Friday 14 October 2011

రసకందాయం లో రైలురోకో

తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా జే.ఎ. సి. ఆధ్వర్యంలో చేపట్టిన రైలురోకో అటు ప్రభుత్వానికి , ఇటు ఉద్యమ కారులకు ప్రతిష్టగా మారింది. రెండు ప్రక్కల ఊహాత్మక కార్యక్రమం అమలు చేయుటకు పూనుకున్నారు. ఇప్పటికే తెలంగాణా అంతట ముఖ్యమైన ఉద్యమ కార్యకర్తలను పోలీసు లు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పట్టాలపైకి వస్తున్నా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. రైల్వే చట్టాలపై ఇప్పటికే ప్రాచారం కల్పించి ఆ ప్రకారం అరెస్ట్లు చేస్తున్నారు. ప్రత్యెక పోలీసు దళాలను రప్పిస్తున్నారు. హెలి కప్టర్ సహాయంతో రైల్వే ట్రాక్ లపై భద్రత చర్యలు చెప్పుతారు . డి.జి.పి దినేష్ రెడ్డి చెప్పడుతున్న చర్యలపై అప్పుడే టి. ఆర్. ఎస్. ,జే.ఎ. సి. నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య బాధంగా తమ నిరసన తెలుపుతున్నామని , అణిచివేసేందుకు ప్రయత్నించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో రైలు రోకో కు జనం పట్టాలపైకి వస్తున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసులు బుక్ చేస్తున్నారు. రైలు రోకో తో జాతీయ స్థాయిలో తెలంగాణా సమస్యను తెలుపాలనుకున్న జే.ఎ. సి.  ఈ పోరాటాని ప్రతిస్తాగా తెస్తుకొని పనిచేస్తోంది. అయితే సామాన్య పరాజ కష్టాల పట్ల ఎవరు పట్టించుకోవడం లేదు.  

No comments:

Post a Comment