Thursday 14 June 2012

ఫలితాలు పై ఎవరి ధీమా వారిదే...


రాష్ట్రంలోని 12 జిల్లాలో ఇటీవల 12 వతేదీన జరిగిన ఉప ఎన్నికలలో గెలుపు తమదంటే తమదని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీకి 18 స్థానాలు, పార్లమెంటుకు 1 స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గెలిస్తే ఏమని చెప్పాలి, ఓటమి పాలయితే ఏ విధంగా బురద జల్లాలి అని కూడా పార్టీలు తమ నాయకులకు తగిన శిక్షణలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలలో అందరి కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తారని భావిస్తున్న వై.యస్.ఆర్ పార్టీ కూడా 4-5 స్థానాలలో గట్టి పోటీని ఎదుర్కోన్నట్టు భావిస్తూ ఒక వేళ అక్కడ ఓటమి చెందితే పాలక ప్రతిపక్షాలు కలసి కుట్ర పన్నట్టు ప్రచారం చేయనున్నాయి. అలాగే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినట్టు ప్రచారం నిర్వహించేందుకు సిద్దమవుతున్నది. అలాగే గెలిస్తే వై.యస్.రాజశేఖర్ రెడ్డి పై జనంలో ఉన్న అభిమానానికి తార్కాణమని, జగన్ ప్రభంజనమని అంటూ ప్రచారం చేయనున్నారు.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గెలుపు పై పెద్దగా ఆశలు లేవనే చెప్పాలి. ఒక వేళ రెండు మూడు స్థానాలలో గెలిచినా చాలని భావిస్తున్నది. మిగిలిన స్థానాలలో ఓడితే సెంటిమెంట్ పండిందని, విజయమ్మ, షర్మిలల కన్నీటికి జనం కరిగి పోయారని ప్రచారం చేసుకుంటుంది. ఆ పార్టీ నాయకుడు చిరంజీవి అయితే మొత్తం ఓడినా కనీసం తిరుపతి లో గెలిస్తే చాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలా గెలిస్తే తనకు కేంద్ర మంత్రి పదవిని కోరవచ్చు. మిగిలిన స్థానాలు ఎలాగు జగన్ అరెస్టు సానుభూతి అంటూ ప్రచారం చేసుకోవచ్చు.

ఇక తెలుగుదేశమయితే ఈ ఎన్నికలలో డబ్బు వరదై పారిందని కాబట్టే జగన్ పార్టీ గట్టేక్కిందని ఓడితే గట్టిగా ప్రచారం నిర్వహించబోతోంది. మీడియా సాక్షీ ప్రచారం కూడా దీనికి తోడయిందని చెప్పవచ్చు. కనీసం ఆ పార్టీ మూడు స్థానాలు గెలిచినా తల ఎత్తుకుని తిరగవచ్చని భావిస్తున్నది.
ఇక మిగిలిన బి.జె.పి, టి.ఆర్.యస్ పార్టీలు తెలంగాణా అంశం పై పోటీ చేసినా కొండా సురేఖను ఓడిస్తేనే అది ఉన్నట్టు తేలుతుంది. అయితే ఎవరు ఎక్కడ గెలిచినా మెజారిటీ బోటాబోటీగానే ఉండవచ్చు. వై.యస్.ఆర్ పార్టీ అటు కాంగ్రెస్ ఓట్లకు, ఇటు వ్యతిరేక ఓట్లకు భారీగా గండికొట్టి ఇరు పార్టీలపై సమర శంఖం పూరించిందనే చెప్పాలి.  అయితే ఈ ఎన్నికల ఫలితాలే 2014 లో వస్తుందని మాత్రం చెప్పడం కష్టం అప్పటికి రాజకీయంగా చాలా ఎక్కువ సమయమనే చెప్పాలి. మా అంచనా మేరకు అయితే వై.యస్.ఆర్ పార్టీ 9-12 స్థానాలు, కాంగ్రెస్ 3-4 స్థానాలు, తెలుగుదేశం 2-4 స్థానాలు గెలువవచ్చని భావిస్తున్నాము. 20 శాతం ఓటర్ల మనోగతం ఎవరికీ అంతు చిక్కలేదు. వారు వేసే ఓటుపై ఫలితాలు అటు ఇటు మారవచ్చు కూడా. చూద్దాం రేపు మద్యాహ్నం లోపు ఫలితాలు ఎటూ రానున్నాయి.  

No comments:

Post a Comment