సకల జనుల సమ్మె తరువాత ఇంత వరకు ప్రశాంతంగా తెలంగాణాలో వ్యూహాత్మకంగా మళ్ళీ ఉద్యమ వేడి రాజుకుంటున్నది.
కాంగ్రెస్ యం.పి.లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పార్లమెంటు రాజ్యసభ లో కేశవరావు ద్వారా తమ వాణిని వినిపించారు కూడా. అధిష్టాన పై ఒత్తిడి తీసుకువచ్చి ఎలాగయినా తెలంగాణా సాధించే వరకు విశ్రమించరాదని భావిస్తున్నారు. అలా వీలు కాకపోతే టి.ఆర్.యస్ లో చేరడమో లేదా వేరే పార్టీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
శాసన సభలో టి.ఆర్.యస్ శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారో లేదో తెలంగాణా పై వెంటనే తమ వాణి బలంగా వినిపించారు. బి.జె.పి , తెలంగాణా తెలుగుదేశం శాసన సభ్యులు కూడా పోడియం ముట్టడించి సభ వాయిదా పడేట్లు చేశారు. దీనిని ముందే తెలంగాణా వరంగల్ కు చెందిన భోజ్యానాయక్, రాజమౌళి అనే విధ్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రభావం సమావేశాలపై బలంగా పడింది. వీరి అంతిమ యాత్రలో విధ్వంసం కూడా చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తన రాష్ట్ర విభాగానికి ఎలా నడుచుకోవాలో చెప్పేందుకు గాను పార్టీ యం.పిలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఉప ఎన్నికలలో టి.ఆర్.యస్ అభ్యర్టులు గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు తిరిగి ఉద్యమ ఉదృతికి కీలాశీల మవుతున్నారు. అయితే జె.ఎ.సి కోదండరామి రెడ్డికి టి. ఆర్.యస్ కు సంబంధాలు మహబూబ్ నగర్ ఓటమి విషయమై చెడినట్టు వార్తలు వచ్చినా ఉద్యమానికి అదేమి పెద్దగా అడ్డంకిగా మారడంలేదు. ఉద్యమ రూపం హింసాత్మకంగా మారకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.