సమాచార చట్టం స్పూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ నరసింహన్ తోసిపుచ్చుతూ తన ప్రతాపం చూపెట్టారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని వారితో నింపవలసిన సమాచార కమీషనర్లను పూర్తిగా రాజకీయకోణంలో పదవులు కట్టబెట్టడం ఇదే తొలిసారి. కిరణ్ మొండిగా తిరిగి వారినే నియమించినా గవర్మరు చేసేది ఏమీలేక సంతకం చేసినా ఇప్పటికే ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది తప్పుడు నిర్ణయమనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ విషయంలో కిరణ్ , చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ఇది వరకే ఈ నియామకాలపై తన అసమ్మతి నోట్ వ్రాసి బయటపడ్డారనే చెప్పాలి. కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, ఎవరినీ పరిగణలోనికి తీసుకోకుండా ఇలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మిగిలిన నాయకులు మండి పడుతున్నారు.
Wednesday, 22 February 2012
కిరణ్ కు చెంప పెట్టు
సమాచార చట్టం స్పూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ నరసింహన్ తోసిపుచ్చుతూ తన ప్రతాపం చూపెట్టారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని వారితో నింపవలసిన సమాచార కమీషనర్లను పూర్తిగా రాజకీయకోణంలో పదవులు కట్టబెట్టడం ఇదే తొలిసారి. కిరణ్ మొండిగా తిరిగి వారినే నియమించినా గవర్మరు చేసేది ఏమీలేక సంతకం చేసినా ఇప్పటికే ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది తప్పుడు నిర్ణయమనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ విషయంలో కిరణ్ , చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ఇది వరకే ఈ నియామకాలపై తన అసమ్మతి నోట్ వ్రాసి బయటపడ్డారనే చెప్పాలి. కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, ఎవరినీ పరిగణలోనికి తీసుకోకుండా ఇలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మిగిలిన నాయకులు మండి పడుతున్నారు.
Wednesday, 15 February 2012
ఎవరు ఎవరితో ఫిక్శింగ్
రాష్ట్ర్రరాజకీయాలు ఇదివరలో లేనంత చిక్కులుగా చికాకుగా ఉన్నాయి. వై.యస్.ఆర్ పార్టీ వారు ఆరోపించినట్టు కాంగ్రెస్ , తెలుగుదేశం లు ఒకటై మూడో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నాయా ... లేక పోతే తెలుగుదేశం ఆరోపించినట్టు కె.సి.ఆర్ ( టి.ఆర్.యస్.) తో కాంగ్రెస్ , వై.యస్.ఆర్ పార్టీలు కుమ్ముక్కయ్యాయా.. లేకపోతే జగన్ కాంగ్రెస్ లోకి ఎప్పటికైనా వెలుతాడని ఇందంతా ఓ నాటకమని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అందుకు ఉదాహరణగా ముఖ్యమంత్రి కిరణ్ జగన్ ను పలెత్తు మాట అనకుండా ఉన్నట్టు చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కమ్యునిస్టు పార్టీలు తాము ఏమి తక్కవ తిన్నామా అని మాకు తెలుగుదేశంతో పాటు వై.యస్.ఆర్ పార్టీ ఒకటేనని గత ఎన్నికలలో ప్రజారాజ్యంతో కలసి పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవని నిష్టూరమాడుతోంది. ఇంతకి ఎవరి ఎవరి ప్రక్క, ఎవరు అధికార పక్షం, ఎవరు ప్రతి పక్షం అంతా గందరగోళంగా ఉంది.
Subscribe to:
Posts (Atom)