Friday 1 June 2012

కాంగ్రెస్ లో వలసల కార్చిచ్చు



ఏ మూహుర్తాన రాజశేఖర్ రెడ్డి మృతి చెందారో ఏమో కాని అప్పటినుండి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు జగన్ వల్ల కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ముఖ్యంగా ముఖ్య మంత్రులకు రోశయ్య అయితేనేం , కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేం జగన్ దెబ్బకు విలవిలలాడి పోయారనే చెప్పాలి. ఇప్పుడయితే కాంగ్రెస్ విమర్శల వేడి పెంచింది కాని మొదట్లో విమర్శించలేరు అలా అని మౌనంగా ఉండలేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే రాను రాను జగన్ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కొరకరాని కొయ్యగా తయారయ్యు స్వంత కుంపటి పెట్టుకున్నాక సి.బి.ఐ కేసుల వలలో ఇరుక్కుపోయారు. ఇలా జగన్ తన ఓదార్పు యాత్ర నుండి ఇప్పటి సి.బి.ఐ అరెస్టు వరకు ప్రతి క్షణంలోనూ కాంగ్రెస్ అనే మహా పార్టీకి ముచ్చెమటలు పోయిస్తున్నారు. రోశయ్య సి.యం అయిన కొత్తలో కొండా సురేఖ మంత్రిగా ఆయన మంత్రి వర్గంలో మంత్రిగా ఉండేవారు . ఆమె ద్వారా సి.యం. రోశయ్యను విమర్శలు చేయుస్తూ చివరికి రాజీనామా చేయుంచారు. ఆ తరువాత ఓదార్పు యాత్రలో పాల్గొననీయకుండా యం.యల్.ఏ లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టం చేసినప్పుడు తన వర్గం వారితో బల ప్రదర్శన చేయించి కాంగ్రెస్ లో కలవరానికి కారణమయ్యారు. చివరికి తనకు తానుగా పార్టీ ఏర్పాటు చేసుకున్నాక కూడా తన వర్గం వారిని అక్కడే ఉంచి సి.బి.ఐ  చార్జీషీటులో వై.యస్.ఆర్ పేరు చేర్చినందుకు గాను 17 మంది దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించి ఉప ఎన్నికలకు కారణమయ్యారు. ఇప్పుడు సి.బి.ఐ అరెస్టు సందర్భంలోనూ నానీ తదితరులు కాంగ్రెస్ నుండి వచ్చేలా ప్రణాళిక రూపొందించి కాంగ్రెస్ ను ఇబ్బందులలోకి నెట్టారు.  తన పై సెంటిమెంటు రావడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్న జగన్ జైలు నుంచే కాంగ్రెస్ నుండి మరిన్ని వలసలు రావడాన్ని ప్రోత్సహిస్తున్నట్టు భోగట్టా.
వందల సంవత్సరాల పార్టీకి ముచ్చేమటలు పోయిస్తున్న జగన్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నది. 

1 comment:

  1. Jagan baabu gaari ki adikaaram isthe thappa.....ee adikraa dhaapu koralu raashtraanni vadalavu......appati varaku asaanthi alajadi srushtistoone vuntaaru...dabbu madam to..

    ReplyDelete