Sunday 17 June 2012

భ్రమించిన బి.జె.పి కి భంగపాటు


దక్షిణ భారత దేశంలో అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పట్టు నిలుపుకోవాలనుకున్న బి.జె.పి కి పరకాలలో ఓటమితో భంగపాటు జరిగింది. ఇంతకు మునుపు మహబూబ్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికలలో టి.ఆర్.యస్ పై గెలిచి తెలంగాణా సాధన మాకే సాధ్యమని, తమది జాతీయ పార్టీ అని, ఇది వరకే మూడు రాష్ట్రాలు ఇచ్చిన చరిత్ర చూసి జనం తమను గెలిపించారని బి.జె.పి భావించింది. అంతేగాక పరకాలలో టి.ఆర్.యస్ తో సంబంధాలు బెడిసి కొట్టడంతో జె.ఏ.సి మద్ధతు ఇవ్వకపోయినా పరకాలలో తామే గెలుస్తామని బీరాలు పలికింది. ఈ పరకాలలో పాగా వేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడే తిష్టవేసి ప్రచారాన్ని పర్యవేక్షించారు కూడా. అంతేగాకుండా జాతీయనాయకురాలైన సుష్మా స్వరాజ్ ను రప్పించి బహిరంగ సభ కూడా నిర్వహించారు. అయితే 12న జరిగిన ఉప ఎన్నికలలో పోటీ ప్రధానంగా టి.ఆర్.యస్ కు వై.యస్. ఆర్ పార్టీలకు మధ్యే సాగడంతో బి.జె.పి కి పరాజయంతో పాటు పరాభవం మిగిలినదనే చెప్పాలి.

No comments:

Post a Comment