి నిర్వహించారు.

తెలంగాణా సమస్యతో కోర్ కమిటి తికమక


తెలంగాణా రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం చేయాలని ప్రయత్నిస్తున్న కోర్ కమిటికి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోవడంలేదు . కాంగ్రెస్ ముఖ్య నాయకులతో  సంప్రదింపులు పూర్తి చేసిన తరువాత సమస్య పరిష్కారం అంత సులభం కాదని కోర్ కమిటి తలపట్టుకోవలసి వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో మూడు ప్రాంతాల ప్రజల మనోబావాలను గుర్తెరిగి, హైదరాబాద్ లో బలంగా వున్న ఎం.ఐ .ఎం (ముస్లిం ) వారి అభిప్రాయాన్ని తీసుకొని , సమస్యను జాతీయ స్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గం చూపవలసిన అవసరం వుంది . అయితే కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులే పైకి భయపడి తెలంగాణా అంటున్నా, తెలంగాణా ఇస్తే టీ . ఆర్ .ఎస్ ను అడ్డుకోలేమని , వారు బి.జే.పి లో కలిసే అవకాశముందని అంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసమే టీ . ఆర్ .ఎస్ వీలీన ప్రతిపాదన ముందుకు వచ్చింది . అయితే ఈ సమయంలో పార్టీని వీలీనం చేస్తే దెబ్బ తినే అవకాసం వుందని టీ . ఆర్ .ఎస్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో మమతా బెనర్జీ కూడా అడ్డుపుల్ల వేసిందని , ఒక వేల తెలంగాణా ఇస్తే పచ్చిమ బెంగాల్లో ప్రత్రేక రాష్ట్ర ఉద్యమం మళ్ళీ రాజుకుంటుందని ఆమె భయం. కేంద్ర ప్రభుత్వ మనుగడకు ఆమె సహాయం తప్పనిసరి . ఇన్నింటి నడుమ కేంద్ర కోర్ కమిటి నిర్ణయం తీసుకోలేక తిక మక పడుతోంది. తెలంగాణా రాష్ట్రము ఇస్తామంటే ఇప్పుడు తెలంగాణలో వున్న పరిస్తితే సీమాంద్రలో వస్తుందని అంచనా వేస్తోంది. తెలంగాణా సమస్య వెంటనే తీరేది కాదని అర్ధం అవుతోంది . హడావుడి నిర్ణయాల వాళ్ళ రాష్ట్రం ఇప్పటికే రావణ కాష్టం అయింది . సమ్మె విరమించి శాంతియుత బాటలో నిరసనలు చేయవలసిన అవసరం ఏర్పడింది . లేదంటే ఉద్యమం పట్ల తెలంగాణా లో వున్న సానుభూతి  వ్యతిరేకంగా మారే ప్రమాదం వుందని అంటున్నారు .





Friday 7 October 2011

నేడో రేపో తెలంగాణా పై స్పష్టమైన ప్రకటన ?


రాష్ట్రంలో సకల జనుల సమ్మెతో స్తంబించిన పాలనతో కేంద్రం ఆలోచనలో పడింది. తెలంగాణా పై ఇంతవరకు తేల్చని కేంద్రం నేడో రేపో ఓ స్పష్టమైన ప్రకటన చెయ్యొచ్చని తెలుస్తోంది. ఈ విషయమై ప్రత్యేకంగా చర్చించడానికి ఢిల్లీ కి సి. ఏం. కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, పి.సి.సి. చీఫ్ బొత్స ఇప్పటికే పిలిపించారు. శుక్రవారం ప్రణబ్ తో 20 నిమిషాలపాటు సోనియా తెలంగాణా విషయం చర్చినట్టు ఆ తరువాత మినీ కోర్ టీం 40 నిమిషాలపాటు తెలంగాణా సమస్యపై చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా కు అనుకూలంగా ప్రకటన వెలువడితే సీమంద్రలో పెల్లుబికే నిరసనలు ఎలా అదుపు చేయాలో ఆలోచిస్తున్నారు. ఒక వేల తెలంగాణాకు వ్యతిరేకంగా ప్రకటిస్తే ఇప్పటికే సమ్మె లతో అట్టుడుకుతున్న తెలంగాణా మరింత ఆందోళనలకు గురవుతుంది. ఏది ఏమైనా రెండు ప్రాంతాలు ఆమోదించే నిర్ణయం రావాలని ఆశిద్దాం .

Wednesday 5 October 2011

తెలంగాణాకు ఎం.ఐ. ఎం. మోకాలడ్డు !


హైదరబాద్ పాతబస్తీలో బలమైన రాజకీయ పార్టీగా వున్నా ఎం.ఐ. ఎం. తెలంగాణాకు మోకలడ్డుతోంది. తమ పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం నిర్ణయాలపై ఆధారపడమని, తము ప్రస్తుతం రాష్ట్రం వున్నా స్తితినే కోరుకుంటున్నామని , ఒక వేల తప్పనిసరి పరిస్తితులలో తెలంగాణా ఇవ్వదలిస్తే రాయలసీమ తెలంగాణలో కలుపాలని, హైదరాబాద్ రాజధానిగా వుండాలని కోరుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకుడు ఒవైసీ తెలిపారు. ఈ విషయం ఇదివరకే శ్రీకృష్ణ కమిటీ కు నివేదించామని అన్నారు. దీన్ని బట్టి చూస్తీ ఆ పార్టీ సమఖ్యంద్ర కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు . దీంతో తెలంగాణా సమస్య పరిష్కారం మరింత గందరగోళంలో పడినట్టేనని అంటున్నారు .

