Wednesday 28 September 2011

మౌనంగా వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ నేతలు

వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పై సి.బి. ఐ విచారణకు రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ కుట్ర గా విరుచుకు పడిన వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కోకరే మౌనం పాటిస్తున్నారు. అంటే గాక సి.బి. ఐ ఛార్జ్  షీట్ లో వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చడంపై ఏం.ఎల్. ఎ పదవులకు రాజీనామాలు చేసిన వారూ మిన్నకుండి పోతున్నట్టు తెలుస్తోంది. జగన్ ఢిల్లీ పర్యటన తరువాత కాంగ్రెస్ నాయకులపై విమర్శలు తగ్గిచిన విషయం గమనించి రాజకీయాలలో ఏదైనా అనుకోని మార్పులు రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఒక వేల తెలంగాణా రాష్ట్రము ఏర్పడితే సీమంద్రలో జగన్ అవసరం కాంగ్రెస్ కు ఉందనే అంటున్నారు . ఉభయతారకంగా ప్రస్తుతం సి.బి. ఐ కేసు మందకొడిగా సాగుతోందని ఆరోపణలు వస్స్తున్న విషయం తెలిసిందే.  ఇది ఇలా వుండగా వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ నేతలు ఏమిచేయాలో పలు పోక మౌనం ఆశ్రయిస్తున్నారు.

No comments:

Post a Comment