Monday 31 October 2011

జగన్ కు లాభం చేకూర్చే దిశలో టి.ఆర్.ఎస్

 
జగన్ వేసుకున్న ప్లాన్ లో టి.ఆర్.ఎస్. పావుగా ఉపయోగపడుతోందని అంటున్నారు. ముందుగా సమాఖ్య ఆంధ్ర కు మద్దతు తెలిపిన జగన్ ప్రస్తుతం తెలంగాణా పై ఏమి మాట్లాడడం లేదు. మౌనం పాటిస్తున్నారు. జగన్ కాంగ్రెస్ , తెలుగు దేశం పార్టీ లను ఒంటరిగా ఏమిచేయలేక పోయారు. పైగా చంద్ర బాబు , కిరణ్ కుమ్ముక్కు అయ్యారని పలు సందర్భాలాలో అన్నారు. సి.బి. ఐ. కేసుల చిక్కుల్లో వున్నా జగన్ ప్రస్తుతం కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా ఏమి పెద్దగా మాట్లాడడం లేదు. కేసు కూడా నేమ్మదిన్చిందని అంటున్నారు . అయితే జగన్ తాను చేయ వలసిన పనిని తెలంగాణా వాదులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ప్రణాలికలు రూపొందించి నట్టు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా ముందుగా నాగం జనార్ధన్ రెడ్డి బృందం తెలుగు దేశం పార్టీ లో లేవనెత్తిన తిరుగుబాటు . ప్రస్తురం జూపల్లి, రాజయ్య తదితరులు కూడా జగన్ అంధ దండలతోనే టి.ఆర్.ఎస్. తీర్థం పుచ్చుకోన్నారని అంటున్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి  కూడా ఈ విషయంలో కీలక పాత్ర వహిస్తున్నట్టు అంటున్నారు. ఎదిఎమైనా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేసిన సత్పలితాలు రాలేదు. టి.ఆర్. ఎస్.  తో పొట్టు పెట్టుకొని వచ్చే ఎన్నికలలో పోటీ కూడా చేయవచ్చని అంటున్నారు. అయితే కాంగ్రెస్ తెలంగాణా పై తీసుకొనే నిర్ణయం పైననే జగన్ నిర్ణయం ఆధార పదివుంటుందని తెలుస్తోంది. తెలంగాణలో జగన్ కు చెప్పుకోదగ్గ స్తాయిలో ప్రజా ప్రతినిధుల మద్దతు లేదు . ఈ కారణంగా ఈ ఎత్తులు వేస్తున్నట్టు అంటున్నారు. టి.ఆర్.ఎస్ కూడా జగన్ తెలంగాణా కు మద్దతు ఇవ్వగలిగితే కలిసి పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తోందని సమాచారం.  కాంగ్రెస్, తెలుగుదేశం లు ఈ విషయంలో జాగ్రతగా లేకపోతె అపాయమే మరి.
--

No comments:

Post a Comment