Friday 11 November 2011

కాంగ్రెస్ గూటిలోనే జయసుధ ..జగన్ జలక్ ఇవ్వనున్న సహజనటి







వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి ద్వారా రాజకీయ జీవితం ప్రారంభిచిన సిని నటి జయసుధ ఇప్పుడు నిజజీవితంలో నటించలేక పోతున్నారు. వై. ఎస్ . రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆమె జగన్ వైపు నిలిచారు. జగన్ పెట్టిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ గా కొనసాగలేక తెలంగాణా ఉద్యమం పేరుతొ రాజీనామా చేసారు , జగన్ అవినీతి కేసుల్లో వై. ఎస్. ఆర్ పేరు చేర్చినందుకు నిరసన తెలిపారు కూడా. అయితే మారిన రాజకీయ పరిస్థితులలో జగన్ చుట్టూ సి. బి. ఐ. కేసుల ఉచ్చు బిగిస్తుండడంతో ఏమి చేయాలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. రంగా రెడ్డి  జిల్లాలో నిన్న జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆకాశానికి ఎత్తేసారు. వై. ఎస్. ఆర్. ఆరోగ్యశ్రీ పథకం తనను ఎంతగా ఆకర్శించిందో అంతగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ కిరణాలు పథకం ఆకర్షించిందని రచ్చబండ బహిరంగ సభలో పొగిడారు. చూస్తుంటే జగన్ కు జయసుధ జలక్ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల సమాచారం .

No comments:

Post a Comment