రాజకీయాలలోకి రావలనుకున్తున్నట్టు , వచ్చే ఎన్నికలలో ఎం. ల్. ఎ స్థానానికి పోటీ చేస్తునట్టు బాలయ్య ప్రకటించడం తెలిసిందే. ఈ ప్రకటన వ్యూహత్వకమే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తెలుగు దేశం కాడర్ లో నూతన ఉత్తేజం నింపడమే లక్ష్యంగా చెప్పినట్టు తెలుస్తోంది. బాలయ్య ప్రకటన తరువాత వెంటనే వివిధ జిల్లాల కార్యకర్తలు స్వాగతం పలకడం , స్వయానా చంద్రబాబు బాల కృష్ణ వస్తే తగిన విధంగా గౌరవిస్తామని అనడంతో ఎన్.టి. ఆర్ కుటుంబం పార్టీ తో ఉందనే సందేశం పంపడంతో పాటు హరికృష్ణ కు , జూనియర్ ఎన్.టి. ఆర్ కు చెక్ చెప్పే విధంగా వుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ స్వయానా వియ్యంకుడు కావడంతో చంద్ర బాబు కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు .
No comments:
Post a Comment