Wednesday 5 October 2011

తెలంగాణాకు ఎం.ఐ. ఎం. మోకాలడ్డు !


హైదరబాద్ పాతబస్తీలో బలమైన రాజకీయ పార్టీగా వున్నా ఎం.ఐ. ఎం. తెలంగాణాకు మోకలడ్డుతోంది. తమ పార్టీ కాంగ్రెస్, తెలుగుదేశం నిర్ణయాలపై ఆధారపడమని, తము ప్రస్తుతం రాష్ట్రం వున్నా స్తితినే కోరుకుంటున్నామని , ఒక వేల తప్పనిసరి పరిస్తితులలో తెలంగాణా ఇవ్వదలిస్తే రాయలసీమ తెలంగాణలో కలుపాలని, హైదరాబాద్ రాజధానిగా వుండాలని కోరుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకుడు ఒవైసీ తెలిపారు. ఈ విషయం ఇదివరకే శ్రీకృష్ణ కమిటీ కు నివేదించామని అన్నారు. దీన్ని బట్టి చూస్తీ ఆ పార్టీ సమఖ్యంద్ర కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు . దీంతో తెలంగాణా సమస్య పరిష్కారం మరింత గందరగోళంలో పడినట్టేనని అంటున్నారు .

No comments:

Post a Comment