Friday 1 June 2012

ఉప ఎన్నికల లోపుగా మచ్చపడ్డ మంత్రుల అరెస్టు ?


వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర్ర ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో విడుదలయిన 26 జి.వోలకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులను దశలవారీగా సి.బి.ఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వాక్ పిక్ కుంభకోణంలోమోపిదేవి వెంకటరమణ అరెస్టయిన విషయం విదితమే. అదేవిధంగా అప్పుడు మంత్రులుగా పనిచేసిన గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు లతో సహా మరో ఇద్దరు మంత్రులను అరెస్టు చేసే అవకాశం ఉందని మీడియా కోడై కూస్తోంది. వీరు అరెస్టును తప్పించుకునేందుకు గాను ముఖ్య మంత్రి స్థాయిలో ప్ర.యత్నం  చేసి వీలుకాక కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికలలో జగన్ అరెస్టు వల్ల సానుభూతి రాకుండా ఉండడం కోసం వారిని ఉప ఎన్నికలలలోపుగా అరెస్టు చేసేందుకు తద్వారా జగన్ పై సానుభూతిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుండడం విశేషం. ఏది ఏమైనా రాజశేఖర్ రెడ్డి చేయించిన అవినీతి మరింత మందిని బలితీసుకునే అవకాశం ఉందని చెప్పకతప్పదు.

No comments:

Post a Comment