కష్టాల్ల సుడిగుండంలో రాష్ట్ర ప్రగతి


ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అంటేనే దేశంలోనే ఆర్థిక సంస్కరణలకు, అభివృధికి నమూనాగా చెప్పుకునే వారు .. ఇక్కడా అమలయిన పథకాలు, పలితాల బట్టి ఆయా రాష్ట్రాలలో అమలు చేసే వారు . ఇప్పుడు పూర్తిగా తిరోగమనం వైపు నడుస్తోంది. బలమైన నాయకత్వలేమి, తెలంగాణా సమస్య, కేంద్రంలో రాష్ట్ర ప్రగతి పట్ల చిత్తసుద్ధిలేని ప్రభుత్వరం వెరసి రాష్ట్రంలో గందరగోళ పరిస్తితులు నెలకొని వున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ అవకాశవాద రాజకీయాలతో కాలం గడుపుతున్నాయి. టి.ఆర్.ఎస్ వైఖరిని తాపు పట్టలేము ఎందుకంటే ఆపార్టీ పుట్టిందే తెలంగాణా రాష్ట్ర సాధనకోసం. మిగిలిన పార్టీలు ఎందుకు టి.ఆర్. ఎస్ వెనుక , జాయింట్ ఆక్షన్ కమిటీ వెనుకు నడుస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తామూ పోరాదామని చెప్పుకోవడానికే అనిపిస్తుంది. ఒక సి.పి.ఏం . మినహాహిస్తే అన్నీ ప్రాంతాల కనుగుణంగా ఊహత్మకంగా నడుస్తున్నాయి. చిదంబరం డిసెంబర్  9 ప్రకటన  తొందరపాటు చర్య. సోనియా బర్త్ డే కానుకగా తెలంగాణా ఇద్దామనుకుని భంగపడ్డారు. పోనీ
 ఆ అభిప్రాయానికి నిలబడకుండా మళ్ళీ అభిప్రాయాన్ని మార్చుకొని చర్చలు అంటున్నారు. ఈ రెండు ఏళ్ళు రాష్ట్రంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, రెండుప్రాంతాల వారి మధ్య చిచుకు కారణం రాజకీయ పార్టీలే . సకజ జనుల సమ్మె వాళ్ళ రాష్ట్రం మరింత కష్టాల్లో వుంది. పండుగ లేదు. ప్రయాణం లేదు. సామన్యుని నోటికాడ కూడు తీసేస్తున్నారు. వెంటనే పరభుత్వం స్పందించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలి. జరిగిన నష్టం పూడ్చుకోవడానికి ప్రపంచ బ్యాంకు నుండి మరో 2000 కోట్లు అప్పు తెస్తున్నారు. రాష్ట్రం ప్రగతి గాడిలో పాడాలని ,ఈ దసరా అందరికి మంచి గుణాన్ని ఇవ్వాలని కోరుకుందాం.

Tuesday 4 October 2011

కాంగ్రెస్ లో టి. ఆర్ . ఎస్ విలీనం !




కాంగ్రెస్ పార్టీ లో టి. ఆర్. ఎస్ వీలీనం ప్రతిపాదన మళ్ళీ తెరపైకి వచ్చింది . న్యూ ఢిల్లీ లో మకాం వేసి వున్నా టి. ఆర్.ఎస్ ఆధినేత కే. సి. ఆర్ తో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. ఒక వేల తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అక్కడ కాంగ్రెస్ మనుగడ ప్రస్నార్థకం అవుతుంది. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన టి. ఆర్.ఎస్ ను వీలీనం చేసుకుంటే తెలంగాణా ఏర్పడినా కాంగ్రెస్ ఎలాంటి డోఖా ఉండదని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తె తెలుగుదేశం ఆరోపిచినట్టు టి. ఆర్. ఎస్ ఇంతకాలం తెలుగుదేశం పై ఉద్దేస పూర్వకంగానే దాడి చేస్తునట్టు అర్ధమవుతోంది. పాదరసం లా ఎప్పటికికప్పుడు మారిపోతుందే కే.సి. ఆర్ ను నమ్మడం అంటే కాంగ్రెస్ పూర్తిగా నట్టేట్లో మునిగినట్టీ అంటున్నారు. ఎలాగో ఒక లాగా తెలంగాణా రాష్ట్రము ఏర్పడితే తమ ఉనికి పోకూడదని కాంగ్రెస్ తెలంగాణా నాయకులు మల్ల గుల్లలు పడుతున్నారు .

Sunday 2 October 2011

క్రొత్త పథకాల పిచ్చిలో కిరణ్ !



ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం క్రొత్త పథకాల పిచ్చిలో వున్న్తట్టు వున్నారు . దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ని మరిపించాలని, పరిపాలనలో తనదైన ముద్ర వేయాలని తహ తహలాడుతున్నట్టు కనబడుతోంది. అనుచరుల అండ లేకుండా కేవలం ఆదిస్థానం అండ దండలతో ముఖ్యమంత్రి పదవి అనుకోకుండా వరించింది.  పార్టీలూ కూడా సరైన విధంగా సహకారం లేదు. అది కాకుండా ఒక ప్రక్క బొత్స , రెండో ప్రక్క చిరు పక్కలో బల్లెలా వున్నారు . ప్రస్తుతం రాష్ట్రా రాజకీయాలలో శూన్య యుగం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా సమస్యతో నిర్వీర్యం అయిపోతోంది. అసలు ప్రభుత్వం ఉందా లేదా తెలియడం లేదు. ఈ విషయాన్ని పక్క దారి పట్టించి తనకు పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చే విధంగా పతకాలు రూపొందించి వాటిని శరంపరలుగా జనంలోకి వదులుతున్నారు . మహిళలను దృష్టిలో పెట్టుకొని మొన్న స్త్రీ శక్తి పేరిట రాష్ట్ర స్తాయి బ్యాంకు కు
శ్రీ కారం చుట్టారు . యువజనులను దృష్టిలో పెట్టుకొని 15  లక్షల ఉద్యోగాలు ఇంస్తున్నట్టు అందులో డిసెంబర్ లోనే ఒకే రోజు ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తునట్టు ప్రకటించారు కూడా. అంతలోనే కిలో రూపాయి బియ్యం ప్రకటించి గాంధీ జయంతి సందర్బంగా సంతకాలు చేసి అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్సారు . ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణా పథకాని ప్రకటించారు . ఇన్ని పతకాలు ప్రకటిస్తూ వుంటే కాంగ్రెస్ పార్టీ వారీ నోర్లు వేల్లబెడుతున్నారు . సాటి మంత్రుల కూ పరకించిన అనంతరమే తెలుస్తోంది . మరి ఈ పతకాలు కిరణ్ కుమార్ ఆశిస్తున్నాటు మంచి పలితాలు ఇస్తాయా లేక మరిన్ని సమస్యలు తీసుకు వస్తాయా వేచి చూడాలి .

Friday 30 September 2011

సోనియా చెవిలో ఆజాద్ చెప్పినదేమి ?


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల భాద్యుడు గులాబ్ నబి ఆజాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఇరు ప్రాంతాల నాయకులతో చర్చించిన తరువాత సోనియా గాంధీకి అందించిన నివేదిక ఎటూ తేల్చని ఓ ప్రహసనం అయింది . తెలంగాణా కు అనుకూలమని, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని , రాయల తెలంగాణా అని ఏదో ఏదో అనుకుని ఎదురు చూసిన నివేదిక ఎలాంటి దిశా నిర్దేశం చేయలేదని చెప్పాలి. అయితే ఇదే సమయంలో తెలంగాణా కాంగ్రెస్ నాయకులూ ముందే ఈ నివేదిక చూసి కూడా ఏమి మాట్లాడక పోవటం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికలో సమస్యను లోతుగా, పత్రి వ్యవహారాలను చర్చిన ఆజాద్ తెలంగాణా రాష్ట్రం ఇవ్వాళా వద్దా అని తేల్చలేకపోయారు. ఏదైనా తేలిచి చెబితే ఎక్కడ శ్రీ కృష్ణ కమిటీ, చిదంబరం పై వచ్చిన విమర్శలకు భయపడి నివేదిక ఆలా వ్రాసి ఉంటారని ఆయన చెప్పతలచిన విషయాని సోనియా చెవిలో ఊది ఉంటారని అంటున్నారు . మరి కాంగ్రెస్ నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి .

అమావాస్య చంద్రుడు ...మన బాబు !!


చంద్ర బాబు నాయుడు అంటే ఒక్కప్పుడు యువకులకు స్ఫూర్తి. శ్రమ గురించి, జన్మ భూమి కి ఏదైనా చేయాలనీ చెప్పిన ఆశయాల గురించి. నీరు మీరు అని ఏమి చెప్పినా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాటించారు . ఐ. టి. విప్లవం మూల పురుషుడుగా, హైదరాబాద్ నగర అభివృధికి , 20 సంవత్సరాల విజన్ రూపశిల్పిగా పేరు గడించారు. అంతాకన్నా మహిళా సంఘాలకు దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ ను ప్రధమ స్తానంలో నిలుప గలిగారు . రాజకీయ నాయకుడుగా దేశంలోనే ముగ్గురు ప్రధ్రానుల (దేవేగౌడ, వాజిపాయ్, గుజ్రాల్ )నియామకం లోనూ మరియు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక కవడంలోనూ కీలక పాత్ర చంద్ర బాబుదే . అప్పుడు ఆయన ఏది పట్టినా
 బంగారమే. మారు మూల పల్లెలోని ఆడపడుచుకు , అమెరిక అద్యక్షుడు క్లింటన్ కు సుపరిచితమైన వాడిగా గుర్తింపు పొందారు. డ్రీం కాబినెట్ కు ఎంపికైన ఏకైక  భారతీయుడు . అంతేగాక మన్మోహన్ , పి.వి. నరసిహారావు మొదలు పెట్టిన ఆర్ధిక సంస్కరణలు వేగంగా అందిపుచ్చుకుని మొండిగా ముందుకు దూకుడుగా  వెళ్ళిన వాడు . ప్రభుత్వ శాఖలలో నియంత్రణ వుండాలని ప్రజల భాగస్వామ్యం  పెంచిన వాడు . అదంతా ఒకప్పటి మాట ..అప్పుడు ఆయన పున్నమి చంద్రుడు . మరి ఇప్పుడు అమావాస్య చంద్రుడు .  వరుసాగా రెండు ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయి , తెలంగాణా సమస్యలో ఇర్రుక్కుపోయి తలపట్టుకొని కూర్చుని వుంది పోతున్నాడు . తనకు ప్రధాన పోటీదారుడు వై. ఎస్. మరణించిన తరువాత కూడా చంద్ర బాబు పరిస్తితి మేరుగుపడినట్టు చెప్పలేకపోట్టున్నారు . చిరంజీవి ప్రజారాజ్యం వల్ల , టి. ఆర్. ఎస్. పొట్టు వల్ల గత ఎన్నికలలో ఓడిపోయినా తెలుగుదేశానికి ఇప్పుడు టి.ఆర్.ఎస్ ప్రధాన శత్రువు. జగన్ కూడా నిన్న మొన్నటి వరకు భయపెట్టినంత పనిచేశాడు. సి.బి.ఐ. కేసుల వల్ల తెలుగు దేశం ఊపిరిపీల్చుకుంది . మరి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చంద్ర బాబు అమావాస్య నుండి తిరిగి పున్నమి చంద్రుడుగా ఉద్బవిస్తారా లేదా అని వేచి చూడాలి.




నేడు సోనియా కు ఆజాద్ నివేదిక

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల భాద్యుడు ఆజాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విబజన అంశంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి ఈ రోజు సాయంత్రం నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నివేదిక ఇవ్వక మునుపే ఆయన రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారితోనూ విడి విడి గా రెండు దపాలు సమావేశమై విపులంగా చర్చించారు. అయితే నివేదిక ప్రస్తుతం ఉదృతంగా వున్నా తెలంగాణా ఉద్యమానికి అనుకూలంగా ఉంటుందా లేక సమైఖ్య ఆంధ్రకే మొగ్గు చూపుతార అన్నది తెలియల్సివుంది. అయితే హైదరాబాద్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆవకాశం ఎక్కువగా వుంది. రెండు రాష్ట్రాలు రెండు రాజధానులు చేస్తూ హైదరాబాద్ మాత్రం కేంద్ర నియంత్రణలోకి తీసుకొనే అవకాసం వుందని అంటున్నారు. ఇదే జరిగితే రెండు పిల్లులు కోట్లడుకుంటే కోతి లాభాపదినట్లు కేంద్ర హైదరాబాద్ వాళ్ళ లాభ పడుతుందని చెబుతున్నారు. ఆజాద్ నివేదిక ఆదరంగానే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రావొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎలావుంటుందో చెప్పలేము.

Thursday 29 September 2011

మంత్రి శంకర్ రావు భర్తరప్ !


రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రిగా వుంది సహచర మంత్రులపై  అవినీతి ఆరోపణలు చేసిన చేనేత శాఖా మంత్రి శంకర్ రావు ను పదవి నుండి తప్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆదేశించినట్టు తెలిసింది. రేపు ఉదయం లోపు శంకర్ రావు రాజీనామా సమర్పించకపోతే రాష్ట్ర గవర్నర్ ను ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా కలసి భర్తరప్ చేయమని కోరనున్నట్టు సమాచారం. శంకర్ రావు చేసిన ఆరోపణలను సుమోట గా తీసుకున్న రాష్ట్ర హైకోర్ట్ సి. బి. ఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎమ్మార్ , జగన్ అక్రమ కేసుల విచారణలు కూడా శంకర్ రావు హై కోర్ట్ కు వ్రాసిన లేఖల ఆధారంగా చేప్పట్టిన విషయం విదితమే. అందరికి ముచ్చెమటలు పట్టించే శంకర్ రావు ఇక ఏం చేస్తారో చూడాలి మరి .


రాజీనామా చేసిన తెలంగాణా టి.డి.పి ఎం. ఎల్. ఎ లు


తెలంగాణా ఉద్యమం రసకందాయంలో పడింది. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో తెలుగుదేశం పాత్ర లేకుండా జాయింట్ ఆక్షన్ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు . అయితే టి.ఆర్.ఎస్. తెరవెనుక ముఖ్యపాత్ర పోషిస్తోంది . గత16  రోజులుగా సాగుతున్న ఉద్యమంలో నేడు తెలుగు దేశం ఎం. ఎల్. ఎ లు తమ పదవులకు రాజీనామా చేసి టి.ఆర్ .ఎస్ ను, కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగాలని ప్రయత్నిచారు. చిత్తశుద్ది వుంటే అందరూ రాజీనామా చేయాలనీ చెప్పే టి. ఆర్.ఎస్. తెలుగు దేశం ఇచ్చిన షాక్ నుండి తేరుకోక పోగా ఎదురుదారి చేసి రాళ్ళతో దాడి చేయించడం శోచనీయం .

Wednesday 28 September 2011

రాష్ట్ర విభజనకే కేంద్ర మొగ్గు ..


రాష్ట్ర విభజన సమస్య శాశ్వతంగా పరిష్కారానికి కేంద్రం ముందుకు పోతునట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చేసి తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలుగా విభజించి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని, కొంత కాలం హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా వుంచి రెండు ప్రాంతాలకు రెండు రాజధానులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు . తెలంగాణా రాష్ట్రంలోకి రాయలసీమ నుండి అనంతపురం, కర్నూల్ జిల్లాలను కలుపాలని ఆలోచనగా వున్నట్టు కే. సి. ఆర్ కూడా ప్రకటించినారు. అయితే ఇందుకు టి. ఆర్ .ఎస్ ఒప్పుకున్తుందా అన్నది తెలియడం లేదు. హైదరాబాద్ లేకుండా తెలంగాణా రాష్ట్రము తలలేని మోడెం అవుతుందని టి. ఆర్. ఎస్ నాయకులు చాల సందర్భాలలో అన్నారు. అయితే రాయలసీమను రెండు ముక్కలు చేయడం వాళ్ళ
రాయలసీమ పరిస్తితి మరింత దారుణంగా తయారవుతుందని చెప్పవచ్చు.  మరో రెండు రోజుల్లో నివేదికను ఇవ్వన్నున ఆజాద్ కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం కు ఏమి నివేదిక ఇస్స్తారో చూడాలి

మౌనంగా వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ నేతలు

వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పై సి.బి. ఐ విచారణకు రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ కుట్ర గా విరుచుకు పడిన వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కోకరే మౌనం పాటిస్తున్నారు. అంటే గాక సి.బి. ఐ ఛార్జ్  షీట్ లో వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చడంపై ఏం.ఎల్. ఎ పదవులకు రాజీనామాలు చేసిన వారూ మిన్నకుండి పోతున్నట్టు తెలుస్తోంది. జగన్ ఢిల్లీ పర్యటన తరువాత కాంగ్రెస్ నాయకులపై విమర్శలు తగ్గిచిన విషయం గమనించి రాజకీయాలలో ఏదైనా అనుకోని మార్పులు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఒక వేల తెలంగాణా రాష్ట్రము ఏర్పడితే సీమంద్రలో జగన్ అవసరం కాంగ్రెస్ కు ఉందనే అంటున్నారు . ఉభయతారకంగా ప్రస్తుతం సి.బి. ఐ కేసు మందకొడిగా సాగుతోందని ఆరోపణలు వస్స్తున్న విషయం తెలిసిందే.  ఇది ఇలా వుండగా వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ నేతలు ఏమిచేయాలో పలు పోక మౌనం ఆశ్రయిస్తున్నారు.

Tuesday 27 September 2011

సుమోటగా సబితా పై హైకోర్ట్ విచారణ ...

 

రాష్ట్ర మంత్రుల
మధ్య పోరు





రాష్ట్ర చరిత్రలోనే ప్రధమంగా ఓ హోం మంత్రిపై హైకోర్ట్ సుమోటాగా స్వీకరించి  సి.బి.ఐ. విచారణ కు ఆదేశాలు ఇచ్చింది .సబితా ఇంద్ర రెడ్డి , రాష్ట్ర మంత్రి మోపిదేవి పై  రాష్ట్ర జౌళి శాఖ మంత్రి శంకర్ రావు తీవ్రమైన ఆరోపణలు చేశారు . హోం మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని , ఆమె కుమారుడు ఏకంగా దుకాణం పెట్టాడని ఆరోపించారు. పోలీసు నియామకాలపై కూడా అవినీతి వున్నట్టు ఆరోపణలు చేశారు . ఈ ఆరోపణలు సుమోట గా కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయాలని మంగళవారం  హైకోర్ట్ ఆదేశించింది.

రాష్ట్ర మంత్రులపై అదే రాష్ట్ర ప్రభుత్వంలో వున్నా మరో మంత్రి ఆరోపణలు చేయడం దానిపై హైకోర్ట్ స్పందించడం విశేషం. శంకర్ రావు ఇంతకు మునుపు జగన్ పై హైకోర్ట్ కు లెటర్ వ్రాస్తే దాని ఆధారంగానే హైకోర్ట్ సి.బి.ఐ   వి చారణకు ఆదేశించడం తెలిసిందే . శంకర రావు అంటేనే రాజకీయ నాయకులు భయపడుతున్నారు . ఆయన ఏకంగా సి. ఎం. పై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా వుండగా గతంలో అనంతపురం సూరి హత్యకేసులో నిన్డుతుడైన భానుకు సభిత పిల్లలే ఆశ్రయం ఇచ్చరాని కూడా వార్తలు వచ్చాయి . మొత్తానికి సబితా పిల్లల వల్ల కేసులో ఇరుక్కున మాట నిజమేనంటున్నారు .

 

Monday 26 September 2011

అందరికి చెబుతాడు తాను చేయడు ...

రాజీనామా పై కోందండరామ్ ద్వందనీతి

తెలంగాణా పొలిటికల్ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ తెలంగాణా ఉద్యమ నాయకుడుగా తెరపైకి వచ్చి కేవలం టి. ఆర్ .ఎస్. అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు . ఏం. ఎల్. ఏలు , ఏం.పి లు , మంత్రులు తెలంగాణా కోసం రాజీనామా చేయమన్న కోందండ రామ్ తానూ మాత్రం ఇంకా ప్రొఫెసర్ గా ఉద్యోగంలో కొనసాగుతుండడం విశేషం . దేశ చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపడం చూస్తే నైతికత లేదనిపిస్తోంది . ప్రభుత్వం కూడా ఏమి చేయలేక చూస్తూ వుంది. ఇప్పటికైనా కోదండ రామ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకొని తెలంగాణా కోసం పని చేయాలనీ రాజకీర వర్గాలు అంటున్నాయి.

తెలంగాణా ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు ఏమిటి ?

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం చిత్తశుద్ధిగా ఎవ్వరూ ప్రయత్నం చెయ్యట్లేదు . దా దాపు అన్ని పార్టీలు అఖిలపక్షంలో అనుకూలంగానే మాట్లాడాయి. కేంద్ర ప్రభుత్వం తరపున చిదంబరం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించగా రాజకీయ పార్టీల అసలు రంగు బయటపడింది. అప్పటికప్పుడు సీమాంద్ర లో పెల్లుబికిన సమైకాంధ్ర ఉద్యమం ఇంతవరకు దేశ చరిత్రలో ఎన్నడూ జరుగలేదు. తెలంగాణా పై శ్రీ కృష్ణ కమిటీని వేసి ఆ నిరసనకు తెరదించిన వెంటనే తెలంగాణలో కూడా నిరసనలు వెలువెత్తాయి.
బి .జే. పి కేంద్రలో అధికారంలో వుండగా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానాల ప్రకారం విభజన జరిగిపోయింది. అయితే ఇక్కడ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు మాత్రం ముందుకు సాగడం లేదు. కారణాలు అన్వేషిస్తే మనకు కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తున్నాయి. 

తెలంగాణా ప్రత్యేకంగా కావాలని ప్రజలకు ఎప్పటినుండే  వున్నా వారు సర్దుకుపోతూ వచ్చారు. కోస్త, రాయలసీమ ప్రాంతాల వారితో ఎప్పుడూ విభేదాలు లేవు. అయితే తెలంగాణా సమస్యను ఎప్పుడైతే రాజకీయ పార్టిలు తమ అజెండాగా మార్చుకోన్నాయో అప్పటినుండి ఈ ఉద్యమం వక్ర మార్గం పట్టిందని చెప్పాలి. ఎన్నికలలో ఓట్ల కోసం తెలంగాణా కోసం మాట్లాడటం గెలిచిన తరువాత పట్టించుకున్న పాపాన పోవడం టి. ఆర్. ఎస్ తో పాటు అన్ని పార్టి లు చేశాయి. టి. ఆర్ .ఎస్ అయితే అవసరం వున్నా లేకున్నా రాజీనామాలు చేయడం , మళ్ళి గెలిచి తమ బలాన్ని చాటడం చేసింది. దానికి  సెంటిమెంట్  అనే పేరు పెట్టి పబ్బం గడుపుకుంది . ఒక సారి రాజీనామా చేసిన సీట్లలో కొన్నింట ఓడి పోయి  తన ప్రభావం కోల్పోయే దశకు చేరింది. ఇక్కడే కే. సి. ఆర్ . మళ్ళి తన బుర్ర కు పదును పెట్టి నిరాహార దేక్షకు కూర్చుని అగ్గి రాజేసాడు. దాంతో అన్ని పార్టిలు అనుకూలంగా చెప్పినా  సీమాంద్ర వ్యతిరేకత చూసి రెండు నాల్కల, రెండు కళ్ళ సిద్దాంతాలను తెరపైకి తీసుకు వచ్చి ప్రజల మధ్య పెద్ద చీలికకు కారణమవుతున్నాయి. 

తెలంగాణా ఇచ్చినా తమకు ఏమిటి లాభం అని కాంగ్రెస్, టి.డి.పి. లు ఆలోచిస్తున్నాయి. రాష్ట్రంలో మారిన పరిస్తితులలో విభజన అనేది ఇంకా వైషమ్యాలను పెంచుతుందే గాని తుంచదు. పాకిస్తాన్ విడిపోతే సమస్య పరిష్కారం కాలేదు సరి కదా పెరిగింది . ఒక రాష్ట్ర విభజన జరిగినా రెండు ప్రాంతాల ఏకాభిప్రాయం తీసుకొని ఎలాంటి స్వంత పేరు, పట్టు , భేషజాలకు పోకుండా చేయవలసిన అవసరం వుంది. ముందుగా రాజకీయ పార్టి లు వారి పార్టీలో ఒక అభిప్రాయానికి కృషి చేయాలి. ఒక నిర్దిష్ట సమయంలో అటో ఇటో తెలిస్తే అందరు ప్రజలు సంతోస పడుతారు. ప్రజలు రాజకీయ పార్టీ ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారకుండా సామరశ్యంగా సమస్య పరిష్కారం చేసుకోవలసిన అవసరం వుంది.

Sunday 25 September 2011

నెలాఖరులో జగన్ అరెస్ట్ వుంటుందా ?


