Friday 16 September 2011

విజయసాయి రెడ్డి కి భయం ఎవరి నుండి వుంది ?

జగతి పబ్లికేషన్ వైస్ - చైర్మన్ విజయ సాయిరెడ్డి తనకు ప్రాణ హాని వుందని పోలీసులకు పిర్యాదు చేశాడు . ముఖ్యంగా తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకుల నుండి బెదిరింపులు వస్తున్నట్టు అంటున్నారు . ఇంతకీ సి.బి. ఐ ఆఫీసు కు రోజూ వెళుతున్న విచారణ పూర్తి కాలేదు. ఒక వేళ నిజంగానే ఆయన ప్రాణానికి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ లు హాని కల్పించి ఆ నెపం జగన్ పై పెడుతారంటే నమ్మగలమా ? . ఇదివరకు పరిటాల హత్య కేసులో ప్రధాన ముద్దాయి మొద్దు శీనును జైలులో చంపింది ఎవ్వరో ? నిజాలను కప్పి పుచ్చాలని ఎవ్వరో ఆయనతో ఇలా పలికించి వుంటారు . విజయ సాయి రెడ్డి ఇకనైనా నిజాలు చెప్పి సి. బి. ఐ కి సహకరించి అవినీతి అక్రమాల వివరాలు అందించ వచ్చు. అందులో భాగంగా ఆయన ప్రాణానికి హాని లేకుండా వుండాలని ఎత్తుగడ కావ్వొచ్చు. మొత్తానికి రోజూ సి.బి. ఐ ఆఫీసు మెట్లు ఎక్కుతున్న విజయ సాయి రెడ్డి పై కేసు వివరాలు ఆధారపడి వుందని చెప్పా వచ్చు.

No comments:

Post a Comment