Wednesday 5 October 2011

కష్టాల్ల సుడిగుండంలో రాష్ట్ర ప్రగతి


ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అంటేనే దేశంలోనే ఆర్థిక సంస్కరణలకు, అభివృధికి నమూనాగా చెప్పుకునే వారు .. ఇక్కడా అమలయిన పథకాలు, పలితాల బట్టి ఆయా రాష్ట్రాలలో అమలు చేసే వారు . ఇప్పుడు పూర్తిగా తిరోగమనం వైపు నడుస్తోంది. బలమైన నాయకత్వలేమి, తెలంగాణా సమస్య, కేంద్రంలో రాష్ట్ర ప్రగతి పట్ల చిత్తసుద్ధిలేని ప్రభుత్వరం వెరసి రాష్ట్రంలో గందరగోళ పరిస్తితులు నెలకొని వున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ అవకాశవాద రాజకీయాలతో కాలం గడుపుతున్నాయి. టి.ఆర్.ఎస్ వైఖరిని తాపు పట్టలేము ఎందుకంటే ఆపార్టీ పుట్టిందే తెలంగాణా రాష్ట్ర సాధనకోసం. మిగిలిన పార్టీలు ఎందుకు టి.ఆర్. ఎస్ వెనుక , జాయింట్ ఆక్షన్ కమిటీ వెనుకు నడుస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తామూ పోరాదామని చెప్పుకోవడానికే అనిపిస్తుంది. ఒక సి.పి.ఏం . మినహాహిస్తే అన్నీ ప్రాంతాల కనుగుణంగా ఊహత్మకంగా నడుస్తున్నాయి. చిదంబరం డిసెంబర్  9 ప్రకటన  తొందరపాటు చర్య. సోనియా బర్త్ డే కానుకగా తెలంగాణా ఇద్దామనుకుని భంగపడ్డారు. పోనీ
 ఆ అభిప్రాయానికి నిలబడకుండా మళ్ళీ అభిప్రాయాన్ని మార్చుకొని చర్చలు అంటున్నారు. ఈ రెండు ఏళ్ళు రాష్ట్రంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, రెండుప్రాంతాల వారి మధ్య చిచుకు కారణం రాజకీయ పార్టీలే . సకజ జనుల సమ్మె వాళ్ళ రాష్ట్రం మరింత కష్టాల్లో వుంది. పండుగ లేదు. ప్రయాణం లేదు. సామన్యుని నోటికాడ కూడు తీసేస్తున్నారు. వెంటనే పరభుత్వం స్పందించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలి. జరిగిన నష్టం పూడ్చుకోవడానికి ప్రపంచ బ్యాంకు నుండి మరో 2000 కోట్లు అప్పు తెస్తున్నారు. రాష్ట్రం ప్రగతి గాడిలో పాడాలని ,ఈ దసరా అందరికి మంచి గుణాన్ని ఇవ్వాలని కోరుకుందాం.

No comments:

Post a Comment