Monday 14 November 2011

చంద్ర బాబు పై సి.బి. ఐ ప్రాథమిక విచారణకు హైకోర్ట్ ఆదేశాలు



తెలుగుదేశం పార్టి అధ్యక్ష్యుడు నారా చంద్రబాబు నాయుడు  తో సహా మరో 13 మంది ఆస్తులపై  ప్రాథమిక విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్ట్ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వేసిన పిటీషన్ ను విచారించిన ధర్మాసనం మూడు నెలలలోపు ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించడం జరిగింది. ఇదివరకే జగన్ పై జరుగుతున్నా విచారణపై  అక్కసుతోనే వై.ఎస్.ఆర్ పార్టి వారు పిటీషన్ వేశారని తెలుగుదేశం వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తో పాటు సిని నటుడు మురళి మోహన్, సుజన చౌదరి, నామ నాగేశ్వర రావు  మరియు నారా చంద్ర బాబు కుటుంబ సభ్యులు ఈ కేసును ఎదుర్కోవలసి వుంటుంది. ఇప్పుడు చంద్రబాబు స్టే తెచ్చుకున్న చెడ్డ పేరు వస్తోంది. కాబట్టి తెలుగుదేశం పార్టి వారు సి. బి. ఐ. విచారణను స్వాగాతిస్తున్నట్టే మాట్లాడుతున్నారు. చంద్ర బాబు ఏదైనా అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలితే పూర్తి స్థాయి విచారణకు హై కోర్ట్ ఆదేశించే అవకాశం వుంది. అదే జరిగితే ఇప్పుడు జగన్ ను వెంటాడుతున్న కేసుల గొడవ చంద్ర బాబుకు తప్పవు. ప్రాథమిక విచారణలో నిర్దోషిగా తేలితే అదొక సర్టిఫికేట్ లా ఉపయోగపడి ఆయనకు రాజకీయంగా లాబించవచ్చు. సందిట్లో  సదేమియాగా కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది.

No comments:

Post a Comment