 
అవినీతి , అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది. గత నెల రోజులుగా సి.బి.ఐ చేస్తున్న విచారణ ఒక కొలిక్కి రావడంతో పాటు, గాలి జనార్ధన్ రెడ్డి కేసులో కూడా సి.బి. ఐ కి కొంత తెరిపి వచ్చినట్టు భావిస్తున్నారు . ఈ నేలఖరులోపుగా జగన్ ఓదార్పు యాత్ర ముగింపు అయ్యాక ఈ అరెస్ట్ జరగనున్నట్టు భోగట్ట . ఏది ఏమైనా ఇటీవల జగన్ కేసు విచారణ మండగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తెలుగు దేశం ఈ అంశంపై నేరుగా జగన్ కాంగ్రెస్ కు సరెందర్ అయ్యాడని ఆరోపించింది . కాంగ్రెస్ వర్గాలు అయితే కాంగ్రెస్ సభలలో జగన్ అవినీతి పై ముఖ్యం గా బొత్స , కిరణ్ , చిరంజీవి టార్గెట్ చేయడం పట్ల రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది.  జగన్ ను సి. బి. ఐ అరెస్ట్ చేయడం చేయక పోవడం ఇంకో వారం రోజులలో తేలనుంది .

Friday 23 September 2011

జగన్ కేసు నీరు కారుస్తున్నారా?


జగన్ అవినీతి పై కోర్టు ఆదేశాల మేరకే విచారణ చెప్పట్టినట్టు చెబుతూ వచ్చిన సి.బి. ఐ . ప్రస్తుతం నెమ్మదిగా విచారణ సాగిస్తోంది. ఆరంభంలో ఏంటో స్పీడ్ కనబరిచినా జగన్ ఢిల్లీ పర్యటన తరువాత విచారణ పై ఒత్తిడి వచ్చినట్టు అంటున్నారు. ప్రధాని ఏమైనా హామీ ఇచ్చారేమో , జగన్ కాంగ్రెస్ పార్టీ కి లొంగి పోయదేమోనని అంటున్నారు . అదే జరిగివుంటుందని 45  రోజులలో  వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేస్తారని తెలుగు దేశం ప్రచారం చేస్తోంది . గతంలో ప్రజారాజ్యం పార్టీ గురించి ఇదే విధంగా తెలుగు దేశం చెప్పింది. అయితే ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు తెలుగు దేశం చెప్పినట్టే ప్రజారాజ్యం వీలీనం జరిగిపోయింది. జగన్ ఏర్పాటు చేస్తుకున్న  వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేస్తారని అంటున్నారు .ఏది ఏమైనా గాలి కేసు లో సి.బి. ఐ. చాలా బిజీ గా వుంది. జగన్ కేసుకు కాస్త తెరిపి నిచ్చిన సి.బి.ఐ తన పని తానూ చేస్తుందేమో చూద్దాం.

Thursday 22 September 2011

రూపాయికి కిలో బియ్యం ...మిగిలినవి మాత్రం ..?


నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఎం. టి. ఆర్ ప్రకటించిన కిలో రెండు రూపాయల బియ్యం కాల క్రమంలో చంద్ర బాబు హాయంలో ధరలు పెంచి కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో
2009 ఎన్నికలకు ముందుగా తిరిగి కిలో రెండు రూపాయల బియ్యం ప్రకటించి ఎన్నికలలో లబ్ది పాడాలని ప్రయత్నించి సపలం అయ్యారు. ప్రస్తుతం టీ 5 రూపాయల పైన అమ్ముతున్న తరుణంలో బియ్యం మాత్రం కిలో రూపాయికి ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాజకీయంగా తనదైన ముద్ర వుండాలని , రాజశేఖర్ రెడ్డి ని ప్రజలు మరిచి పోయే విధంగా చేయాలని ప్రయతం లా వుంది. నిరు పేదల పేరుతొ ఓట్లు కొల్లగొట్టాలని , పదవులు కాపాడుకోవాలని కాకుండా చిత్తసుద్ధి లేని పథకాలు ఎక్కువ కాలం కాల పరీక్షకు నిలబడవు కదా !

Wednesday 21 September 2011

పార్టీ మారినా జై సమైఖ్యంద్ర అంటున్న చిరు


ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తూ సామాజిక తెలంగాణా తన వాణి అని అందరిని విశేషంగా ఆకర్షించిన చిరంజీవి , చిదంబరం ప్రకటన తరువాత అప్పటి ప్రజారాజ్యం పార్టీది సమాఖ్య వాదమని, సమాఖ్య ఆంధ్ర కే మొగ్గు చూపుతున్నట్టు విస్పస్తంగా పేర్కొనడం తెలిసిందే. తెలంగాణాలో ఎంత వ్యతిరేకత వచ్చినా తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీలీనం చేయడంతో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అందరికి ఆసక్తి రేగింది. యింతే తిరుపతి లో ఈ రోజు జరిగిన సభలో పత్రికల వారితో మాట్లాడుతూ తానూ సమైక్య ఆంధ్ర కోరుకుంటున్నట్టు తెలిపారు. సకల జనుల సమ్మెతో తెలంగాణా ఉద్యమం ఉదృతంగా వున్నా సమయంలో ఈ మాట చెప్పడంతో చిరుకు కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం తెలిసి వున్నట్టు అంటున్నారు.


Tuesday 20 September 2011

మరోసారి నిరాహార దేక్షకు దిగనున్న కే. సి. ఆర్ .





తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు  కే. సి. ఆర్ . మరో సారి నిరాహార దీక్షకు కూర్చోవాలని తలుస్తున్నారు. 2009 లో నిరహరదేక్షకు ఆయన కూర్చున్నప్పటినుండి తెలంగాణా ఉద్యమం ఉద్రుతమై కేంద్ర ప్రభుత్వం 9th డిసెంబర్ చిదంబరం చేత చేయించి తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు ప్రకటన చేయించి దీక్ష విరమించ చేయగలిగింది. ఆ తరువాత రోజు నుంచి సీమాంద్ర ప్రాంతంలో రాత్రికి రాత్రికి ఉవ్వేతున్న లేచిన నిరసనలకు భయపడి 23 డిసెంబర్ నాడు చిదంబరం శ్రీ కృష్ణ కంమిట్టీ ఏర్పాటు చేస్తున్నట్టు మరో ప్రకటన చేయవలసి వచ్చింది . ఆనాటి నుండి తెలంగాణపై రాష్ట్రము మొత్తం పర్యటించిన శ్రీ కృష్ణ కమిటి చివరికి ఆరు మార్గాలను సూచించి ప్రస్తుతం వున్నా సమైకంద్రనే ఉత్తమమని నివేదిక ఇవ్వడం జరిగింది . అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ నివేదికపై ఏ నిర్ణయం ప్రకటించలేదు. తెలంగాణా పై కేంద్ర సాచివేత ధోరణి వాళ్ళ రాష్ట్రములో ఉద్యమం తారాస్తాయి కి చేరి సకల జనుల సమ్మె గా రూపుమార్చుకుంది.

ఇదిలా వుండగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వాటి విధాన నిర్ణయాని చెప్పలేకపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు రెండు ప్రాంతాలలోను ఉద్యమాలలో పాల్గొంటున్నాయి. ఈ పరిస్తితులలో కే. సి. ఆర్. నిరాహార డిక్ష ప్రారంభిస్తే  అది ఇంకా సమస్యగా మరే అవకాసం వుంది. అయితే ఈసారి నిరాహార దేక్షను అడ్డుకొని రాష్ట్రా ప్రభుత్వం ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నించవచ్చు . ఒకసారి తొందరపడిన ప్రభుత్వం ఈసారైనా రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.


Monday 19 September 2011

రేణుక తెలంగాణా వ్యతిరేకా?


సకల జనుల సమ్మె జయప్రదం కావడం లేదని కాంగ్రెస్ నాయకురాయలైన ఖమ్మం మాజీ యం.పి . రేణుక చౌదరి  వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లలో , ముఖ్యంగా తెలంగాణా కోరుకుంటున్న వారికి మింగుడు పడలేదు. తెలుగు దేశం పార్టీ లో వున్నప్పుడు ఒకే మగాడుగా రామారావు చే గుర్తింపు పొంది అనంతరం కాంగ్రెస్ లోనూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె తెలంగాణాకు వ్యతిరేకంగా వుందని ప్రచారం జరుగుతోంది. అయితే సకల జనుల సమ్మె వాళ్ళ ప్రజలకు సమస్యలు తప్ప తెలంగాణా రాదనీ ప్రచారం మొదలైంది . ఏదిఏమైనా తన అభిప్రాయాన్ని కుండ బాధలు కొట్టినట్టు చెప్పే రేణుకలా అందరూ సొంతంగా అలోచించి మాట్లాడాలి అంతే కాని కొండదరామ్ చెప్పినట్టు ఆడితే అర్థం లేదు.  ఖమ్మం జిల్లా లో పట్టు ఉన్న నాయకురాలు ఇలా వ్యాఖ్యానించడం వెనుక అధిష్టానం చేయి ఉందేమో చూడాలి.


Sunday 18 September 2011

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా ? లేన్నట్టా ?


రాష్ట్రంలో గత కొంత కాలంగా ప్రభుత్వం వుందా లేదా అనే సందేహం కలుగుతోంది . తెలంగాణా విభజన సమస్యపై సకల జనులు చేప్పట్టిన సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ రాబడి బాగా తగ్గింది. సమ్మె సమయంలో సరైన విధంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో అధిక శాతం ఉద్యోగులు సమ్మె లో పాల్గొంటున్నారు. ఈ సమస్య వాళ్ళ సామాన్యులకు మరింత భారం అవుతోంది.  రాష్ట్రంలో రాబోయే కాలంలో ధరలు మరింత పెరుగడం తప్పని సరిగా కనిపిస్తోంది.  


Friday 16 September 2011

లక్ష్మి పార్వతి ఏ పార్టీలో వున్నట్టు ?


నందమూరి లక్ష్మి పార్వతి ప్రస్తుతం ఏ పార్టీలో వుందో ఎవరికీ అర్థం కావడం లేదు . ఆమె స్వయంగా తెలుగుదేశం పార్టీ లో ఏర్పడిన సంక్షోభం తరువాత రామారావు బతికి ఉన్నప్పుడే ఏర్పడిన ఎం. టి . ఆర్ తెలుగు దేశం పార్టీ ఏర్పడింది . మహా నాయకుడు ఎం.టి. ఆర్ మరణాంతరం అదే పార్టీ ఏనుగు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయింది . అయితే ఇటీవల కొంత కాలం రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు కాంగ్రెస్ కు మద్ధుతుగా వున్నా ఆమె ఇప్పుడు జగన్ ఏర్పాటు చేసిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్నారు . మరి ఆమె ఏ పార్టీ లూ వున్నారు . ఆమె స్వయంగా అధ్యక్షురాలిగా వున్నా పార్టీ ఏమైనట్టు. ? ఓ కార్యక్రమం లేకుండా పోయి అమీ ఏమి చేస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

అంబటి లీలలతో తలపట్టుకున్న జగన్ !

అంబటి లీలలతో తలపట్టుకున్న జగన్

ఇన్నాళ్ళు వై. ఎస్. ఆర్ . కాంగ్రెస్ పార్టీ కి అధికార ప్రతినిధిగా వున్నా అంబటి రాంబాబు రాసలీలలు వెలుగు చూడడంతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తల దించుకునే పరిస్తితి ఏర్పడింది . వెంటనే ఈ విషయమై ఎలాంటి ప్రకటనలు చేయకుండా నష్ట నివారణ పనులు చేయాలని ఎ. బి. ఎం ఛానల్ పై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది . మా దగ్గర ఆధారాలు వున్నాయని కావాలంటే నిరూపిస్తామంటుంటే సరిగ్గా సమాధానం చెప్పే వారె కరువయ్యారు . ఇంతకాలం తన వాగ్ధాటితో ఎదుటివారిని విమర్శించే అంబటి తన విషయాన్ని అంత బలంగా ఎదుర్కోలేక జగన్ కు తల నొప్పిగా మారిపోయాడు. పార్టీ లో అప్పుడే అతన్ని బయటకు పంపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు . ఈ సమస్యను జగన్ ఎ విధంగా పరిష్కరించుకుంటారో చూడాలి.
ఎదిఎమైనా పార్టీ లో మహిళల పరిస్తితి అంత బాగోలేడనే ప్రచారం ఊపందుకుంది అని చెప్పవచ్చు.


