రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా పార్టీల భవిష్యత్తును నిర్ణయించే
ఉపఎన్నికలకు ప్రచారం నేటితో తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్ లో 18 అసెంబ్లీ, 1 లోకసభ
స్థానానికి ఎన్నికలు జూన్ 12న జరుగనున్న విషయం విదితమే. ఎన్నికలు జరుగుతున్న నెల్లూరు లోకసభకయితే పోటీ నువ్వా నేనా అని
ఉంది. ఇక్కడ ఎన్నికలకు అభ్యర్థులు పెట్టే ఖర్చే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ
ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పరకాల ఉప ఎన్నిక తెలంగాణాలో జరుగుతున్నది.
ఇక్కడ బహు ముఖంగా ఉంది. ముఖ్యంగా వై.యస్.ఆర్ అభ్యర్థి కొండా సురేఖ
ఎదురీదుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడ పాగా వేయాలని టి.ఆర్.యస్ మరియు
బి.జె.పిల మధ్యే ప్రదాన పోటీ నెలకొని ఉంది. తెలుగుదేశం పరిస్థితి ఏ మాత్రం
తెలంగాణాలో మెరుగుపడలేదు. అలాగే సీమాంధ్రలో జరుగుతున్న 17 అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా
పోటీ వై.యస్ ఆర్ కాంగ్రెస్ , తెలుగు దేశం , కాంగ్రెస్ ల మధ్య త్రికోణ పోటీ నెలకొని
ఉంది. చిరంజీవి ఖాళీ చేసిన తిరుపతి స్థానం అయితే తెలుగుదేశంకు లాభించేలా ఉంది. అక్కడి
ప్రజారాజ్యం పార్టీ తరపున ఇంతకు ముందు గెలుపొందిన చిరంజీవిపై అలాగే కరుణాకర రెడ్డి
పై తీవ్ర అసంతప్తి నెలకొని ఉంది. ఇది సహజంగా తెలుగుదేశంకు లాభిస్తుందని
భావిస్తున్నారు. మిగిలిన స్థానాలలో వై.యస్.ఆర్ పార్టీకి సానుభూతి పవనాలు
వీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిలో ఎన్ని ఎవరు గెలుస్తారో చెప్పటం కష్టంగా
మారింది. ఎందుకంటే వై.యస్.ఆర్ పార్టీ భారీగా కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి
కొట్టనుంది. అలాగే తెలుగుదేశం ఓట్లు కూడా చీలితే ఆ ప్రభావం వై.యస్.ఆర్ పార్టీకి
భారీగా లాభిస్తుంది. అయితే తెలుగుదేశం ఓట్లు చీలకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ
పంట పండినట్టేనని భావిస్తున్నారు. తిరుపతి మినహా ఎన్నికలు జరుగుతున్న
అన్నిస్థానాలలో పదవిలో ఉన్న వారే పోటీ చేస్తుండడంతో వారిపై జనంలో ఉన్న ఆబిమానం
మరియు వై.యస్ ఆర్ పార్టీ పట్ల ఉన్న అభిమానానికి ఈ ఎన్నికలు ఒక పరీక్షగా
నిలువనున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టుకావడంతో ఫలితాలు ఎలా మారుతాయోనని
అన్ని పార్టీలలో గుబులు ఏర్పడింది. ఆ పార్టీ తరపున విజయమ్మ, షర్మిల ప్రచారం ఆ
పార్టీని ఈ ఎ న్నికలలో గెలుపు దిశగా పయనింపజేస్తున్నదని చెబుతున్నారు. కాంగ్రెస్
నాయకుల మాటల్లో అప్పుడే ఓటమికి సిద్ధమైన సూచనలు కనబడుతున్నాయి. ఈ ఎన్నికల తరువాత
యం.ఎల్.ఏ లు పార్టీ ఫిరాయించకుండా ఎలా అడ్డుకోవాలనే దానిపైననే మదనపడుతోంది. రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం
కష్టం ఈ ఎన్నికలు మాత్రం పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉందని మాత్రం చెప్పవచ్చు. ఓటరు
మహాశయుడు ఏ చేస్తాడో చూద్దాం.
No comments:
Post a Comment