Monday 11 June 2012

జగమొండి జగన్ : నార్కో పరీక్షలకు సి.బి.ఐ. పిటీషన్


అక్రమాస్తుల కేసులలో సి.బి.ఐ .కస్టడీలో విచారణను ఎదుర్కోన్న జగన్మోహన్ రెడ్డి పొంతనలేని విధంగా మరియు సరైన సమాధానాలు చెప్పలేదని సి.బి.ఐ వాదిస్తోంది. సరైన సమాధానాలు చెప్పించడానికి గాను నార్కో పరీక్షలకు అనుమతి కోరుతూ సి.బి.ఐ కోర్టులో సి.బి.ఐ పిటీషన్ వేసింది. విదేశాల నుండి తన కంపెనీలలోకి పారిన నిధుల వివరాలను ఏమీ అడిగినా తెలియదనే సమాధానం చెప్పారని తెలుస్తోంది. అలాగే ఏది అడిగినా తన ఆడిటర్ విజయసాయిరెడ్డిని అడుగమని చెప్పినట్టు అంటున్నారు. అక్రమాస్తులు సంపాదించలేదని, కేసు అక్రమంగా బనాయించారని తాను నిర్దోషినని వాదించుకునే అవకాశం ఉన్నాఆ విధంగా మాట్లాడలేకపోవడానికి ఇప్పటికే సి.బి.ఐ సేకరించిన సాక్ష్యాలతో ఏమి చెబితే ఏమి నెత్తికొస్తుందోనని మొండికేస్తున్నట్టు తెలుస్తున్నది. జగన్ తన నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు ఇంకా అవకాశం ఉంది. చూద్దాం ఏమి చేయనున్నారో.. ఈ కేసును సి.బి.ఐ కోర్టు ఈ నెల 14 వతేదికి వాయిదా వేసింది. ఆ రోజు నార్కో పరీక్షలకు అనుమతి ఇవ్వలా వద్దా తీర్పు చెప్పనున్నారు. అయితే జగన్ తరపున న్యాయవాదులు ఇలాంటి పరీక్షలకు అనుమతిని ఇవ్వవద్దని పిటీషన్ వేయడం జరిగింది. మొత్తానికి విజయసాయిరెడ్డి జగన్ కు మంచి శిక్షణే ఇచ్చి సి.బి.ఐ అధికారులు సహనానికి పరీక్షలు పెడుతున్నట్టే..

No comments:

Post a Comment