కాంగ్రెస్ పార్టి నుండి జగన్ వేరుపడి కొత్తగా ఏర్పాటు చేసిన వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి తో జత కట్టి తిరుగుతున్న కాంగ్రెస్ ఎం.ఎల్. ఏ లు ఒక్కక్కరే తిరిగి స్వంత గూటికి చేరుకోవడానికి సమయం కోసం వేచి వున్నారు. జగన్ ఓదార్పు యాత్రల్లో పాల్గొని అధిష్టానం వద్దన్నా వీర విదేయత చూపిన వీరంతా మారిన రాజకీయ పరిస్తితులలో వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు సి.బి. ఐ. ఎఫ్. ఐ. ఆర్ లో చేర్చడం పై కినుక వహించి జగన్ ఆదేశాల మేరకు తమ ఎం. ఎల్. ఏ ల పదవులకు అలాగే కాంగ్రెస్ పార్టి సబ్యాత్వానికి రాజీనామాలు చేశారు . అయితే జగన్ పై సి. బి. ఐ విచారణలో కొత్త విషయాలు బయటపడడం , గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడి పరిస్తితి చూసి జగన్ జైలుకు వెళితే వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి భావిస్యతు తో పాటు తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని బావిస్తున్నారు. రాజీనామాలను విచారించడానికి స్పీకర్ పిలిస్తే వీరంతా రాజీనామాలను వెనక్కు తీసుకొనే అవకాసం కనబడుతోంది. ఇప్పుడున్న పరిస్తితులలలో రాజీనామాలు ఆమోదింప చేసుకొని ఎన్నికలలో నిలబడటం అంత మంచి నిర్ణయం కాదని అనుకుంటున్నట్టు భోగట్ట. జగన్ ఎం. ఎల్. ఏ లలో 90 శాతం జారిపోనున్నట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment