Monday 17 October 2011

ఇమేజ్ పెంచుకున్న కిరణ్


సకల జనుల సమ్మె తెలంగాణా కు ఏమి పలితం ఇచ్చిందో తెలియదు కాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఇమేజ్ ను పెంచుకున్నారని చెప్పా వచ్చు. స్వంత ప్రతి వారికే కొరుకుడుపడని తత్వం, మాటలో మెత్తంగా ఉంటూ చేత్తల్లో దృడంగా వుండడం అందరూ మెచ్చుకుంటున్నారు. రైల్ రోకోను విజయవంతంగా ఎదుర్కొని స్వంత పార్టీ వారిని కూడా అరెస్ట్ చేయించడం సాధారణ విషయం కాదు. మొత్తం పోలీసు శాఖను తన అదుపులోకి తెచ్చుకొని ఎలాంటి సవాల్లనయిన ఎదుర్కుంటున్నారు . గవర్నర్, ముఖ్యమంత్రి ఒక టీం గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు హై కమాండ్ సలహాలు తీసుకుంటున్నారు . అయితే కాంగ్రెస్ పార్టీ లో ఇంకా కిరణ్ కు పట్టు దొరకలేదనే చెప్పాలి. ఏది ఏమైనా సమ్మె సాగతీత వాళ్ళ జే. ఏ. సి,. కి ఏమి చేయాలో తెలియడం లేదు. సమ్మె కొనసాగిస్తే ప్రజల వ్యతిరేకత వస్తుందేమో నని , సమ్మె కొనసాగించక పొతే ప్రభుత్వం ఇంకా కటిన చర్యలు తీసుకున్తుందేమో నని ఆలోచిస్తున్నారు.  ఆర్.టి. వి. సమ్మె విరమణ వాళ్ళ ఊపిరి తీసుకున్న ప్రభుత్వం ఉద్యోగులు, సింగరేణి కార్మీకుల నుండి విరమణ కోరుకుంటున్నారు . కాంగ్రెస్ ప్రజా ప్రతి నిధులు ఇప్పుడు ప్రజల దృష్టిలో విల్లన్లుగా మారినట్టే,. తెలుగుదేశం మాత్రం తాము ఉన్నామని రాజీనామాలు చేసారు అయితే వారికి ఎవరి మద్దతు ఉండడంలేదు.
మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డిని పరిస్తితులు బలంగా తయారు చేస్తున్నాయని చెప్పా వచ్చు.

No comments:

Post a Comment