సికిందరాబాద్ కాంగ్రెస్ శాశనసభ్యురాలుగా ఎన్నికయిన సిని నటి జయసుధ జగన్ గ్రూప్ తో జతకట్టిన విషయం తెలిసిందే. ఆమె తన పదవికి తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా ఆమె చేసిన రాజీనామాను స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే వై ఎస్ పేరు సి.బి. ఐ ప్రాధమిక నేర పత్రంలో ప్రస్తావించినందుకు జగన్ గ్రూప్ లోని అందరూ ఎం ఎల్ ఎ లు రాజీనామా చేసిన తెలంగాణాకు చెందినా కొండ సురేఖ , సత్యవతి, జయసుధ లు చేయలేదు. ఇదివరకే రాజీనామా చేసినందున మళ్ళీ అవసరం లేదన్నారు. అయితే కొండ సురేఖ, సత్యవతి మళ్ళీ రాజీనామాకు సిద్ధమంటున్న జయసుధ వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోంది . ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలను తోసిపుచ్చలేము.
జగన్ వర్గం ఎమ్మెల్యేలందరూ తిరిగి కాంగ్రెస్లో చేరిపోతే తెరాసకి ఒక రకంగా లాభం. తెలంగాణా ఉద్యమానికి ఉన్న జగన్ వర్గం అడ్డు తొలిగిపోతుంది. జగన్ వర్గంలో ఉంటే ఆ ఎమ్మెల్యేలకి వచ్చే లాభం ఏమీ ఉండదు కనుక వాళ్ళు కాంగ్రెస్లోకి తిరిగి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. జగన్పై ఉన్న కేసులు కోర్ట్లో ఋజువై జగన్కి కారాగార శిక్ష పడితే జగన్ పార్టీ పూర్తిగా మూతపడుతుంది.
ReplyDelete