Thursday 10 November 2011

ఎట్టకేలకు తెలంగాణాలో విజయవంతంగా చంద్ర బాబు పాదయాత్ర


రైతులకోసం చంద్ర బాబు చేపట్టిన పాదయాత్ర ఎట్టకేలకు తెలంగాణలో కూడా విజయవంతం అవుతోంది. ఇప్పటికే ఆయన రాయలసీమలోని అనంతపురం , కర్నూలు, కడప జిల్లాలు , ప్రకాశం జిల్లాలోనూ విజయవంతంగా పాదయాత్ర పూర్తిచేసుకొని తెలంగాణలో అడుగుపెట్టారు. రైతులు కష్టాల్లో వున్నా ఈ సమయంలో చేపట్టిన పాదయాత్ర చంద్ర బాబుకు కలసి వస్తోంది. ఖమ్మం , నల్గొండ జిల్లాలో జరిగిన పాదయాత్రలో పార్టి కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొన్నారని, రైతులు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని పార్టి వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో ఇంతవరకు బాబు సభలకు అడ్డుపడే టి. ఆర్. ఎస్. ఈ సారి ఎందుకో అడ్డుపడడం లేదు.  ఇటీవల తెలంగాణా ఉద్యమ సెగలు బాబును ఉక్కిరిబిక్కిరి చేసాయి. అయినా ఆయన రెండుకళ్ళ సిద్ధాంతాన్ని టి.ఆర్.ఎస్ తో పాటు కాంగ్రెస్ వాళ్ళు తూర్పారబట్టారు. అయితే ఈ పర్యటనతో ప్రజలతో మమేకం కావడం , రైతులకు దగ్గర కావడంతో పాటు తెలంగాణలో కూడా తమ పార్టి కు పట్టు వుందని తెలుగుదేశం కేడెర్ నిరూపించుకున్నట్టే.

No comments:

Post a Comment