Monday 26 March 2012

రామ చంద్రయ్య నోట చిరు మాట


తిరుపతి శాసన సభ్యుడైన చిరంజీవికి రాజ్యసభ సీటు కేటాయించిన తరువాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. పి.ఆర్.పి పూర్తిగా విలీనం అయిపోయిన తరువాత ప్రభుత్వం లో తమకు అంతగా పట్టులేకపోవడంతో అంటే అందరూ కాంగ్రెస్ శాసన సభ్యులుగా మారడంతో వారు ఎటూ ప్రభుత్వానికే మద్ధతు ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ముప్పుకూడా ఏమీ లేదు. అయితే పి.ఆర్.పి విలీనం వల్ల చాలా మంది శాసన సభ్యులకు అటు కాంగ్రెస్ లోనూ ఇటు పి.ఆర్.పిలోనూ ఆశాభంగం కలిగింది. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా వ్యతిరేక భావన వచ్చింది. ఇప్పుడు చిరంజీవికి మంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు గాను మరియు ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావడం ఉద్దేశంతోనే చిరంజీవి రామచంద్రయ్య ద్వారా ఇలాంటి వాఖ్యలు చేయించడం గమనార్హం. రామచంద్రయ్య తిరుపతిలో ఈ వాఖ్యలు చేస్తున్నప్పుడు ఆ సమయంలో చిరంజీవి కూడా తిరుపతిలో ఉండడం విశేషం. అంతేగాకుండా తిరుపతిని వదలి పెట్టే విషయంలో కూడా చిరంజీవి రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. తాను ఎప్పటికీ తిరుపతితో సంబంధాలు కలిగి ఉంటానని అంటున్నారు. అయితే గత శానస సభ్యులతో ఎవరితో పోల్చినా తిరుపతికి చిరంజీవి చాలా తక్కువనే చెప్పాలి. ఈ సారి ఆ అసంతృప్తికి కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment