Wednesday 26 October 2011

చంద్రబాబు పాదయాత్ర




రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితిని చక్కదిద్దడానికి  చంద్రబాబు నాయుడు  శ్రీకారం చుట్టారు. పార్టీ పతిష్టపరచడంలో భాగంగా ఆయన రైతుల కరువు సమస్యలపై పాదయాత్ర చేయనున్నారు. తొలుతగా పార్టీకి పట్టువున్న అనంతపురం జిల్లా నుండి మొదలు పెట్టి రోజుకు 15 కిలోమీటర్లు నడిచే విధంగా ఆతరువాత రోజు మరో జిల్లాలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ప్రణాళిక రూపొందిచారు. తెలంగాణలో చంద్ర బాబు యాత్రలు చేసి ఛాలా కాలం అయ్యింది . తన ఇమేజ్ తో పాటు తెలుగుదేశం పార్టీ కి పూర్వవైభవం తేవాలని సీనియర్ నాయకుల సలహా మేరకు పాదయాత్రకు ప్రణాళిక రూపొందిచినాట్టు చెబుతున్నారు. టి. ఆర్.ఎస్. పై మునుపటి నమ్మకం జనంలో పోలవరం టెండర్ల గొడవ వల్ల తగ్గిందని అంచనా వేస్తున్నారు. మరి పూర్వ వైబవం దక్కుతుందో లేదో కాని టి.ఆర్.ఎస్ తో మాత్రం వీధి పోరాటాలు తప్పేతట్టులేదని పరిశీలకులు అంచనా వేస్తునారు.

No comments:

Post a Comment