విజయసాయి రెడ్డి కి భయం ఎవరి నుండి వుంది ?

జగతి పబ్లికేషన్ వైస్ - చైర్మన్ విజయ సాయిరెడ్డి తనకు ప్రాణ హాని వుందని పోలీసులకు పిర్యాదు చేశాడు . ముఖ్యంగా తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకుల నుండి బెదిరింపులు వస్తున్నట్టు అంటున్నారు . ఇంతకీ సి.బి. ఐ ఆఫీసు కు రోజూ వెళుతున్న విచారణ పూర్తి కాలేదు. ఒక వేళ నిజంగానే ఆయన ప్రాణానికి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ లు హాని కల్పించి ఆ నెపం జగన్ పై పెడుతారంటే నమ్మగలమా ? . ఇదివరకు పరిటాల హత్య కేసులో ప్రధాన ముద్దాయి మొద్దు శీనును జైలులో చంపింది ఎవ్వరో ? నిజాలను కప్పి పుచ్చాలని ఎవ్వరో ఆయనతో ఇలా పలికించి వుంటారు . విజయ సాయి రెడ్డి ఇకనైనా నిజాలు చెప్పి సి. బి. ఐ కి సహకరించి అవినీతి అక్రమాల వివరాలు అందించ వచ్చు. అందులో భాగంగా ఆయన ప్రాణానికి హాని లేకుండా వుండాలని ఎత్తుగడ కావ్వొచ్చు. మొత్తానికి రోజూ సి.బి. ఐ ఆఫీసు మెట్లు ఎక్కుతున్న విజయ సాయి రెడ్డి పై కేసు వివరాలు ఆధారపడి వుందని చెప్పా వచ్చు.

Thursday 15 September 2011

అడ్డంగా దొరికిన అంబటి రాసలీల


వై. ఎస్. ఆర్ . పార్టీ లో కీలక భాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబటి రాసలీల భాగోతాన్ని ఎ. బి. ఎన్. , ఆంధ్ర జ్యోతి ఛానల్ అడ్డంగా దొరకపుచ్చుకొని ఎండగట్టింది.  రాజకీయాలలో ఉంటూ పబ్లిక్ లైఫ్ లో వున్నా వాళ్ళు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయాలను కంపు చేస్తున్నారు . ఎవరు దొరికితే వారిపై రెచ్చిపోయే అంబటి రాంబాబు మహిళలను లైంగికంగా వేధించడం క్షమించరాని నేరం . గవర్నర్ గా తివారి వెలగబెట్టిన రాసలీలలను బయటపెట్టి సాహసం చేసిన ఎ. బి. ఎన్ ఈ సారి అంబటి రాంబాబు రాసలీలను బయటి ప్రపంచానికి తెలిపి భలే మంచి పనిచేసింది. మరి జగన్ అంబటి రాంబాబు ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారో ..కట్టు కథలల్లి కాంగ్రెస్  , తెలుగు దేశం కుట్రలో ఓ భాగం అంటారో చూడాలి మరి . కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో ఇలాంటి నాయకులకు చోటులేకుండా ఆ దేవుడు చూడాలి .

జగన్ కు గాలి అవినీతి సెగ ...

మూలుతున్న నక్కపై తాటిపండు పడినట్లుంది జగన్ పరిస్తితి . సన్నిహితుడైన గాలిని సి .బి .ఐ అరెస్ట్ చేసిన తరువాత జగన్ మాట తీరులో కొట్టొచ్చిన మార్పు చూసి సొంత పార్టీ  వాళ్ళే నమ్మలేక పోయారు. గాలి సమర్దిచలేక , అనినీతి పై మాట్లాడ లేక జగన్ సతమతమావుతున్నాడు.  అవినీతి గురించి జగన్ కేసు సి.బి.ఐ విచారణ మొదలైన తరువాత జరిగిన అనివార్య పరిస్తితులు జగన్ కు ప్రతికూలంగా మారినాయని చెప్పవచ్చు.  అన్న ఆజారే నిరాహార దీక్ష , హైకోర్ట్ , సుప్రీం కోర్టులలో చుక్కెదురు ఆయనను ఇబ్బందుల పాలు చేసినాయి. రాష్ట్రంలో అయితే ఈ అవకాశాన్ని చంద్ర బాబు ఉపయోగించుకొని కొన్ని జిల్లాలు తిరిగి అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసి హడావుడి చేశారు . సి.బి. ఐ తనను అరెస్ట్ చేస్తారనే పుక్కార్లు వున్నా నిబ్బరంగా వున్నా జగన్ గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ తో ఇక తన వంతెనేమో అన్నంత భయపడి పోయిన్నట్టు అయింది . విలేకరులతో ఎన్నడూ లేనంత అసహనం , విసుగు కనిపించింది . ఢిల్లీ టూర్ కూడా ఆశించిన పలితాలు అందివ్వలేక పోవడంతో జగన్ నిరాశకు గుర్రైనట్టు తెలుస్తోంది . ఏది ఏమైనా ఈ నెల చివర్లో జగన్ అరెస్ట్ తప్పేటట్టు లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Wednesday 14 September 2011

తిరుపతి కి చిరు ఏమి చేశారు ..?


తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని అంగరంగ వైభవంగా ప్రారంభిచిన చిరు అక్కడి  ప్రజల ద్వారా శాసన సభ్యుడుగా ఎన్నికైనా ఇంతవరకు తిరుపతి చేసింది ఏమి లేదని స్థానికులు వాపోతున్నారు . తిరుపతి ఆద్యాత్మిక నగరం అయితే తిరుపతి సమస్యలపై కనీసం ద్రుష్టి పెట్టలేని చిరంజీవిని చూసి జనం ఎం ల్ ఏ గా మర్చిపోయారని ప్రతిపక్షాలు అంటున్నాయి . ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసి తానూ మాత్రం పదవుల కోసం , పార్టీ అండతో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు . ఇదే విధంగా అయితే వచ్చే ఎన్నికలలో తిరుపతి నుండి చిరు ఎన్నిక కావడం డౌటే మరి.