Monday 4 June 2012

సి.బి.ఐ కి కొరకరాని కొయ్యగా జగన్



తనను విచారిస్తున్న సి.బి.ఐ కి జగన్ చుక్కలు చూపుతున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి  ప్రవర్తించినట్టుగానే అన్నిటికీ తెలియదు అని సమాధానం చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామానికి జగన్ ఉల్లాసంగా ఉంటుంటే ఏమి చేయాలో తెలియని సి.బి.ఐ విస్తూ పోతోంది. దీంతో సత్యసోధన పరీక్షల నిమిత్తం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందేమో వేచి చూడాలి. తాను చేసిందంతా చేసి చివరికి అమాయకుడిలా నటిస్తున్న జగన్ సానుభూతి పవనాలలతో ఉప ఎన్నికలు గెలవగలమని అనుకుంటున్నారు. తల్లి, చెల్లి వీధులు తిరుగుతు కన్నీళ్ళతో ప్రచారం చేస్తుండటం ఆయనకు కలసి వస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే సభలు వచ్చిన వారంతా తనకే ఒటు వేస్తారనుకున్న వారంతా గతంలో మట్టి కరిచారు. ప్రజలు విక్షచణా జ్ఞానంతో ఆలోచించి ఓటు వేస్తే మాత్రం ఉప ఎన్నికలలో జగన్ పార్టీ కష్టాలు ఎదుర్కొంటుంది. ఇక సి,.బి.ఐ కి జగన్ కేసు ఒక సవాలుగా పరిణమిస్తోంది. చూద్దాం ఏమి జరుగుబోతుందో.. 
 

1 comment:

  1. వైఎస్స్ కు జనాల్లో విపరీతమైన మోజు ఉంది...ఒకటి రెండు ఎలక్షన్లలో ఓట్ల వరద ఆ పార్టీకి ఖాయం!!జగన్ను చూసో..విజయమ్మ గారిని చూసో ఓట్లు వేయబోవడం లెదు...వైఎస్స్ తమకు ఏదో చేసాడన్న అభిప్రాయం జనాల్లో ఊంది..

    ReplyDelete