Friday 23 September 2011

జగన్ కేసు నీరు కారుస్తున్నారా?


జగన్ అవినీతి పై కోర్టు ఆదేశాల మేరకే విచారణ చెప్పట్టినట్టు చెబుతూ వచ్చిన సి.బి. ఐ . ప్రస్తుతం నెమ్మదిగా విచారణ సాగిస్తోంది. ఆరంభంలో ఏంటో స్పీడ్ కనబరిచినా జగన్ ఢిల్లీ పర్యటన తరువాత విచారణ పై ఒత్తిడి వచ్చినట్టు అంటున్నారు. ప్రధాని ఏమైనా హామీ ఇచ్చారేమో , జగన్ కాంగ్రెస్ పార్టీ కి లొంగి పోయదేమోనని అంటున్నారు . అదే జరిగివుంటుందని 45  రోజులలో  వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేస్తారని తెలుగు దేశం ప్రచారం చేస్తోంది . గతంలో ప్రజారాజ్యం పార్టీ గురించి ఇదే విధంగా తెలుగు దేశం చెప్పింది. అయితే ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు తెలుగు దేశం చెప్పినట్టే ప్రజారాజ్యం వీలీనం జరిగిపోయింది. జగన్ ఏర్పాటు చేస్తుకున్న  వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేస్తారని అంటున్నారు .ఏది ఏమైనా గాలి కేసు లో సి.బి. ఐ. చాలా బిజీ గా వుంది. జగన్ కేసుకు కాస్త తెరిపి నిచ్చిన సి.బి.ఐ తన పని తానూ చేస్తుందేమో చూద్దాం.

No comments:

Post a Comment