Saturday 2 June 2012

సి.బి.ఐ కస్టడీకి జగన్


తనను అరెస్టు చేయడం, మరియు తనపై అక్రమ కేసులు పెట్టడాన్ని కొట్టివేయాలని జగన్ వేసిన పిటీషన్ ను హైకోర్టు శనివారం కొట్టివేసింది. అంతే గాక సి.బి.ఐ  చర్యను సమర్థిస్తూ అరెస్టు సక్రమమేనని, మరిన్ని విషయాలు విచారించడానికి గాను జగన్ ను సి.బి.ఐ కస్టడీకి అప్పజెప్పింది. జగన్ ఈ కేసు నిమిత్తం ఢిల్లీ నుండి పెద్ద పేరున్న లాయర్లను పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. 37 అంశాలకు సంబంధించి, విదేశీ పెట్టుబడులకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలనే సి.బి.ఐ వినతిని మనిస్తూ 5 రోజుల కస్టడీకి ఇస్తూ తీర్పును వెలువరించింది. ఎన్నికలలో తాను ప్రచారం చేసుకోవాలని జగన్ పెట్టుకున్న పిటీషన్లతో పాటు అన్ని పిటీషన్లను కొట్టివేస్తూ తీర్పున వెలువరించింది. అయితే చాలామంది కె.ఏ. పాల్ కు ఎన్నికల దృష్ట్యా బెయిల్ దొరికినట్టు దొరుకుతుందేమోనని ఆశించారు. అయితే ఈ కేసును ఆ కేసుతో పోల్చి చూడలేమని, నేరం తీవ్రంగా ఉన్న దృష్ట్యా , నిందితుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్న దృష్ట్యా  జగన్ ను బెయిల్ ను నిరాకరిస్తూ సి.బి.ఐ కస్టడీకి అప్పజెప్పింది. దీంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో గుబులు అలుముకున్నట్టే. సానుభూతి కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీకి హైకోర్టు తీర్పు చెంప పెట్టులా భావిస్తున్నారు.  

No comments:

Post a Comment