Tuesday 20 September 2011

మరోసారి నిరాహార దేక్షకు దిగనున్న కే. సి. ఆర్ .





తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు  కే. సి. ఆర్ . మరో సారి నిరాహార దీక్షకు కూర్చోవాలని తలుస్తున్నారు. 2009 లో నిరహరదేక్షకు ఆయన కూర్చున్నప్పటినుండి తెలంగాణా ఉద్యమం ఉద్రుతమై కేంద్ర ప్రభుత్వం 9th డిసెంబర్ చిదంబరం చేత చేయించి తెలంగాణా ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు ప్రకటన చేయించి దీక్ష విరమించ చేయగలిగింది. ఆ తరువాత రోజు నుంచి సీమాంద్ర ప్రాంతంలో రాత్రికి రాత్రికి ఉవ్వేతున్న లేచిన నిరసనలకు భయపడి 23 డిసెంబర్ నాడు చిదంబరం శ్రీ కృష్ణ కంమిట్టీ ఏర్పాటు చేస్తున్నట్టు మరో ప్రకటన చేయవలసి వచ్చింది . ఆనాటి నుండి తెలంగాణపై రాష్ట్రము మొత్తం పర్యటించిన శ్రీ కృష్ణ కమిటి చివరికి ఆరు మార్గాలను సూచించి ప్రస్తుతం వున్నా సమైకంద్రనే ఉత్తమమని నివేదిక ఇవ్వడం జరిగింది . అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ నివేదికపై ఏ నిర్ణయం ప్రకటించలేదు. తెలంగాణా పై కేంద్ర సాచివేత ధోరణి వాళ్ళ రాష్ట్రములో ఉద్యమం తారాస్తాయి కి చేరి సకల జనుల సమ్మె గా రూపుమార్చుకుంది.

ఇదిలా వుండగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వాటి విధాన నిర్ణయాని చెప్పలేకపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు రెండు ప్రాంతాలలోను ఉద్యమాలలో పాల్గొంటున్నాయి. ఈ పరిస్తితులలో కే. సి. ఆర్. నిరాహార డిక్ష ప్రారంభిస్తే  అది ఇంకా సమస్యగా మరే అవకాసం వుంది. అయితే ఈసారి నిరాహార దేక్షను అడ్డుకొని రాష్ట్రా ప్రభుత్వం ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నించవచ్చు . ఒకసారి తొందరపడిన ప్రభుత్వం ఈసారైనా రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.


No comments:

Post a Comment