సకల జనుల సమ్మెలో తెలంగాణా కు వ్యతిరేకంగా వున్నా కాంగ్రెస్ వారిపై కె. సి. ఆర్ . అనుచితంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. కాంగ్రెస్ నాయకులు బూట్ పోలిష్ గాళ్ళు అన్న కె.సి.ఆర్ మాటలు దుమారం లేపుతున్నాయి. కె.సి.ఆర్ లోని దొర పెత్తనానికి ఇదో ఉదాహరణ అని మాదిగల కుల వృతిని అవమానిచేట్టట్టుగా వుందని ఆయన శరీరానికి చెప్పులతోనే పోలిష్ వేస్తామని మాదిగా దండోరా రాష్ట్ర అద్యక్షుడు మంద కృష్ణ మాదిగా హెచ్చరించారు. తెలంగాణా రాష్ట్ర సాధనకు కె.సి.ఆర్ కు చిత్తశుద్ధి లేదని , తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తోలి ముఖ్యమంత్రి దళితుడే అంటున్న కె. సి. ఆర్. తన పార్టీ అధ్యక్షుడుగా 10 జిల్లాలలో ఒక జిల్లాలో కూడా నియమించలేదని,
బహిరంగా సభలలో దళితులను కనీసం తన ప్రకన్న కూర్చోబెట్టుకోరని మంద కృష్ణ అన్నారు. వెంటనే విద్యాసంస్థలు తెరిచి పిల్లల చదువులు కాపాడాలని లేకుంటే తమ మాదిగా దండోరా తరపున వేలమంది నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.
బహిరంగా సభలలో దళితులను కనీసం తన ప్రకన్న కూర్చోబెట్టుకోరని మంద కృష్ణ అన్నారు. వెంటనే విద్యాసంస్థలు తెరిచి పిల్లల చదువులు కాపాడాలని లేకుంటే తమ మాదిగా దండోరా తరపున వేలమంది నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.
No comments:
Post a Comment