జగన్ ఆక్రమాస్తుల కేసును విచారిస్తున్న సి.బి.ఐ. తాజాగా
రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్యను విచారణ నిమిత్తం రావలసినదిగా కోరింది. రాజశేఖర్
రెడ్డి ప్రభుత్వంతో వివాదాస్పదంగా జారీ అయిన 26 జి.ఓ లలో పొన్నాలకు సంబంధించినవి
కూడా ఉన్నాయి. అప్పుడు ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసేవారు. ఇండియా
సిమెంట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటి కేటాయింపులకు మంత్రి జి.ఓ
జారీ చేశారు. అదే కంపెనీ తిరిగి జగన్ కంపెనీలో రూ. 100 కోట్ల పైబడి పెట్టుబడులు
భారీగానే పెట్టింది. ఇది వరకే ఆశాఖ కు కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యాదాస్ ను
సి.బి.ఐ విచారించడం జరిగింది. అప్పటి మంత్రి మండలిలో పనిచేసిన మోపిదేవి వెంకటరమణ
అరెస్టు అయి సి.బి.ఐ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇంకా సబితా
ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, లాంటి మంత్రులు పొన్నాలకు పిలుపు రావడంతో తమకు
పిలుపు ఎప్పుడు వస్తుందోనని కలత చెందుతున్నారు. వీరందరినీ సి.బి.ఐ విచారించడానికి
ఇది వరకే నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.
No comments:
Post a Comment