Friday 30 September 2011

సోనియా చెవిలో ఆజాద్ చెప్పినదేమి ?


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల భాద్యుడు గులాబ్ నబి ఆజాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఇరు ప్రాంతాల నాయకులతో చర్చించిన తరువాత సోనియా గాంధీకి అందించిన నివేదిక ఎటూ తేల్చని ఓ ప్రహసనం అయింది . తెలంగాణా కు అనుకూలమని, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని , రాయల తెలంగాణా అని ఏదో ఏదో అనుకుని ఎదురు చూసిన నివేదిక ఎలాంటి దిశా నిర్దేశం చేయలేదని చెప్పాలి. అయితే ఇదే సమయంలో తెలంగాణా కాంగ్రెస్ నాయకులూ ముందే ఈ నివేదిక చూసి కూడా ఏమి మాట్లాడక పోవటం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికలో సమస్యను లోతుగా, పత్రి వ్యవహారాలను చర్చిన ఆజాద్ తెలంగాణా రాష్ట్రం ఇవ్వాళా వద్దా అని తేల్చలేకపోయారు. ఏదైనా తేలిచి చెబితే ఎక్కడ శ్రీ కృష్ణ కమిటీ, చిదంబరం పై వచ్చిన విమర్శలకు భయపడి నివేదిక ఆలా వ్రాసి ఉంటారని ఆయన చెప్పతలచిన విషయాని సోనియా చెవిలో ఊది ఉంటారని అంటున్నారు . మరి కాంగ్రెస్ నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి .

No comments:

Post a Comment