Tuesday 15 November 2011

రాటుదేలిన రాజకీయ చాణిక్యం

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలలో వూహ్య, ప్రతి వూహ్యలతో రాజకీయం రాటుదేలిపోయింది. స్వపక్షంలో ఉంటూ విమర్శలు చేయడం .. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడడం అనే కొంత కోణాలు ఎన్నడూ లేనిది చూస్తున్నాము. స్థూలంగా రాష్ట్ర రాజకీయాల పరిస్థితిని వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి మరణం కు ముందు ,ఆ తరువాత రెండు రకాలుగా విభాజిచుకుని పరిశీలించవలసి వుంది. వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు కాంగ్రెస్ పార్టి బలం అసెంబ్లీ లో తగ్గిన ఏ మాత్రం నిర్ణయాల స్పీడు తగ్గలేదు. రాజశేఖర్ రెడ్డి ఒనె మాన్ షో తో అంత ప్రశాంతత కనిపించింది. గుప్తంగా దాగున్న తెలంగాణా సమస్య వుండినా ఆయన తగిన రీతిలో వాటిని కంట్రోల్ చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంగా వుండిన తెలుగుదేశం వై. ఎస్. ఆర్ పై పోరును చేస్తూ కాలం గడుపుతూ వచ్చేది. టి.ఆర్. ఎస్. ఉప ఎన్నికలలలో పోటీ చేసి వున్నా సీట్లు కూడా పోగొట్టుకున్న పరిస్తితి వుండేది. ఎప్పుడైతే వై. ఎస్. ఆర్  మృతి చెందారో అంత వరకు తొక్కిపట్టిన సమస్యలు తెరపైకి వచ్చి వీర విజ్రుమ్బాన చేస్తున్నాయి. అందులో నాయకత్వ సమస్య .. కాంగ్రెస్ పార్టి ముఖ్యమంత్రిగా ఇక అయిపోవచ్చు అని కలలు కన్నా జగన్ కు ఎం. ఎల్. ఏ. ల బలం వున్నా ఆదిస్థానం మొండిచేయి చూపి రోశయ్య ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీంతో పార్టీలో ఇమడలేక ఓదార్పు యాత్ర పేరుతొ తన ఉనికిని చాటుతూ జగన్ జనంలో తిరుగుతూ కాంగ్రెస్ కంట్లో నలుసుగా మారాడు. అయినా కాంగ్రెస్ ఎతులకు పై ఎతులు వేసి జగన్ తనంతట తానే పార్టీని వదిలిపెట్టేలా చేసింది. దీంతో జగన్ కొత్తగా వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్ళు తన చెప్పు చేతలలో నడిపిన కుటుంబం నుండి పార్టి ని కాపాడుకోవలసిన స్తితిలో రాష్ట్ర కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్య మంత్రిని చేసి ముందుకు వెళుతోంది. ఏ నేపథ్యంలో అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టి ని ఏర్పాటు చేసారో అది మరిచి కాంగ్రెస్ పత్రిలో కలిసి పోయి జగన్ నుండి కాంగ్రెస్ కు రక్షణ కల్పిస్తున్నారు. దీంట్లో ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు వున్నా రాజకీయ భవిస్యత్తు కోసం ప్రానాలికలు వేసుకొంటున్నారు. అలాగే పి.సి.సి.చీప్ గా   ఎంపికైన బొత్స  ఒక దశలో ముఖ్య మంత్రి కిరణ్ ను కాదని ముందుకు పోవాలని ప్రయన్తించారు .  ఈ మధ్యలో ప్రతిపక్షంగా కీలకపాత్ర పోషించాలిసిన తెలుగుదేశం వెంటనే ఎన్నికలు వస్తే కష్టమని ప్రభుత్వాన్ని కాపాడుతోందని విమర్శలు మూటగట్టుకోన్నదని  చెప్పవచ్చు . చంద్ర బాబు నాయిడు రతుల కోసం నిరాహార దీక్ష , రైతు పోరుబాట  ఆయనకు కలసి వచ్చింది . అయితే జగన్  సి.బి. ఐ కేసులలో ఇర్రుక్కోవడం తెలుగుదేసంకు లాబించిన అంశంగా అనుకొనే అంతలోనే చంద్ర బాబు పై హై కోర్ట్ విచారణకు సి.బి. ఐ విచారణకు ఆదేశించడం తో ఈ పార్టి పరిస్తితి మొదటికి వచ్చింది . 
 
ఇక రెండో అశం తెలంగాణా కూడా కొలికి వచ్చినట్టే వచ్చి వెనక్కు పోతోంది. కే.సి.ఆర్ దీక్షతో దిగి వచ్చిన కేంద్ర తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నాటు ప్రకటించింది. యింతే సీమంద్రలో వచ్చిన వ్యతిరేకత కారణంగా తన నిర్ణయం మార్చుకొని జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది . ఆ కమిటీ నివేదిక సమైకంద్ర కు అనుకూలంగా రావడంతో మళ్ళే తెలంగాణా లో సకల జనుల సమ్మె జరిగి దాదాపు ప్రజా జీవితం స్తంబించేలా ఉద్యమాలు జరిగాయి. అయితే ఉన్నట్టుండి చప్పున చల్లారి పోయింది. దీనికి పోలవరం టెండర్లకు లింక్ వుందని తెలుగుదేశం ఆరోపించింది. కాంగ్రెస్ కోర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేక కింద పైనా పడుతూ వుంటే  ప్రధాని మన్మోహన్ తెలంగాణా ప్రస్తుత పరిస్తితులలో ఇవ్వడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టారు.
 
ఈ రెండు సమస్యలు కాంగ్రెస్ పార్టి పెంచి పోషిస్తోంది. భవిషత్తులో ఏమి జరుగుతోంది అని చెప్పలేకపోట్టునాము . అయితే ఈ రెండు సమస్యలే రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తాయని చెప్పవచ్చు .

No comments:

Post a Comment