Thursday 3 November 2011

గాలి కేసులో జగన్ ను విచారించనున్న సి. బి.ఐ

అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన గాలి జనార్ధన రెడ్డి కేసు విచారణలో భాగంగా వై.ఎస్. ఆర్ పార్టి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ని సి.బి. ఐ. విచారించనుంది. రెడ్ గోల్డ్, ఆర్.ఆర్. గ్లోబల్ సంస్థల పెట్టుబడులు సాక్షిలో వున్నాయని , గాలి అక్రమ పెట్టుబడులు సాక్షిలోకి వచ్చాయా లేవా అని విచారించనున్నట్టు తెలిసింది. జగన్ ను ఈ నెల 4 వ తేది హైదరాబాద్ లోని కోటి సి.బి.ఐ. అపిస్ కు రావాలని ఆదేశాలు ఇచ్చింది.  అయితే రాజకీయ వర్గాల అభిప్రాయం మేరకు జగన్ ను గాలి కేసులో విచారణ నిమిత్తం సి.బి.ఐ తన ముందుకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే అక్రమ ఆస్తులు కలిగి వున్నా కేసులో విచారణ ఎదుర్కొటున్న జగన్ కు తాజా పరిణామాలు మింగుడు పడడం లేదు. జగన్ కేసులో విచారణ మందకొడిగా సాగుతోందని , జగన్ కాంగ్రెస్ తో కుమ్ముక్కు అయ్యారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సి.బి. ఐ. గట్టి నిర్ణయం తీసుకొండానే చెప్పాలి .

No comments:

Post a Comment