రాష్ట్ర మంత్రుల
మధ్య పోరు
రాష్ట్ర చరిత్రలోనే ప్రధమంగా ఓ హోం మంత్రిపై హైకోర్ట్ సుమోటాగా స్వీకరించి సి.బి.ఐ. విచారణ కు ఆదేశాలు ఇచ్చింది .సబితా ఇంద్ర రెడ్డి , రాష్ట్ర మంత్రి మోపిదేవి పై రాష్ట్ర జౌళి శాఖ మంత్రి శంకర్ రావు తీవ్రమైన ఆరోపణలు చేశారు . హోం మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని , ఆమె కుమారుడు ఏకంగా దుకాణం పెట్టాడని ఆరోపించారు. పోలీసు నియామకాలపై కూడా అవినీతి వున్నట్టు ఆరోపణలు చేశారు . ఈ ఆరోపణలు సుమోట గా కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయాలని మంగళవారం హైకోర్ట్ ఆదేశించింది.
రాష్ట్ర మంత్రులపై అదే రాష్ట్ర ప్రభుత్వంలో వున్నా మరో మంత్రి ఆరోపణలు చేయడం దానిపై హైకోర్ట్ స్పందించడం విశేషం. శంకర్ రావు ఇంతకు మునుపు జగన్ పై హైకోర్ట్ కు లెటర్ వ్రాస్తే దాని ఆధారంగానే హైకోర్ట్ సి.బి.ఐ వి చారణకు ఆదేశించడం తెలిసిందే . శంకర రావు అంటేనే రాజకీయ నాయకులు భయపడుతున్నారు . ఆయన ఏకంగా సి. ఎం. పై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా వుండగా గతంలో అనంతపురం సూరి హత్యకేసులో నిన్డుతుడైన భానుకు సభిత పిల్లలే ఆశ్రయం ఇచ్చరాని కూడా వార్తలు వచ్చాయి . మొత్తానికి సబితా పిల్లల వల్ల కేసులో ఇరుక్కున మాట నిజమేనంటున్నారు .
ఈ శంకర రావు ఏ లెటర్ రాసినా దాన్ని సూ మోటో కింద స్వీకరిస్తోంది హైకోర్టు. ఈయనతో అందరూ జాగ్రత్తగా ఉండాలి.
ReplyDelete