Wednesday 19 October 2011

చంద్ర బాబు అవినీతి పై విజయమ్మ కోర్టులో కేసు ..





వై. ఎస్. జగన్ పై సి.బి.ఐ. విచారణ ఇంకా పూర్తికాలేదు . ఇప్పటికే కాంగ్రెస్ తో జగన్ మిలాఖత్ అయ్యారని అందుకే ప్రధాన మంత్రిని కలిసిన తరువాత సి.బి. ఐ. కేసు మందకొడిగా సాగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వై. ఎస్. ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి  భార్య విజయమ్మ చంద్ర బాబు ఆధికారంలో వుండగా అవినీతికి పాల్పడ్డారని హై కోర్ట్ లో పిల్ వేసారు .దాదాపు 2500 పేజీలతో ఓ చిట్టా కూడా అందించారు. రాజకీయాలు అంటే ఏంటో మనకు ఈ పాటికే అర్థం అయివుండాలి. జగన్ పై కేసుల చంద్ర బాబు పై విచారణకు కోర్టు ఆదేశాలు ఇస్తే జగన్ పై పడ్డ మచ్చను జనం మర్చి పోతారని ఎత్తుగడగా ఈ పని చేసారు . వై . ఎస్. రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో కేసులు వేసివిరమించుకున్న విషయం విదితమే. ఇంతకూ చంద్ర బాబు విచారణకు అంగీకరిస్తారా లేకుంటే సుప్రీం కోర్ట్ కు వెళ్లి మళ్ళి స్టే తెచ్చుకుంటారో వేచి చూడాలి.





No comments:

Post a Comment