ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి కావడంతో మన రాష్ట్రంలోని చాలా మంది యువరాజకీయ నాయకులలో కూడా ఆశలు రేకెత్తిసున్నాయి. ముఖ్యమైన నాయకులకు వారసులుగా భావిస్తున్నవారు ఈ దిశగా తాము పదవులలోకి రావడానికి అప్పుడే వ్యూహరచనలు చేపట్టినట్టు తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా తిరుపతి శ్రీ విద్యానికేతన్ లో జరిగిన తన జన్మదిన వేడుకులకు హాజరయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మోహన్ బాబు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తివేయడం, అదే విధంగా మోహన్ బాబు తనకు బంధువు మరియు మిత్రుడని రాజకీయాలలోకి వస్తే ఆహ్వానిస్తానని అనడంతో ఊహాగాహాలు చెలరేగాయి. అయితే వెంటనే తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్న చిరంజీవి రాజ్యసభకు వెలుతుండడంతో అ సీటుకు తెలుగుదేశం తరపున మోహన్ బాబు కూతురు లక్ష్మీ పేరు తెరపైకి రావడం కూడా విశేషమే. అంటే వృద్దతరం నాయకుల స్థానంలో వారి కొత్తతరం భాద్యతలు తీసుకోవడానికి సిద్దమవుతున్నట్టుగా కనిపిస్తోంది.అలాగే చిరంజీవి తన కుటుంబం తరపున ఆ సీటుకు ఎవరూ పోటీ పడడం లేదని ప్రకటించారు. అయితే అల్లు అరవింద్ , నాగబాబులు , ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన జగన్ వెంట యూత్ పడుతున్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి యువకిరణాలు పేరిట ఓ పథకాన్నే నిర్వహిస్తుంటే, చంద్రబాబు యువజన సదస్సులు, బైక్ రేస్ లు నిర్వహించి యూత్ లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ జీవితం పై ఆశలతో ఉన్నారు. అయితే బాబాయితోనే అతనికి పేచీ వస్తోంది. చంద్రబాబు కుమారుడు రాజకీయంగా ప్రయత్నిస్తున్నప్పటికి అంతగా పట్టు సాధించలేక
పోతున్నాడనే చెప్పాలి. రాబోయే రోజులలో మాత్రం 2014 ఎన్నికలకు యూత్ తీసుకునే నిర్ణయం పైననే ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పవచ్చు.
ఓ...మంచు లక్ష్మి పేరు బయటకి వస్తోందా! ఆమెకు సీటు దక్కితే సంతోషమే.
ReplyDeletesharath kannesharu manchu kurustundaa
ReplyDelete