దేనికయిన సమయం సందర్బం అవసరం. లేకుంటే అది ఆభాసుపాలవుతుంది. లేదా తిరగి తమకే తగులుతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కడప జిల్లాకు చెందిన మంత్రి డి.యల్ . రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడం ఆ కోవలోకే వస్తుందని చెప్పవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి మండలి విస్తరణలో రవీంద్రా రెడ్డికి చెందిన శాఖలో కోత కోయడంతో అప్పటి నుండి ఆయన కుత కుత లాడి పోతున్నారు. అంతకు మునుపు కడప లోకసభకు జరిగిన ఎన్నికలలో ఓడిపోయినప్పుడు రాజీనామా చేయని రవీంద్రా రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి కిరణ్ కుమార్ రెడ్డి పై అసంతృప్తికి ఆజ్యం పోయాలనుకున్నారు. అయితే ఆ యన తన రాజీనామాను ముఖ్య మంత్రికి పంపకుండా సోనియాకు పంపడంతో అది పేలని టపాసయింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. అయితే కిరణ్ వ్యవహార శైలిపై మాత్రం చాలామంది కినుక వహిస్తున్నారు. ఎవరూ నాయకత్వం వహించే పరిస్థితి లేని ఈ సమయంలో కిరణ్ కు అన్ని కలసి వస్తున్నాయి. చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది.
No comments:
Post a Comment