Saturday 2 June 2012

రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు


రాష్ట్ర్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం మంచి ఊపు మీద ఉంది. ఎదుటి వారిపై బురద జెల్లడానికి ఉన్న  అన్నింటిని అన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికల ప్రచారం మొదలవడంతోనే వై.యస్.ఆర్ పార్టీ అధ్యక్షుడిని అవినీతి, అక్రమాస్తుల కేసుల విచారణ నిమిత్తం సి.బి.ఐ అరెస్టు చేయడంతో మొత్తం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయి గందరగోళంగా తయారయిందని చెప్పవచ్చు. అంతకు మునుపు జగన్ ను రాజకీయంగా అణగద్రొక్కుతున్నార్న దానికి అనుకూలంగా ఉన్న ప్రజానీకం జగన్ అరెస్టుతో ఓటర్ల మనోగతం మారిపోయినట్టు కనబడుతోంది. ముఖ్యంగా హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత సి.బి.ఐ అరెస్టు చేయడం సక్రమమేనని హైకోర్టు తీర్పు నివ్వడంతోను మరియు గాలి జనార్థన్ రెడ్డి కేసులో న్యాయమూర్తి బెయిల్ కోసం లంచం తీసుకున్న సంఘటనను సి.బి.ఐ బట్టబయలు చేయడంతోను జనం అభిప్రాయంలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. అంతేగాక జగన్ స్థానంలో ప్రచారానికి దిగిన విజయమ్మ, షర్మిల లు ప్రచారంలో రాజశేఖర్ రెడ్డి చావును కూడా రాజకీయానికి వాడుకోవడంతో సానుభూతి స్థానంలో మరింత వ్యతిరేకత పొడసూపినదని సమాచారం. దీంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అయోమయంలో పడిపోయింది. వలసలలు వస్తారనుకున్న యం.ఎల్.ఏ లు కూడా పునరాలోచలో పడ్డారు. తెలుగుదేశం నూజీవీడు యం.ఎల్.ఏ రామ కోటయ్య తాను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన నానీ తో పాటు మరో 5-10 మంది వస్తారనుకున్నా వారేమీ వలసలు వచ్చేట్టు లేదు. ఇంతకు మునుపు కన్నా ఆ పార్టీ నాయకుడు జగన్ పై అవినీతి ఆరోపణలు సునామీలా చుట్టు ముడుతున్నాయి. ఈ లోపుగా కాంగ్రెస్ చాపక్రింద నీరు లా కేడర్ ను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ, 1 లోకసభ స్థానాలలో ఇంతకు మునుపు అన్నీ తామే గెలుస్తామని చెపుతూ వచ్చిన వై.యస్.ఆర్ పార్టీ ఇప్పుడు అంత నమ్మకంతో లేదు. ప్రస్తుతం ఆ పార్టీ పూర్తిగా సానుభూతి పవనాలపైననే ఆశలు పెట్టుకోనున్నది. తెలంగాణాలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక అసెంబ్లీ స్థానం పరకాలలో అయితే కొండాసురేఖ గెలుపు పై ఎవరూ నమ్మకంతో లేరు. అక్కడ టి.యస్.ఆర్., బి.జె.పిలు పోటా పోటీగా గెలుపు బాటలో ఉన్నాయి. ఇక చిరంజీవి ఖాళీ చేసిన తిరుపతిలో అయితే అప్పుడే కాంగ్రెస్ ఆభ్య్రర్థి తన ఓటమి ఖాయ మన్నట్టు, తనకు పార్ఠీ వారే వెన్నుపోటు పొడుస్తున్నట్టు విలేకరులతో వాపోయారు. అక్కడ గతంలో కరుణాకర రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గతంలో చిరంజీవి పై ఓడిపోయారు. ఇప్పుడు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పై పోటీలో ఉన్నా ఆయనపై ఆరోపణలు ఆయనకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. అక్కడ టి.డి.పి అభ్యర్థి చదలవాడకు గెలుపు అవకాశం రోజు రోజుకు పెరుగుతోంది. అదేవిధంగా మిగిలిన నియోజక వర్గాలలో కూడా సమీకరణలు మారుతున్నాయి. ఈ లెక్కలన 18 స్థానాలకు గాను వై.యస్.ఆర్ పార్టీ 7-9 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. మిగిలిన స్థానాలలో కాంగ్రెస్ చెరి సగం పంచుకుంటాయి. ఈ ఉప ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిచినా వై.యస్.ఆర్ పార్టీ ప్రస్తుతం తన ప్రక్కన ఉన్న కొంత మంది. యం.ఎల్.ఏల ను కోల్పోకతప్పదు.  ఒక వేళ అన్ని సీట్లు గెలువగలిగితే కాంగ్రెస్ నుండి వలసలు మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment