Thursday 3 November 2011

పదవిపై చిగురిస్తున్న చిరంజీవి ఆశలు ...






ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసిన తరువాత  రాష్ట్ర స్థాయి ముఖ్య నేతగా గుర్తింపు సంపాదించుకుంటున్న తిరుపతి ఎం. ఎల్ . ఎ . చిరంజీవి కి పదవి లబిస్తుందనే ఆశలు మళ్లీ చిగురించాయి. తెలంగాణా సమస్య తగ్గు ముఖం పట్టడం, జగన్ కేసులలో ఉక్కిరి బిక్కిరి కావడంతో .. ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన మాటను ఆదిస్థానం నిలబెట్టుకుంటుందని ఆయన విధేయత ప్రకటిస్తున్నారు . చిరంజీవికి జన బలం వుందని నమ్ముతున్న కాంగ్రెస్ ఆదిస్థానం ఆయనకు మంచి పదవినే ఇవ్వనున్నట్టు తెలిసిది. అయితే చిరంజీవిని నమ్ముకొని కాంగ్రెస్ లో చేరిన వారికి మొండి చెయ్యే అని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టి పేరుతొ మార్పు ప్రజలకు అందలేదు కాని చిరంజీవికి మాత్రం ఉపయోగ పడుతోంది. రాష్ట్ర మంత్రిగా ఇచ్చిన చేస్తానని కూడా చిరంజీవి అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి లక్ష్యం చేరుకోవాలంటే రాష్ట్రంలో ఏదో ఒక పదవి అన్దాలిసిన అవసరం వుందని ఆయన అభిమానులు అంటున్నారు.

No comments:

Post a Comment