Sunday 2 October 2011

క్రొత్త పథకాల పిచ్చిలో కిరణ్ !



ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం క్రొత్త పథకాల పిచ్చిలో వున్న్తట్టు వున్నారు . దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ని మరిపించాలని, పరిపాలనలో తనదైన ముద్ర వేయాలని తహ తహలాడుతున్నట్టు కనబడుతోంది. అనుచరుల అండ లేకుండా కేవలం ఆదిస్థానం అండ దండలతో ముఖ్యమంత్రి పదవి అనుకోకుండా వరించింది.  పార్టీలూ కూడా సరైన విధంగా సహకారం లేదు. అది కాకుండా ఒక ప్రక్క బొత్స , రెండో ప్రక్క చిరు పక్కలో బల్లెలా వున్నారు . ప్రస్తుతం రాష్ట్రా రాజకీయాలలో శూన్య యుగం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా సమస్యతో నిర్వీర్యం అయిపోతోంది. అసలు ప్రభుత్వం ఉందా లేదా తెలియడం లేదు. ఈ విషయాన్ని పక్క దారి పట్టించి తనకు పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చే విధంగా పతకాలు రూపొందించి వాటిని శరంపరలుగా జనంలోకి వదులుతున్నారు . మహిళలను దృష్టిలో పెట్టుకొని మొన్న స్త్రీ శక్తి పేరిట రాష్ట్ర స్తాయి బ్యాంకు కు
శ్రీ కారం చుట్టారు . యువజనులను దృష్టిలో పెట్టుకొని 15  లక్షల ఉద్యోగాలు ఇంస్తున్నట్టు అందులో డిసెంబర్ లోనే ఒకే రోజు ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తునట్టు ప్రకటించారు కూడా. అంతలోనే కిలో రూపాయి బియ్యం ప్రకటించి గాంధీ జయంతి సందర్బంగా సంతకాలు చేసి అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్సారు . ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణా పథకాని ప్రకటించారు . ఇన్ని పతకాలు ప్రకటిస్తూ వుంటే కాంగ్రెస్ పార్టీ వారీ నోర్లు వేల్లబెడుతున్నారు . సాటి మంత్రుల కూ పరకించిన అనంతరమే తెలుస్తోంది . మరి ఈ పతకాలు కిరణ్ కుమార్ ఆశిస్తున్నాటు మంచి పలితాలు ఇస్తాయా లేక మరిన్ని సమస్యలు తీసుకు వస్తాయా వేచి చూడాలి .

No comments:

Post a Comment