Sunday 11 September 2011

రోజా అడుగు పెడితే అరిస్టమేనా ?


  రోజా ఏ ముహూర్తాన రాజకీయ రంగంలో అడుగు పెట్టిందో ఏమో కాని ఎక్కడ అడుగు పెడితే అక్కడ పార్టీకి , నాయకులకు అరిష్టం అంటున్నారు . సినిమా రంగంలోంచి నేరుగా తెలుగు దేశం పార్టీలోకి చేరడంతోనే ఆ పార్టీకి వున్నా అధికారం కాస్త చేజారిందని గుర్తుకు తెస్తున్నారు. ఎన్నికలలో తెలుగు దేశం తరపున పోటీ చేసి ఓడిపోయి తెలుగు దేశం పార్టీని వదలి రాజశేఖర్ రెడ్డి ఆకర్ష్ కు కాంగ్రెస్ పార్టీ లో చేరింది . కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినా  రోజా చేరిన వెంటనే  వైఎస్ మరణించడం తో రోజాకు రాజకీయాలలో ఐరన్ లెగ్ పేరు పెట్టేశారు . కాంగ్రెస్ వదలి జగన్ వెంట రాగానే ముఖ్యమంత్రి పదవి రాకపోవడం తో  పాటు జగన్ వివిధ సి బి ఐ కేసులలో ఇరుక్కొని పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రోజా ఇప్పుడు అప్పుడప్పుడు సినిమాల పై దృష్టి పెడుతోంది . టి వి ప్రోగ్రాం యాంకర్ గా మారిపోతోంది . ఏదో ఉన్నానంటే వున్నానని రాజకీయాలలో ఉంటోంది . ఈ ఐరన్ లెగ్ భామ ప్రభావం జగన్  ను ఏ గతి పట్టిస్తుందో చూద్దాం .

No comments:

Post a Comment