Friday 7 October 2011

నేడో రేపో తెలంగాణా పై స్పష్టమైన ప్రకటన ?


రాష్ట్రంలో సకల జనుల సమ్మెతో స్తంబించిన పాలనతో కేంద్రం ఆలోచనలో పడింది. తెలంగాణా పై ఇంతవరకు తేల్చని కేంద్రం నేడో రేపో ఓ స్పష్టమైన ప్రకటన చెయ్యొచ్చని తెలుస్తోంది. ఈ విషయమై ప్రత్యేకంగా చర్చించడానికి ఢిల్లీ కి సి. ఏం. కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, పి.సి.సి. చీఫ్ బొత్స ఇప్పటికే పిలిపించారు. శుక్రవారం ప్రణబ్ తో 20 నిమిషాలపాటు సోనియా తెలంగాణా విషయం చర్చినట్టు ఆ తరువాత మినీ కోర్ టీం 40 నిమిషాలపాటు తెలంగాణా సమస్యపై చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా కు అనుకూలంగా ప్రకటన వెలువడితే సీమంద్రలో పెల్లుబికే నిరసనలు ఎలా అదుపు చేయాలో ఆలోచిస్తున్నారు. ఒక వేల తెలంగాణాకు వ్యతిరేకంగా ప్రకటిస్తే ఇప్పటికే సమ్మె లతో అట్టుడుకుతున్న తెలంగాణా మరింత ఆందోళనలకు గురవుతుంది. ఏది ఏమైనా రెండు ప్రాంతాలు ఆమోదించే నిర్ణయం రావాలని ఆశిద్దాం .

No comments:

Post a Comment