Wednesday 23 November 2011

చంద్ర బాబు బృందానికి ఊరట ..


వై. ఎస్ . విజయమ్మ వేసిన పిటిషన్ పై సి. బి. ఐ. విచారణకు హై కోర్ట్ ఆదేశించే ముందు సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని, తమ వాదనలు వినలేదని సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన చంద్ర బాబు బృందానికి ఊరట లబించింది. 15 రోజుల లోపు హై కోర్ట్ లో తమ వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కేసు పూర్వ పరాలు హై కోర్ట్ పరిధిలో ఉన్నందున అక్కడే వాదనలు వినిపించుకోవాలని స్పష్టం చేసింది. విచారణ పై స్టే ఇవ్వక పోయినా తమ వాదనలు వినిపించేందుకు కోర్ట్ సమ్మతించడం వల్ల చంద్ర బాబు బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ సరికే ఈ.డి చంద్ర బాబు కు కేసు విచారణకు సంభందించి వివరాలు అందజేయాలని నోటీసు కూడా అందచేసింది. రేపో మాపో సి.బి.ఐ విచారణకు రంగం సిద్ధం చేసుకొని వుంది.

No comments:

Post a Comment