Thursday 3 November 2011

రైతు పోరుబాట గా చంద్రబాబు పాదయాత్ర




 
ఎక్కడ పోగొట్టుకున్నామో .. అక్కడే వెతకాలని సామెత . చంద్ర బాబు అదే చేస్తునారు. తెలుగు దేశం అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు బుధవారం అనంత పురం జిల్లా నుండి రైతు పోరుబాట పేరుతొ పాద యాత్ర మొదలు పెట్టారు.  దూరమైనా రైతులకు దగ్గరవుతూ పార్టి ప్రతిస్తా కోసం చేప్పటిన ఈ పాదయాత్ర  అప్పుడే అధికారపక్షం గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి . రైతుకు గిట్టు బాటు ధర తో పాటు వివిధ అంశాలపై గతంలోనే చంద్ర బాబు నిరాహార దీక్ష చేప్పట్టిన విషయం విదితమే. అయితే ఇటీవల వర్షాలు కురవక కొన్ని ప్రాంతాలలో, ఎక్కువ వర్షంతో పంటలు పడి కొన్ని ప్రాంతాలలో రైతులు రాష్ట్ర వ్యాపితంగా నష్టపోయారు. ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టి కి మొదటి నుండి అండగా వున్న అనంతపురం ను ఎంపిక చేసుకోవడం విశేషం . అనంతపురం  దేశంలోనే అత్యంత కరువు జిల్లాగా పేరుపొందింది. ఈ పాద యాత్రలో భాగంగా చంద్ర బాబు రోజుకి 15 కి.మీ దూరం నడుస్తునారు. ఈ విధంగా 20 రోజుల పాటు జరిగే సుదీర్గ యాత్ర రైతులలో ప్రభుత్వ వ్యతిరేక భావాలు పెంచవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

No comments:

Post a Comment