Thursday 13 October 2011

ఉద్యమం నెల బాలుడు ...!

తెలంగాణా ఉద్యమం నేటికి నెల రోజులుగా సకల జనుల సమ్మెలో ఉదృతంగా వుంది. అన్ని రంగాల ప్రజలు స్వచండంగా పాల్గొంటున్నారు . ఈ సకల జనుల సమ్మెతో కేంద్రానికి సెగ తగిలింది. ఈ నెల రోజులుగా ఆర్.టి. సి. బస్సులు ఆగిపోయాయి. ఆర్.టి. సి. యూనియన్లో చీలిక వచ్చి కొన్ని ప్రాంతాలలో బస్సులు రోడ్డు పదికి వచ్చిన జే.ఎ. సి కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రైల్ రోకో తోలిదపా విజయవంతంగా జరిగింది. రెండో దపా రైల్ రోకో కు సన్నధం అవుతున్నారు. ఈ నెల రోజులలో తెలంగాణా తెలుగు దేశం శాసన సభ్యులు రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ ఎం.పీ లు ప్రభుతవానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారితో కాంగ్రెస్ హైకమాండ్ పలు దపాలు చర్చించినా తెలంగాణా పై ఇంతవరకు తన నిర్ణయాని తేల్చి చెప్పలేక పోతున్నారు. అయితే ఈ సకల జనుల సమ్మె వాళ్ళ సామాన్య ప్రజలు త్రీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడ తలవంచకుండా కటినంగా వ్యవహరిస్తోంది. అయితే ఎక్కువ కాలం ఉద్యమం కొనసాగితే ఇప్పటికే కరెంట్ కొరత వాళ్ళ రైతులు నష్ట పోతున్నారు . విద్యార్తులు చదువులు కోల్పోతున్నారు. కేంద్రం వెంటనే ఏదో ఒకటి తేల్చి చెప్పి సమస్యను పరిస్కరించావలసి వుంది. 

1 comment: