Friday 25 November 2011

అవిశ్వాస తీర్మానాన్ని ఆత్మ విశ్వాసంతోఎదుర్కోనున్న కిరణ్

 
 
 
 
 
కిరణ్ కుమార్ ప్రభుత్వం పై  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు తెలుగుదేశం ప్రకటించినా కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ఇదివరకు వున్నటు వంటి భయాలు ఏమిలేవనే చెప్పాలి. ఏడాది పూర్తి చేసుకున్న కిరణ్ కుమార్ ప్రభుత్వం మొదట్లో పురిటి కష్టాలు పది క్రమేపి నిలదొక్కుకున్నది.  ఈ సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలుగు దేశం చేస్తున్న మరో తప్పిదమే అవుతుంది. కిరణ్ ముఖ్య మంత్రిగా పదవి చేప్పటినప్పుడు తీవ్రంగా ఉందనుకున్న తెలంగాణా ఉద్యమం సకల జనుల సమ్మె తరువాత మునుపటి జోరు తగ్గిందనే చెప్పాలి . అలాగే ప్రభుత్వాని పడగోడుతామని తొడగోట్టిన జగన్ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఆత్మరక్షణలో పడిపోయారు. జగన్ ప్రక్క వెళ్ళిన ఎం. ఎల్ . ఏలు  ఊగిసలాటలో వున్నారు . వారు కాంగ్రెస్ కె మద్దతు ఇచ్చే అవకాసం  వుంది. ఈ సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ప్రభుత్వం పడిపోవడం మాట అటుంచి కిరణ్ సర్కార్ పూర్తి స్థాయి ప్రభుత్వంగా మారి ఆయనను బలపదేటట్టు చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరో ప్రక్క చంద్ర బాబు పై సి.బి. ఐ. విచారణ కూడా జరగబోతోంది. కిరణ్ కు కాలం కలసి వస్తోంది. ప్రజలలో మెల్లగా సి. ఎం. గా అంగీకరించే పరిస్తితి  ఏర్పదబోతోండానే చెప్పవచ్చు.

No comments:

Post a Comment