Tuesday 15 November 2011

ఎం. పి. ల రాజీనామలూ తిరస్కరణ


తెలంగాణా ఉద్యమంలో భాగంగా రాజీనామా సమర్పించిన రాష్ట్ర ఎం. పి. ల రాజీనామాలు తిరస్కరిస్తూ లోకసభ స్పీకర్ మీరా కుమారి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, టి. డి. పి. , తెలంగాణా రాష్ట్ర సమితి కి చెందిన ఎం.పి.లు మూకుమ్మడిగా సమర్పించిన రాజీనామాలు భావోద్రేకంతో చేసినందున తిరస్కరిస్తున్నట్టు తెలిపారు . ఈ నిర్ణయం వెలువడక ముందే తమ రాజీనామాలు ఆమోదించనందున తాము రాబోయే పార్లమెంట్ సమావేశాలకు హాజరై తెలంగాణా పై పోరాటం చేయనున్నట్టు టి. ఆర్. ఎస్ చెప్పడం కొసమెరుపు.  రాష్ట్ర రాజకీయాలలో రాజీనామాలు చేయడం అవి ఆమోదం పొందకపోవడం ఇటీవల సర్వ సాధారణ విషయం అయిపొయింది.  

No comments:

Post a Comment